`ముఖ్యమంత్రి గతవారం రోజులనుంచీ గందరగోళంలో, కంగారుగా ఉన్నారని, ఆయన జాతకం తిరగబడబోతోందని, టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సెర్బియాలో జూలై 30న అరెస్ట్ అయిన ఏ3 నిమ్మగడ్డ ప్రసాద్, గతంలో వ్యాపార పనుల నిమిత్తం దుబాయ్ వెళ్లాలని సీబీఐని కోర్టుని కోరడంతో వారు అనుమతించారు. వ్యాపార పనులపేరుతో విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను సెర్బియాలో అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి వ్యాపారం చేస్తామని యూఏఈకి చెందిన రస్ అల్ ఖైమా కంపెనీ, వాన్ పిక్ పేరుతో పోర్టుల నిర్మాణం, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా 51శాతం పెట్టుబడి పెడితే, మిగిలినవాటా నిమ్మగడ్డ, అతని బృందం పెట్టడం జరిగిందన్నారు. వాన్ పిక్ కు ఆనాటి వై.ఎస్ ప్రభుత్వం 28వేల ఎకరాలను అతితక్కువధరకే కేటాయించగా, రస్ అల్ ఖైమా పెట్టుబడులు పెట్టడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా పెట్టుబడులను దుర్వినియోగంచేసిన నిమ్మగడ్డ ప్రసాద్, లేనికంపెనీలను ఉన్నట్లుగా సృష్టించి, రూ.854కోట్ల వరకు జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇతరకంపెనీల్లోకి మళ్లించడం జరిగిందన్నారు. ఈనేపథ్యంలో జగన్ ను, ఏ2 విజయసాయిరెడ్డిని, ఏ3 నిమ్మగడ్డను అరెస్ట్ చేయడం జరిగిందని, తరువాత కండీషన్ బెయిల్ పై వారిని విడుదల చేసిందన్నారు.

అలా బెయిల్ పై వచ్చిన నిమ్మగడ్డను రెడ్ కార్నర్ నోటీసును ఆధారంగా చేసుకొని సెర్బియాలో అరెస్ట్ చేసినట్లు వర్ల తెలిపారు. అక్కడ అరెస్ట్ అయిన నిమ్మగడ్డ, తన వాంగ్మూలంలో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడని, గడచిన 7నెలల నుంచి సెర్బియా వీధుల్లోనే తిరుగుతున్నాడన్నారు. ఈ వ్యవహారంపై రస్ అల్ ఖైమా వారు భారత ప్రభుత్వానికి ఒక లేఖరాశారని, ఆ లేఖలో నిమ్మగడ్డ తమవద్ద కాజేసిన సొమ్ముని, జగన్మోహన్ రెడ్డికి చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లుగా చెబుతున్నాడని, నిమ్మగడ్డ చెప్పిన సదరు వ్యక్తిని ‘మీరు అరెస్ట్ చేసి, మాకు అప్పగిస్తారా...లేక ఆ వ్యక్తి నుంచి మాకు రావాల్సిన సొమ్ముని మాకు ఇప్పిస్తారా’ అని లేఖలో కోరడం జరిగిందన్నారు. రస్ అల్ ఖైమా లేఖ రాయడంతో జగన్ బృందం గంగవెర్రులెత్తిపోయిందని, ఆ వెంటనే ముఖ్యమంత్రి తనను తాను రక్షించుకోవడానికి ఢిల్లీకి పరుగులు పెట్టాడన్నారు. తనను రస్ అల్ ఖైమాకు అప్పగించవద్దని వేడుకుంటూ, జగన్మోహన్ రెడ్డి, ప్రధానిమోదీని శరణుజొచ్చాడన్నారు. ఇదంతా నిజమో.. కాదో జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని, ఇంకా ప్రజల్ని మభ్యపెడుతూ, దాగుడుమూతలు ఆడుతామంటే కుదరదని వర్ల తేల్చిచెప్పారు. తనను రస్ అల్ ఖైమా బారినుంచి బయటపడేయాలని కోరుతూ, ప్రధానితో, హోంమంత్రితో జగన్మమోహన్ రెడ్డితో భేటీలు జరిపింది వాస్తవమో... కాదో ఆయనే చెప్పాలన్నారు.

రస్ అల్ ఖైమా దేశానికి, మనదేశానికి మధ్యన జగన్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకత రాష్ట్ర ప్రజలందరిలోనూ ఉందన్నారు. సెర్బియాలో అరెస్ట్ కాబడిన నిమ్మగడ్డను విడిపించడం కోసం, వైసీపీకి చెందిన 22మంది ఎంపీలు మూకుమ్మడిగా వెళ్లి, కేంద్ర విదేశాంగశాఖా మంత్రి జైశంకర్ ను కలిసి మొరపెట్టుకున్నది నిజం కాదా అని వర్ల ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు తనను కలిసి వెళ్లాక, జైశంకర్, జగన్ అవినీతి చరిత్రను తెలుసుకొని అవాక్కయ్యారని, వెంటనే వైసీపీ ఎంపీలు ఇచ్చిన విజ్ఞప్తిని పక్కన పెట్టేశారని వర్ల తెలిపారు. రస్ అల్ ఖైమా బారినుంచి ముఖ్యమంత్రి జగన్ బయటపడాలంటే, నిమ్మగడ్డ తన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన రూ.854కోట్లు తిరిగిచ్చేయడం తప్ప మరోమార్గం లేదని, ఏపీ ప్రజానీకమంతా భావిస్తోందని, జగన్ భవిష్యత్ ని గురించి, రాష్ట్ర భవిష్యత్ ను గురించి తలుచుకొని రాష్ట్ర ప్రజానీకమంతా కంగారు పడుతోందని, వారి సందేహాలను, ఆందోళనను నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. తనకేమీ సంబంధంలేకపోతే జగన్మోహన్ రెడ్డి, బయటకు వచ్చి నిమ్మగడ్డ అంశంపై, రస్ అల్ ఖైమా లేఖపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు.

నిమ్మగడ్డ అరెస్ట్ అయింది మొదలు, ఇప్పటివరకు జరిగిన అన్ని అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయింది మామూలు కేసులో కాదని, ఆయన ఆర్థిక నేరాల గురించి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఇప్పటికే అనేకమార్లు వ్యాఖ్యానాలు చేయడం జరిగిందన్నారు. జగన్ బెయిల్ ను సుప్రీంకోర్టు తిరస్కరించినప్పుడు, నాటి న్యాయమూర్తి జస్టిస్ సదాశివం మాట్లాడుతూ, క్షణికోద్రేకంలో చేసే హత్యలు, ఖూనీల కంటే ఆర్థికనేరాలు అత్యంత ప్రమాదకరమైనవని, ఆర్థిక నేరాలు చేసినవారిని వదిలేస్తే సమాజ మనుగడకే హానిచేస్తారన్నది నిజం కాదా అని రామయ్య నిలదీశారు. తనపై ఉన్న కేసులభయంతోనే జగన్ కోర్టుల విచారరణకు హాజరవకుండా భయపడుతున్నాడన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని, హోంమంత్రిని కలిసిన జగన్ , తరువాత కేంద్రమంత్రి జైశంకర్ ను కలవాలని భావించి, విజయసాయి వద్దనడంతో వెనక్కు తగ్గింది నిజం కాదా అని రామయ్య ప్రశ్నించారు. ఈ దేశానికిచెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని వేరేదేశం వారు అరెస్ట్ చేస్తే, ఏపీ ప్రజలకు ఎంతటి అవమానమో జగనే ఆలోచించాలన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అంశం అన్ని ప్రతికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయని, అన్నింట్లో జగన్ పేరుని ఉటంకించారని, అటువంటప్పుడు దానిపై వివరణ ఇవ్వాల్సిన బాద్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అత్యంత ఆప్తుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, చాలా రోజుల గ్యాప్ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, జూలై 2006లో, రాజశేఖర్ రెడ్డి రాసిన లేఖను ఉండవల్లి బయట పెట్టారు. అందులో, రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చెయ్యాలి అంటూ, రాజశేఖర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఉంది. ఇప్పుడు ఇదే విషయం పై, ఉండవల్లి జగన్ మోహన్ రెడ్డిని కోరారు. హైకోర్ట్ బెంచ్ ని, రాజమండ్రిలో ఏర్పాటు చెయ్యాలని, ఉండవల్లి జగన్ ను కోరారు. ఇదే సందర్భంలో, 14 ఏళ్ళ క్రితం, రాజశేఖర్ రెడ్డి, రాజమండ్రిలో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేసే ఆలోచన చేసారని గుర్తు చేస్తూ, ఆ నాటి లేఖలు బయట పెట్టారు ఉండవల్లి. ఇదే విషయాన్నీ జగన్ కు లేఖ రూపంలో తెలియ చేస్తూ, ఆ నాడు రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని వివరించారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, హైకోర్ట్ బెంచ్ ని రాజమండ్రిలో ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని కోరారు.

undavalli 19022020 2

ఇప్పటికే ఈ రాజధానులు, హైకోర్ట్, అసెంబ్లీ విషయం పై, రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఉన్న రాజధానిని మూడు ముక్కలు చెయ్యటం, అలాగే హైకోర్ట్ ని కర్నూల్ తరలించి, హైకోర్ట్ బెంచ్ ని అమరావతి, వైజాగ్ లో పెడతాం అంటూ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎలాగూ వైజాగ్ కి సచివాలయం తరలిస్తున్నారు కాబట్టి, హైకోర్ట్ బెంచ్ ని రాజమండ్రిలో పెట్టాలి అంటూ, ఉండవల్లి చెప్పటమే కాదు, అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, ఇలా చెయ్యాలి అనుకున్నారు అంటూ, ఒక లేఖ కూడా ఉండవల్లి బయట పెట్టరు. దీంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి, ఆ లేఖతో ఉండవల్లి ఫిక్స్ చేసారనే చెప్పాలి. ఏ స్ట్రాటజీతో అయితే, జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేద్దామని అనుకున్నారో, ఇప్పుడు అదే స్ట్రాటజీతో ఉండవల్లి జగన్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక మరో పక్క రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై కూడా ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో రాబడి తీవ్రంగా పడిపోయింది అని, కేంద్రం పరిస్థితి కూడా అలాగే దినదిన గండంగా ఉందన్నారు. ఒక పక్కన కేంద్రం నుంచి రావాల్సినవి రకాపోగా, రాష్ట్రంలో కూడా ఆదాయం పడి పోయింది అని ఉండవల్లి అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భయానకంగా ఉందని ఉండవల్లి అన్నారు. ఈ సారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత, మొత్తం అర్ధం అవుతుందని అన్నారు. దేవుడు ఉన్నాడు, అన్నీ చూసుకుంటాడని, జగన్ అంటూ ఉంటారని, ఇప్పుడు ఆ దేవుడే జగన్ ను ఆదుకోవాలని, పరిస్థితి అలా ఉందని అన్నారు. రాజశేఖర్ రెడ్డి కొడుకుగా, మాట తప్పను, మడమ తిప్పను అని జగన్ అంటూ ఉంటారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టు కోవాలని కోరుకుంటున్నా అని ఉండవల్లి అన్నారు.

ఐటి శాఖ పంచనామాల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి, వేడి వాతారణాన్ని సృష్టిస్తుంది. ఇటీవల ఐటి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ ఇంట్లో దాడులు నిర్వహించింది. దీంతో పాటు దేశంలో వివిధ చోట్ల దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి వివిధ ప్రాంతాలో ఆర్థిక లావాదేవీలు డొల్ల కంపెనీల పేరిట సాగినట్లు గుర్తించినట్లు ఐటి శాఖ అధికారికంగా పత్రికా ప్రకటన చేసింది. తాము దాడులు జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిలో, మూడు ఇన్ఫ్రా కంపెనీలు, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఉన్నట్లుగా వెల్లడించింది. దీంతో అధికార వైకాంగ్రెస్ నాయకులు, ఆ మూడు కంపెనీలు అనేది వదిలేసి, కేవలం చంద్రబాబు పీఎస్ అని పట్టుకుని, తెలుగుదేశం నేతల పై విష ప్రచారం చేసారు. 2 వేల కోట్లు చంద్రబాబు పీఎస్ ఇంట్లోనే దొరికాయి అంటూ, తప్పుడు ప్రచారం చేసారు. ఈ క్రమంలో వారి ఆరోపణలు అభూత కల్పనలని చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో కేవలం రూ.2.63 లక్షలు నగదు, 12 తులాల బంగారం గుర్తించి వదిలేసారంటూ, ఐటి శాఖ పంచనామా నివేదిక బయట పడింది.

అది ఐటి శాఖ విడుదల చేసిన పంచనామా కావటంతో, వైసీపీకి ఒక రోజు సౌండ్ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేస్తామంటూ తెలుగుదేశం నాయకులు బొండా ఉమా, బుచ్చయ్యచౌదరి.యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమాలు అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. అధికార పార్టీ మంత్రులు బొత్సా సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాద్, అనిల్‌కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలినాని తప్పుడు ప్రచారం చేసారని, అక్కడ జరిగింది 3 ఇన్ఫ్రా కంపెనీల మీద అయితే, చంద్రబాబు మీద అంటూ తప్పుడు ప్రచారం చేసారని అన్నారు. అయితే పెండ్యాల శ్రీనివాసు ఐటి పంపిన పంచనామాతో టిడిపి ఎదురు దాడి చెయ్యటంతో, వైసీపీకి ఏమి చెయ్యాలో అర్ధం కాక, తాము ప్రజల్లో చులకన అవుతామని గ్రహించి, మరో డ్రామాతో ముందుకు వచ్చింది.

కడపలో ఎవరో ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ మీద జరిగిన ఐటి దాడుల పంచనామా రిపోర్ట్ చూపించి, ఇది శ్రీనివాస్ పంచనామా రిపోర్ట్ అని, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసింది. వేల డాక్యుమెంట్లు సీజ్ చేసారని, ఇక చంద్రబాబు పని అయిపొయింది అంటూ, మరో ప్రచారానికి తెర లేపింది. అయితే అందులో కూడా డబ్బు, నగలు తరిగి ఇచ్చేసినట్టు ఉంది. ఎక్కడా రెండు వేల కోట్లు అనే విషయం లేదు. సహజంగా కంపెనీల మీద దాడి చేసిన సమయంలో, కొన్ని డాక్యుమెంట్ లు సీజ్ చేస్తారు. అవి అన్నీ వెరిఫై చేసుకుని వదిలి పెడతారు. అయినా, ఈ ఏవీ సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్ కు, చంద్రబాబుకి ఏమి సంబంధం అని, ముందు ఆ రెండు వేల కోట్లు విషయం తేల్చిండి అంటూ టిడిపి అడిగిన ప్రశ్నకు, ఒక అబద్ధానికి, పది అబద్ధాలు ఆడి, అదే నిజం అని నమ్మించే ప్రయత్నంలో బొక్క బోర్లా పడుతుంది వైసీపీ. అయినా రెండు వేల కోట్లు చంద్రబాబు వద్ద దొరికితే, ప్రాధాన్ మోడీ, హోం మంత్రి అమిత్ షా చూస్తూ కూర్చుంటారా ?

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అంశంలో మరోక కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార పక్షమైన వైకాపా అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లులను అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించుకోగా, మండలిలో సెలెక్టు కమిటీకి పంపిస్తూ కౌన్సిల్ చైర్మన్ ఎంఏ షరీఫ్ తన విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి శాసన మండలిని రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మండలి ఛైర్మన్ అకస్మాత్తుగా మంగళవారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందతో భేటీ అయి,పలు కీలక అంశాలపై చర్చించటం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ భేటీ సరికొత్త ఊహాగానాలకు తెరతీసిందనటంలో ఎలాంటి సందేహం లేదు. శాసన మండలి రద్దు చేసేందుకు ప్రభుత్వం రాజ్యాంగబద్దంగా వ్యవహరించకుండా, నియమాలను ఉల్లంఘిస్తుందని చైర్మన్ షరీఫ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన ప్రభుత్వం కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే, రదైనట్లుగా వ్యవహరిస్తోందని తెలిపారు.

sharif 19022020 2

ఇదే సమయంలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై మండలిలో జరిగిన చర్చ అనంతర పరిణామాలలో తన విచక్షణాధికారాలతో సెలెక్టు కమిటీకి పంపిన విషయాన్ని గవర్నర్‌కు ఛైర్మన్ షరీఫ్ వివరించారు. ఈ అంశంలో ప్రభుత్వ ఒత్తిడితో అధికారులు సెలెక్టు కమిటీ ఏర్పాటు కాకుండా తన ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మనీ బిల్లులకు, సాధారణ బిల్లులకు వ్యత్యాసం ఉంటుందని ఈ రెండు బిల్లులు మనీ బిల్లులు కావన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి షరీఫ్ తెచ్చారు. మనీ బిల్లులకు వర్తించే నిబంధనలను ఈ బిల్లులకు సాకుగా చూపుతూ మండలి కార్యదర్శి వెనక్కి పంపటం జరిగిందని, ఇది పూర్తిగా సభా గౌరవాన్ని మంటగలపటమేనని చెప్పారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికి రెండుసార్లు తాను ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, అయితే మండలి కార్యదర్శి వీటిని వెనక్కి తిప్పి పంపారని గవర్నరు ఫిర్యాదు చేశారు.

sharif 19022020 3

మండలి కార్యదర్శితో పాటుగా, మరో అధికారి పై కూడా, మండలి చైర్మెన్, గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. తేదీలతో సహా వీళ్ళు చేసిన పనిని, సవివరంగా గవర్నర్ కు వివరించి, వారిని వెంటనే సస్పెండ్ చెయ్యాలి అంటూ, చైర్మెన్ కోరటం సంచలనంగా మారింది. ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది, ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలన్నింటిని సానుకూలంగా విన్న తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మండలి ఛైర్మన్ షరీఫ్ అకస్మాత్తుగా గవర్నర్ బిశ్వభూషణ్ భేటీ కావటం రాజకీయ కాకను పెంచింది. ఇదే సమయంలో మండలి రద్దు అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీతోపాటు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకిస్తుండటంతో భవిష్యత్ పరిణామాలు ఏవిధంగా ఉంటాయోనన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Advertisements

Latest Articles

Most Read