జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసులు అటు, సిబిఐ విచారణ జరుపుతుంది, ఇటు ఈడీ కూడా విచారణ జరుపుతుంది. 11 సిబిఐ కేసులు ఉండగా, 5 ఈడీ కేసులు జగన్ మోహన్ రెడ్డి పై, విజయసాయి రెడ్డి పై ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సిబిఐతో పాటు, ఈడీ కూడా ఈ కేసుల్లో చార్జీ షీట్లు దాఖలు చేసాయి. ఈ నేపద్యంలో, జగన్ తరుపు న్యాయవాదులు కోర్టులో వాదిస్తూ సిబిఐ చార్జ్ షీట్లు తేలిన తరువాతే, ఈడీ కేసులు విచారణ జరపాలి అంటూ, జగన్ మోహన్ రెడ్డి పిటీషన్ వేసారు. అయితే దీని పై వాదనలు జరిగాయి. సిబిఐ, ఈడీ కేసులు రెండు వేరే వేరు సెక్షన్లు అని ఈడీ వాదించింది. దీంతో ఈడీ కోర్టుకు ఈ వాదనతో ఏకీభవించింది. సిబిఐ కేసులతో సంబంధం లేకుండా, కేవలం ఈడీ కేసు విచారణ చేయటం కుదరదు అని కోర్టు తేల్చి చెప్పింది. ఈడీ కేసులను ముందుగా విచారణ చేస్తాం అని చెప్పిన కోర్టు, ఈ కేసుని 21కి వాయిదా వేసింది. ఈ రోజు జరిగిన విచారణకు జగన్ హాజరు కావాల్సి ఉండగా, ఈ రోజు అమ్మ ఒడి కార్యక్రమం ఉండటంతో, జగన్ రాలేదు. ఈ రోజు విచారణకు విజయసాయి రెడ్డి వచ్చారు. గతంలో కూడా  సిబిఐ కోర్టులో కూడా అన్ని చార్జ్ షీట్లు కలిపి ఒకేసారి విచారణ చేయాలని కోరగా, గతంలోనే సిబిఐ ఈ పిటీషన్ తోసిపుచ్చుంది. ఇప్పుడు ఈడీ కూడా కుదరదు అని చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, జడ్జిల పై, న్యాయస్థానాల పై టార్గెట్ అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే కొన్ని చర్యలు వీటికి బలం చేకూరుస్తూ ఉన్నాయి కానే, జస్టిస్ ఈశ్వరయ్య కేసు విషయంలో ఆడియో ఒకటి బయట పడటంతో సంచలనంగా మారింది. కొద్ది రోజుల క్రితం జడ్జి రామకృష్ణ, జస్టిస్ ఈశ్వరయ్య సంభాషణ ఒకటి బయట పడింది. అయితే ఈ ఆడియో నాది కాదని, అప్పట్లో జస్టిస్ ఈశ్వరయ్య ఖండించారు. అది ట్యాంపరింగ్ చేసారని అన్నారు. ఇది ఇలా ఉంటే, ఆ ఆడియోలో సుప్రీం కోర్టు జడ్జిలను టార్గెట్ చేసే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య మాటలు ఉన్నాయని, ఈశ్వరయ్య ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా పదవిలో ఉన్నారని, ఇది ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న కుట్ర అనే విధంగా హైకోర్టులో కేసు వేసి వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు దీని పై విచారణకు ఆదేశించింది. అయితే హైకోర్ట్ ఆదేశాల పై జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ రోజు ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్‌ ఈశ్వరయ్య తరుపున ప్రశాంత్‌ భూషణ్‌, వ్యతిరేక వర్గంలో కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. ముందుగా కపిల్‌ సిబల్‌ విచారణ ప్రారంభం కాగానే, తాను ఇప్పుడే మాట్లాడను అని అన్నారు. దీంతో ప్రశాంత్‌ భూషణ్‌ ని వాదనలు వినిపించమని సుప్రీం కోర్టు ఆదేశించింది.

eswaraiah 11012021 2

ఈ సందర్భంగా ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తూ, అది ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రైవేటు సంభాషణ అని, దీంతో ఎలా ఎంక్వయిరీ వేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు జడ్జి మీద వాళ్ళు మాట్లాడుకున్నా, ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ క్రైమ్ ఎలా అవుతుంది అంటూ, ఆయాన వాదించారు. హైకోర్టు కనీసం తనకు చెప్పకుండా, విచారణకు ఎలా ఆదేశించిందని ప్రశ్నించారు. అందుకే ఈ కేసు పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే అప్పుడు కల్పించుకున్న కపిల్ సిబాల్, ఇది ప్రైవేటు సంభాషణగా వదిలేయటానికి లేదని, ఇది సిస్టం మీద కుట్ర పూరిత అటాక్ అని అన్నారు. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న కోర్టు, ఇద్దరి మధ్య సంభాషణ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా అని, ప్రశాంత్‌ భూషణ్‌ ని ప్రశ్నించింది. దానికి ప్రశాంత్‌ భూషణ్‌ ఒప్పుకుంటునే, సంభాషణలో బయట జరిగిన ప్రచారం మాత్రం వాస్తవం కాదని అన్నారు. అయితే మీరు సంభాషణ జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి, ఏమి సంభాషణ జరిగిందో అఫిడవిట్ రూపంలో ఇవ్వండి అంటూ, ఈ కేసు పై స్టే ఇవ్వలేమని, కేసుని వచ్చే సోమవారానికి వాయిదా వేసారు.

ప్రభుత్వం తాజాగా మరో స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ఏర్పాటుచేసిందని, రాష్ట్రంలో హైందవదేవాలయాలపై జరుగుతున్న ఘటనలపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ వేస్ట్ దని, దానివల్ల కొత్తగా ఒరిగేదేమీలేదని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యలు వర్ల రామయ్య తేల్చిచెప్పారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ...! గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో సీఐడీ వేసిన ప్రభుత్వం, ఇప్పుడు డీఐజీ స్థాయి అధికారి నేత్రత్వంలో సిట్ ను నియమించారు. ప్రభుత్వం ఏరకంగా తప్పటడుగులు, కుప్పి గంతులు వేస్తోందో ప్రజలుకూడా గమనించాలి. డీఐజీస్థాయి అధికారి నేత్రత్వంలో వేసిన సిట్ దర్యాప్తుతో హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనల వెనకున్న వారిని పట్టుకుంటామని చెబుతూ, ప్రభుత్వం హిందువలను మభ్యపెట్టే కార్యక్రమమే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇలా తూతూమంత్రపు విచారణలు చేయించదు. ఎవరు కుట్రలవెనకున్నారు... ఎవరి మేలుకోసం ఈ ఘటనల జరుగుతున్నాయనేది బయటకు రావాలంటే, సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గం. ముఖ్యమంత్రి సీబీఐ దర్యాప్తు దిశగా ఎందుకుఆలోచన చేయరని మేం ప్రశ్నిస్తున్నాం. అడిషనల్ డీఐజీ స్థాయిలో సీఐడీ దర్యాప్తు చేస్తుంటే, స్థాయిని తగ్గించి, డీఐజీ స్థాయి నేత్రత్వంలో సిట్ ఏర్పాటుచేస్తే విచారణ సజావుగా సాగుతుందా?

ramatheerdham 10012021 2

అధికారి స్థాయిని తగ్గించడం వెనక ఫ్రభుత్వానికి ఉన్న ఆలోచనలే మిటి? రాష్ట్రంలోని హైందవభక్తుల మనోభావాలతో ప్రభుత్వం ఆట లాడుతోందని అర్థమవుతోంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మతసామరస్యానికి సంబంధించిన అతిసున్నితమైన సమ స్య విషయంలో ఇలాపిల్లలాటగా ప్రవర్తిస్తారా? డీఐజీస్థాయి అధికారి నేత్రత్వంలో సిట్ వేస్తే, దానితో అసలు దొంగలు దొరుకుతారా? గతంలో జగన్ బాబాయ్ కేసు విచారణలో కూడా సిట్ నియమించారు. ఇప్పటివరకు దానిపై ఏం వెలికితీశారు? విశాఖప ట్నం సహా పరిసరప్రాంతాల్లో నెలకొన్న భూవివాదాలపై సిట్ వేశారు దానితో ఏం సాధించారంటే సమాధానం లేదు. అమరావతి భూము లపై, కేబినెట్ కమిటీరిపోర్ట్ పై మరో సిట్ బృందాన్నినియమించిన ప్రభుత్వం చివరకు ఏంసాధించింది? అడిషనల్ డీఐజీ స్థాయి అధికారి నేత్రత్వంలోని సీఐడీని కాదని, డీఐజీ స్థాయి సారథ్యంలో నియమించిన సిట్ ఏంసాధిస్తుందని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తు న్నాను. డీఐజీస్థాయికి విచారణను తగ్గించడం చూస్తుంటే, ప్రభుత్వ అపరిపక్వత స్ఫష్టంగా కనిపిస్తోంది. సీబీఐ దర్యాప్తుతోనే హైందవమతంపై జరుగుతున్న వరుస ఘటనల వెనకున్నవారు ఎవరో బయటపడుతుందని స్పష్టంచేస్తున్నాను. వరుసగా దేవాలయాలపై ఘటనల జరుగుతుంటే, ఈ ముఖ్యమం త్రి కాబట్టి కిమ్మనకుండాఉన్నారు" అని వర్ల రామయ్య అన్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యుల్ ప్రకటించటంతో, ఆయన తన అధికారులను ఉపయోగిస్తున్నారు. తోక జాడిస్తున్న అధికారుల పై వేటు వేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి వికెట్ పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై క్రమశిక్షణ చర్యలను ఈ రోజు ఎన్నికల కమిషన్ తీసుకుంది. కొద్ది సేపటి క్రితం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబందించిన షెడ్యుల్ విడుదల చేసి, ప్రొసీడింగ్స్ ఇవ్వటంతో, ఎన్నికల సంఘం సెక్రెటరీ నుంచి కింద స్థాయి ఉద్యోగులు ఎవరూ కూడా, సెలవు పై వెళ్ళకూడదు అని చెప్పి, ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్, సాయి ప్రసాద్, 30 రోజుల పాటు సెలవు పై వెళ్ళటమే కాకుండా, ఇతర ఉద్యోగులను కూడా సెలవు పై వెళ్ళాలని చెప్పినట్టు, ఆయన పై అభియోగాలు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి, ఎన్నికల కమిషన్ నిర్వహించిన విచారణలో ఇది నిజమే అని తేలటంతో, ఆయన తీసుకున్న చర్యలు అన్నీ ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, కూడా ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే సాయి ప్రసాద్ ని ఎన్నికల విధులు నుంచి తొలగించటంతో పాటుగా, ఇతర విధుల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, విధులు నిర్వహించేందుకు వీలు లేదు అని కుడా ఆ ఉత్తర్వుల్లో ఎన్నికల కమిషన్ పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి.

rameshkumar 11012021 2

రెండు రోజుల క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం అని, సెక్రటరీ, సీనియర్ ఉద్యోగులంతా ఎన్నికల ప్రధాన కార్యాలయంలోనే అందరినీ అందుబాటులో ఉండాలని ముందే ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఈ క్రమశిక్షణారాహిత్య పనులు తన ఛాంబర్ నుంచే చేశారని, దీని తీవ్రమైన నేరంగా పరిగణించాం అని, ఎన్నికల నియమావళికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన సాయిప్రసాద్ ఇలా ఉల్లంఘనలకు పాల్పడటం సీరియస్‍గా తీసుకున్నాం అని ఉత్తర్వుల్లో తెలిపారు నిమ్మగడ్డ. అయితే ఈ చర్యతో అయినా, ఉద్యోగులు ఇక నుంచి , ఎన్నికలు జరిగే వరకు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారేమో చూడాలి. ఇక మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటీషన్ ని, వెకేషన్ బెంచ్ ఈ రోజు విచారణకు తీసుకుని. ఈ రోజు దీని పై 2.30 గంటలకు దీని పై విచారణ చేయనుకుంది. అయితే హైకోర్టు ఈ ఎన్నికల షెడ్యుల్ పై స్టే ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వ వాదనతో మొగ్గు చూపుతుందా అనేది చూడాల్సి ఉంది. ఏది జరిగినా, ఈ విషయం మళ్ళీ సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది. మరి అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఇలాంటివి అన్నీ సస్పెన్స్ గా మారాయి.

Advertisements

Latest Articles

Most Read