మండలి రద్దు, మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో లాబీయింగ్ కు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. రాష్ట్ర శాసనమండలి రద్దును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్లను కోరిన నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందని ఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. దీంతో వాస్తవ పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించడం ద్వారా ప్రభుత్వ నిర్ణయానికి చెక్ పెట్టేందుకు టీడీపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్సీలు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాంవేసి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇంకా పలువు కేంద్ర మంత్రులను కలిసి వివరించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీల ఢిల్లీ పర్యటనపై పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. సీనియర్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సారథ్యంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో, ఎమ్మెల్సీలు పరుచూరి అశోక్బబు, బుద్దా వెంకన్న, సత్యనారాయణరాజు, రామ్మోహన్, దీపక్ రెడ్డి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. ఎన్డీఏ నుంచి వైదొలగిన నేపథ్యంలో బీజేపీకి టీడీపీ రాజకీయ ప్రత్యర్ధిగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రధాని, కేంద్రమంత్రులు అపాయింట్ మెంట్లపై సందేహాలు వ్యకమవుతున్నాయి. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వైసీపీ, టీడీపీ తమకు ప్రధాన శత్రువులని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నా ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైసీపీ భాగ స్వామి అవుతుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బీజేపీ నేతలు కొట్టి పారేస్తున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జగన్ల మధ్య జరిగిన ఆంతరంగిక చర్చల పర్యవ సానం ఏమిటనేది ప్రతిపక్ష పార్టీలకు అంతుచిక్క టంలేదు.

కాగా మూడు రాజధానులను వ్యతిరే కిస్తూ అమరావతిలో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో పాటు ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మండలి రద్దుపై కూడా కేంద్రానికి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణ యించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఉన్నం దున మండలి సెలక్ట్ కమిటీకి అప్పగిస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారని, దీంతో మండలినే రద్దుచేస్తూ శాసనసభలో అధికార పార్టీ ఏకపక్షంగా తీర్మానం చేసిందనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లా లని టీడీపీ భావిస్తోంది. చైర్మన్ బిల్లుల్ని సెలక్ట్ కమి టీకి పంపిన నేపథ్యంలో మండలి రద్దు చేయటం రాజ్యాంగ విరుద్ధమనే వాదనను కేంద్ర పెద్దలకు వినిపించాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించారు. మండలి రద్దు, మూడు రాజధానుల నిర్ణయంతో పాటు ప్రతి పక్షాలపై ప్రభుత్వ వేధింపులు, ప్రజా వ్యతిరేక చర్య లపై కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటీవల రెండుసార్లు చేసిన ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారన్నారు. గత ఐదున్నర సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తూనే వస్తోందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన చట్టం హామీ లను అమలు చేయలేదని, కనీసం కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధుల కేటాయింపు ఊసే లేదన్నారు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం గురించి మాట్లాడడం లేదని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ పక్కన పెట్టేశారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పదే పదే కేంద్రం చెబుతున్నా ఏపీకి చెందిన ఒక్క బీజేపీ నాయకుడు కూడా నోరు తెరవడం లేదని రామకృష్ణ అన్నారు. జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయ అవకాశవాదంతో ఢిల్లీలో జరిగిన విషయాలను బయటపెట్టడం లేదన్నారు.

ముఖ్యమంత్రికి, కేంద్ర మంత్రులకు మధ్య జరిగిన చర్చల సారాం శాన్ని తక్షణం ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 17న వామపక్షాల ఆధ్వ ర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాల యాల వద్ద ధర్నాలు చేపట్టనున్నామన్నారు. ఈ ధర్నాల్లో అన్నివర్గాల ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అయితే రామకృష్ణ ఇంతటితో ఈ విషయాన్ని వదిలి పెట్టలేదు. సమాచార హక్కు చట్టం, ఏపి చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి దరఖాస్తు పంపారు. జగన్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని, జగన్ ఏమి విజ్ఞాపనలు ఇచ్చారు, కేంద్రం ఇచ్చిన హామీల వివరాలు తెలియజేయాలని సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు.

మరో పక్క కాంగ్రెస్ పార్టీ కూడా, జగన్ ను ఈ విషయంలో విమర్సిస్తుంది. బీజేపీకి అతి విశ్వాసమైన మిత్రపక్షం వైకాపాయేనని ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు వ్యతిరేకంగా ఏస్ఆర్ సీకి ఓటేసి వచ్చి వైకాపా నాయకులు ఇక్కడ నీతులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీ పర్యటనలో ఎస్ఆర్టీసీ వ్యతిరేకమని మోడీకి, అమిత్ షాకు జగన్ చెప్పవచ్చు కదా అని ప్రశ్నించారు. బీజేపీకి అత్యంత విశ్వాస పాత్రమైన కాపలాదారు వైసీపీనే అని రాష్ట్ర ప్రయోజనాలు అనేది ప్రతి ఒక్కరికి ఒక వాడకంగా మారిందని అన్నారు. మండలి రద్దు రాష్ట్ర ప్రయోజనమా అన్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని బీజేపీ చెప్పినా వారి కాళ్ళు పట్టుకోవడానికి కారణం ఏమిటని శైలజానాథ్ ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ రాజధాని ఢిల్లీలోనూ సీన్ మారింది. రాష్ట్రంలో అధికా రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ భవన్లోనూ టిడిపిని బుల్ డోజ్ చేసింది. ఒకప్పుడు తెలుగుదేశంపార్టీకి పార్లమెంట్ భవన్లో అత్యంత ప్రాధాన్యత ఉండగా, ఇప్పుడు ఎక్కువ మంది ఎంపీలు ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేస్తుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్ భవన్లో స్థాన చలనం కలిగింది. ఈ లోపు మూడు గండాలు దాటుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ సారి తన కార్యాలయన్ని తరలించక తప్పలేదు. పార్లమెంట్ భవన్లో అందరికీ తెలిసిన లోకసభ, రాజ్యసభ, జాయింట్ సెషన్ నిర్వహించేటప్పుడు ఉపయోగించే సెంట్రల్ హాల్ తో పాటు, ప్రధానమంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రుల కార్యా లయాలు ఉంటాయి. అలాగే సంఖ్యా బలం ఆధా రంగా రాజకీయ పార్టీలకు కూడా గదులను కేటా యిస్తూ ఉండటం సర్వసాధారణం. పార్లమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 41 గదులు ఉండగా, 9, 10వ నెంబర్ గదుల్లో ప్రధాన మంత్రి కా ర్యాలయం, 8వ నెంబర్ గదిలో హోం మంత్రి అమిత్ షా కార్యాలయం ఉన్నాయి.

6, 7వ నెంబర్ గదుల్లో కీలక మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. 2వ నెంబర్ నుండి 4వ నెంబర్ వరకూ భారతీయ జనాతా పార్టీ కార్యాలయం, ఎన్డీయే నేత కార్యాలయాలు ఉన్నాయి. వీటి మధ్యలో 5వ నెంబర్ గదికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అర్థమవుతోంది. అటువంటి ప్రాధాన్యత కలిగిన ఆ గదిలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా కొనసాగింది. ఐదేళ్లు, పదేళ్లు కాకుండా ఏకంగా 3 దశబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయమే ఆ గదిపై అధికారం చెలాయించింది. ఈ విధంగా 1989 సంవత్సరం నుండి ఆ గది తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయంగా ఉండేది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి కాని, టిడిపి గది మాకే కావాలి అని పట్టుబట్టటంతో ఇప్పుడు ఆ కార్యాలయాన్ని 3వ అంతస్తులోనికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3వ అంతస్తులోని 118వ నెంబరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని తరలించాల్సి వచ్చింది.

పార్లమెంట్ భవన్ లో గదుల కేటాయింపు ఎలా జరుగుతుందోనని పరిశీలిస్తే పార్టీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవనంలోని గదులను లోక్ సభ స్పీకర్ రాజకీయ పార్టీల పార్లమెంట్ రీ కార్యా లయాలను కేటాయిస్తుంటారు. ఎక్కువ మంది ఎంపీలు కలిగిన రాజకీయ పార్టీలకు ప్రధాన మంత్రి, కేబినెట్ మంత్రుల కార్యాలయాలు ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో గదులు లభిస్తాయి. మిగిలిన పార్టీలకు 3వ అంతస్తులోని గదులను కేటాయించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలు గుదేశం పార్టీకి 1989లో నాటి పార్టీ ఎంపీల సంఖ్యా బలం ఆధారంగా పార్లమెంట్ భవన్లోని గ్రౌండ్ ఫ్లోర్ 5వ నెంబర్ గదిని కేటాయించారు. 1989 తర్వాత పార్టీ సంఖ్యా బలం తగ్గిన 3 సందర్భాల్లో ఆ గదిని టీఎంసీ, డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు కేటాయించారు. అయితే ఏ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ మాత్రం తమ కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా నాటి స్పీకర్లతో మాట్లాడి 5వ నెంబర్ గదిలోనే ఉండిపోయింది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల సంఖ్య లోకసభ, రాజ్య సభల్లో కలిపి 5 గురితో ఉంది.

దీంతో స్పీకర్ 5వ నెంబర్ గదిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ సభ్యులకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తెలుగుదేశం పార్లమెంటరీ సభ్యులకు 3వ అంతస్తులోని రూమ్ నెంబర్ 118 కేటాయించారు. అయితే 17వ లోకసభ ఏర్పాటు అయిన తర్వాత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు కూడా జరిగాయి. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆ 5వ నెంబర్ గదిని ఖాళీ చేయకపోవడంతో విజయసాయి రెడ్డి, బయటి శక్తుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తూ ఆ గదిని ఖాళీ చేయకుండా తెలుగుదేశం పార్టీ కొనసాగుతోందని ఆరోపిస్తూ ఒక లేఖను స్పీకర్ కు రాశారు. దీంతో స్పీకర్ వెంటనే స్పందిస్తూ పార్లమెంట్ భవన్ గ్రౌండ్ ఫ్లోర్లోని 5వ నెంబర్ గదిని ఖాళీ చేసి దాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సభ్యులకు అప్పగించాలని తెలుగుదేశం పార్టీకి ఒక లేఖ కూడా రాశారు. దీంతో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తన కార్యాలయాన్ని 5వ నెంబర్ గది నుండి 118వ నెంబర్ గదికి తాజాగా తరలించడంతో త్వరలోనే ఆ 5వ నెంబర్ గదిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేం దుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ గది కోసం, వైసీపీ ఎందుకు ఇంత మోజు పడుతుంది, ఎందుకు ఇంత పట్టుబడుతుందో ఎవరికీ అర్ధం కావటం లేదు.

వైసీపీ నేతలకు దమ్ము, దైర్యం ఉంటే చంద్రబాబు, జగన్‌ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ్లాడుతూ...ప్రతిసారి సాక్షి పేపర్‌ గురించి మాడాలంటే సిగ్గుపడుతున్నాం. ఐటి దాడుల్లో రూ. 2 వేల కోట్లు చంద్రబాబు మాజీ పీఎస్‌ వద్ద దొరికాయంటూ సాక్షి పేపర్‌, టీవీ, వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేశారు. కానీ వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారానికి ఐి శాఖ ఇచ్చిన పంచనామా వారికి చెంపపెట్టులా ఉంది. దీంతో వైసీపీ నేతలు, తేలు క్టుిన దొంగల్లా ఉన్నారు. సాక్షి మీడియాకు, వైసీపీ నేతలకు సవాల్‌ విసిరుతున్నా.. ఆ డబ్బు చంద్రబాబు గారి ఎకౌంటు లోకి ఎలా వచ్చిందో చెప్పాలి. జగన్‌లా చంద్రబాబు క్విడ్‌ ప్రోకో ద్వారా, జగన్‌లా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సూట్ కేసు కంపెనీలు పెట్టి డబ్బు సంపాదించలేదు. చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తుల్ని ప్రతి సంవత్సరం ప్రకిస్తున్నారు. అంతకంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా..తీసుకోమని వైసీపీ నేతలకు సవాల్‌ విసురుతున్నారు. చంద్రబాబు ఆస్తులపై, జగన్‌ అవినీతి ఆస్తులపై బహిరంగ చర్చకు టీడీపీ తరపున నేను వస్తా...వైసీపీ నేతలెవరికైనా చర్చకు వచ్చే దమ్ముందా?

ఏంటైలో అయినా..ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్దం. జగన్‌ తన తస్తులు ప్రకించడానికి ఎందుకు వణుకుతున్నారు. ఐటి దాడులపై సాక్షి మీడియా చేసిన అసత్య ప్రచారాన్ని మిగిలిన చానళ్లు, పత్రికలు ఛీ కొట్టాయి. వైసీపీకి రూ. 150 కోట్లు ముడుపులు ఇచ్చినందుకే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చారు. కాదని చెప్పే దైర్యం వైసీపీ నేతలకుందా? జగన్‌ ఎప్పుడు నిజాలు చెప్పరు. కోర్టులో కూడా ప్రతిశుక్రవారం నిజాలు చెప్పరు. పెద్ద నోట్ల ద్వారా అవినీతి జరుగుతోందని రూ. 2 వేల నోట్లు, 500 నోట్లు రద్దు చేయాలని కోరిన వ్యక్తి చంద్రబాబు. గత ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఆ డబ్బు ఎన్ని కంపెనీలను బెదిరిస్తే వచ్చిందో చెప్పగలరా? పీకల్లోతు అవినీతిపై కూరుకుపోయిన వైసీపీ చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. 2004 కు ముందు జగన్‌ ఆస్తులెంత ఇప్పుడెంత? అప్పుడు జగన్‌ క్టిన ఇన్కమ్ టాక్స్ ఎంత, ఇప్పుడున కడుతున్న ఇన్కమ్ టాక్స్ ఎంత? మంత్రి బుగ్గన అయినా ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలి.

జగన్‌ ఇంత డబ్బు ఎలా సంపాదించారు. ఏదైనా కంపెనీలో పనిచేశారా? కేవలం క్విడ్‌ప్రోకో , అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించారు. జగన్‌ అక్రమాస్తులపై చర్చకు సాక్షి చానల్‌కే వస్తా..సీనియర్‌ జర్నలిస్టును న్యాయనిర్ణేతగా పెట్టండి. చంద్రబాబు ఆస్తుల గురించి నేను చెప్తా...జగన్‌ ఆస్తుల గురించి నేనడిని ప్రశ్నలకు బుగ్గన సమాధానం చెప్పాలి. నవంబర్‌ 11.2019లో జరగిన ఐటి దాడి గురించి ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారు. ఇన్నాళ్లు గాడిదలు కాసారా? వైసీపీ నేతలు తమ కళ్లలో దూలం పెట్టుకుని ఎదుటి వారి కంటిలో నలుసును వెతుకున్నారు. ప్రతి సవంత్సరం చంద్రబాబు తన తస్తులు ప్రకిస్తుంటే జగన్‌ ఎందుకు ప్రకిచంట లేదో ప్రజలే జగన్‌ని అడగాలి. సాక్షి పత్రికలో రాస్తున్న అబద్దాల గురించి చైర్మన్‌ భారతిరెడ్డికి నేను బహిరంగం లేఖ రాశా. సాక్షికి విలువలు లేవు. సాక్షి నీచస్ధితికి దిగజారింది. ఇకనైనా సాక్షిలో మార్పు వచ్చిందేమో అని లేఖరాశా. జగన్‌ సొంత మనుషుల ఇన్‌ప్రా కంపెనీలకు ఎన్ని కోట్లు జమయ్యాయో చెప్పగలరా? జగన్‌కి చంద్రబాబుకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఇకనైనా వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడుపై అసత్య ఆరోపణలు మానుకోవాలి.

Advertisements

Latest Articles

Most Read