ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలు ఎన్నికలు జరగకుండా, అనేక విధాల్లో ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ ఉన్నంత వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదు అనే ఉద్దేశమో ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఎలా వాయిదా వేయాలి అనే ఆలోచనలోనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికలు లేట్ అయ్యాయి, ఈ విషయం హైకోర్టులో ఉంది. గతంలో హైకోర్టులో విచారణకు రాగా, క-రో-నా తగ్గిపోతుంది కదా, ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో ఏకంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కదా, మిగతా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి కదా, మీకు ఏమిటి అభ్యంతరం అని హైకోర్టు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. దీని పై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో, ప్రభుత్వంతో చర్చించి, మెజారిటీ అభిప్రాయం తీసుకుని, స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరిలో జరగటానికి ప్రొసీడింగ్స్ ఇచ్చింది. అయితే తమ అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని, హైకోర్టులో కేసు వేసారు. ఎన్నికలు ఆపేయాలని కోరారు. వెంటనే స్టే ఇవ్వమంటే, కోర్టు మాత్రం స్టే ఇవ్వలేదు. విచారణ ముగించి, తీర్పు రిజర్వ్ లో పెట్టింది. అయితే విషయం కోర్టు పరిధిలో ఉండగానే, ఈ రోజు అసెంబ్లీలో క-రో-నా కారణంగా ఎన్నికలు జరపలేం అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసారు.

nimmagadda 04122020 2

ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశంగా విశ్లేషకులు అంటున్నారు. కోర్టు పరిధిలో అంశం ఉండగా, ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదీ కాక శాసనసభ తీర్మానం చేసింది కాబట్టి, కోర్టులో ఈ విషయంలో కలుగ చేసుకోకూడదు అనే వాదన కూడా తెచ్చే అవకాసం ఉంది. అయితే కోర్టులు ఇవేమీ పట్టించుకోవు అనుకోండి. కోర్టు పరిధిలో ఉన్న ప్రతి అంశం పై సమీక్ష చేసే అవకాసం కోర్టుకు ఉంది. అయితే ఈ చర్యతో, మరోసారి ప్రభుత్వం ఎన్నికలకు భయపడుతుంది అనే సంకేతం వెళ్తుంది. పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, రాజాస్థాన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి, అలాగే ఈ రోజు కూడా కర్ణాటకలో కూడా ఎన్నికలు జరపమని అక్కడ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే మనకు మాత్రం కోర్టు చెప్పినా ప్రభుత్వం అభ్యంతరం చెప్తుంది. మరి ఈ కేసు పై హైకోర్టుని ఏమి తీర్పు ఇస్తుంది ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే, మళ్ళీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తే, ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తన వైపు తిప్పుకోవటానికి, ఇచ్చిన అతి ముఖ్యమైన హామీ సిపీఎస్ రద్దు. ఉద్యోగులకు సిపీఎస్ రద్దు చేస్తానని, ప్రతి పాదయాత్రలో హామీ ఇచ్చారు. అయితే దీనికి టైం కూడా పెట్టారు. కేవలం వారం రోజుల్లోనే రద్దు చేసి పడేస్తా అని, ప్రతి ఊరి సెంటర్ లో, గట్టిగా అరుస్తూ చెప్పారు. ఉద్యోగులకు ఈ హామీ ఎంతో ముఖ్యమైనది కావటంతో, అందరూ జగన్ వైపు గంపగుత్తగా వేసేసారు. జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయి. భారీ మెజారిటీతో గెలిచారు. ఇంకేముంది వారం రోజుల్లో సిపీఎస్ రద్దు అయిపోతుందని, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. వారం అయ్యింది, నెల అయ్యింది, ఏడాది అయ్యింది, ఇప్పటికి 18 నెలలు అయ్యింది. అంటే దాదాపుగా 70 వారల పైనే అయ్యింది. అయినా సిపీఎస్ రద్దు కాలేదు. అయితే ఇప్పుడు శాసనమండలి సమావేశాలు జరుగుతూ ఉండటంతో, అధికార పక్షాన్ని నిలదీసింది ప్రతిపక్షం. సిపీఎస్ ఎప్పుడు రద్దు చేస్తున్నారు. వారం అన్నారు, 18 నెలలు అయ్యింది కదా అని అడిగితే, ప్రభుత్వం తరుపున ఆర్ధిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పారు. సిపీఎస్ రద్దు అంశం పై,  మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశామని, వాళ్ళు సమావేశం అవుతున్నారని, తొందర్లోనే ఈ విషయం పై ఒక క్లారిటీ వస్తుందని, ఈ హామీని మేము నెరవేర్చుతామని చెప్పారు. మరి అప్పట్లో వారం రోజుల్లో చేస్తానని, గట్టిగా బలంగా ఎందుకు చెప్పారో, జగన్ గారికే తెలియాలి.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ గత అయుదు రోజులుగా జరుగుతుంది. అయితే అయుదు రోజులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. మొదటి రోజు పంటకు కట్టే క్రాప్ ఇన్సురన్సు ఎందుకు కట్టలేదు అంటే సస్పెండ్ చేసారు, రెండో రోజు పేదలకు టిడ్కో ఇళ్లు అడిగితే సస్పెండ్ అన్నారు, మూడో రోజు పోలవరం నిధులు పై కేంద్రం పై ఎందుకు ఒత్తిడి తేవటం లేదు అంటే సస్పెండ్ చేసారు, నిన్న 250 రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నారు అంటే సస్పెండ్ అన్నారు, ఈ రోజు నరేగా నిధుల పై అడిగితె సస్పెండ్ చేసారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ వాయిస్ వినిపించకుండా, వైసీపీ ఈ అయుదు రోజులు అసెంబ్లీ కానిచ్చేసింది అనే చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం, ప్రజలు ఎదుర్కుంటున్న వాటి పై కాకుండా, మేము చాలా అద్భుతంగా చేసాం అని చెప్పటానికే, అసెంబ్లీ ఉపయోగించుకుని, సెల్ఫ్ భజన చేసుకున్నట్టు కనిపించింది. ఇదే సందర్భంలో ప్రతిపక్షాల పై దాడి చేసారు. అయితే ఈ సందర్భంగా నిన్న జగన్ మోహన్ రెడ్డి పెన్షన్ విషయాలు చెప్తూ, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారని, తాము 45 ఏళ్ళకు పెన్షన్ అని చెప్పలేదని, మా మ్యానిఫెస్టో లో అలా లేదని, ఇప్పటికే ఈ విషయం పై ఒకసారి క్లారిటీ ఇచ్చిన తరువాత కూడా, రామానాయుడు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి, ఆయన పై ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వాలని సభలో చెప్పారు. దీనికి స్పీకర్ కూడా ఒప్పుకున్నారు.

jagan 04122020 2

అయితే ఇదే విషయం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం హయంలో పెన్షన్ లు కేవలం 44 లక్షలు మాత్రమే అని, దాన్ని మేము 60 లక్షలకు పైగా చేసాం అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో తెలుగుదేశం హయాంలో 54 లక్షల పెన్షన్ లు ఇచ్చారు. ఇదే విషయం పై చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు. గతంలో ఇచ్చిన వివరాలు చెప్తూ, ఆ సంఖ్యను జగన్ వచ్చిన తరువాత తగ్గించి, మళ్ళీ పెంచారని చెప్పుకొచ్చారు. అయితే జగన్, రామానాయుడు వ్యాఖ్యలు పై ప్రినిలేజ్ నోటీస్ ఇస్తాం అని చెప్పటంతో, దీనికి కౌంటర్ గా తెలుగుదేశం కూడా రంగంలోకి దిగింది. నిన్న జగన్ మోహన్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించారని, అందుకే ఆయన పై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. జగన్ మోహన్ రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని, జగన్‍పై సభాహక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ని కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇవ్వనున్నారు. ఈ రకంగా అయినా చర్చ జరిగి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని తెలుగుదేశం భావిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఈ రోజు అమరావతిలోని మందడం శిబిరంలో, నిరసన తెలుపుతున్న రైతుల వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఏడాదిగా నిరసన తెలుపుతున్న వారికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతులు తాము పడుతున్న కష్టాలు, ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులు చెప్పుకున్నారు. అలాగే అసెంబ్లీలో పలువురు వైసిపీ నేతలు వాడుతున్న భాష పై కూడా అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి ధైర్యం చెప్తూ, భావోద్వేగానికి లోనయ్యారు.  ఆయన మాటల్లోనే "నాకు అర్ధమైంది, మిమ్మల్ని పెట్టారు, అందరినీ ఇబ్బంది పెడతారు, రాష్ట్రాన్ని కూడా పెడుతున్నారు, కానీ తప్పదు, ధైర్యంగా పోరాడాలి. ఇక్కడ ఉండే రైతులకు కూడా బేడీలు వేసారు, జైలుకు పంపించారు. బయట వాళ్ళు ఎవరో ఒక పది మంది వచ్చి, నా మీదకు వస్తే నేను భయపడే వాడిని కాదు, నేను బాంబులకే భయపడలేదు. నా సంకల్పం ముందు, వీళ్ళు ఏమి చేయలేరు. మీరు అన్నట్టు, నన్ను అసెంబ్లీలో అవమానం చేసారు, బయట అవమానం చేసారు, ఇస్తానుసారంగా మాట్లాడుతున్నారు, కొంత మంది పోలీసులు కూడా కావాలని ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ గుండెల్లో పెట్టుకుని ఉన్నా, బాధపడుతున్నా, భరిస్తున్నా, అయినా కూడా నేను ఎక్కడ భయ పడటం లేదు. వీళ్ళతో చివరి వరకు పోరాడతా, ఎన్ని అవమానాలు అయినా భరిస్తా, ప్రజల తరుపున అండగా ఉంటాను." అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read