విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనలో డా.రమేశ్ బాబు పోలీస్ కస్టడీపై ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకు మొట్టమొదటగా మా ఆస్పత్రి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. అయితే స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో కోవిడ్ సెంటర్ నడిపేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అనుమతిచ్చారని స్పష్టం చేసారు. రోగులకు సౌకర్యాల కల్పన, అద్దె వసూలు చేసుకునే విధంగా స్వర్ణ ప్యాలెస్ హోటల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఒప్పందం చేసుకున్నారాని అన్నారు. ఈ ఒప్పందానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించాం అని తెలిపారు, రమేష్ ఆస్పత్రి మేనేజర్ రాజశేఖర్. అగ్ని ప్రమాదంలో, వైద్యం చేయటానికి వచ్చిన రమేష్ హాస్పిటల్స్ కు సంబంధం ఉండదని, పర్మిషన్ ఇచ్చిన అధికారులకు, అలాగే హోటల్ యాజమాన్యానికి సంబంధం ఉంటుందని, ఇప్పటికే కోర్టులో వాదనలు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ రోజు చేసిన ప్రకటన పై స్పందించారు. ఈ రోజు అసెంబ్లీలో జరిగిన పరిణామాల పై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా ఈ రోజు రజినీకాంత్ తాను పొలిటికల్ పార్టీ పెడుతున్నట్టు చేసిన ప్రకటన గురించి విలేఖరులు చంద్రబాబుని ప్రశ్నించారు. ఆయన్ను అభిప్రాయం అడిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎవరు రాజకీయ పార్టీ పెట్టినా స్వాగాతించాలని అన్నారు. రజినీకాంత్ తనకు మంచి మిత్రుడని చంద్రబాబు అన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావటాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అలాగే ఆయన రాణించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రోజు రజినీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ పై స్పందించారు. గత కొన్ని రోజులుగా పార్టీ పై వస్తున్న ఊహాగానలకు ఫుల్ స్టాప్ పెడుతూ, తాను రాజకీయాల్లోకి వస్తున్నా అని, కొత్త పార్టీ పెడుతున్నా అని, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పారు. ఈ ప్రకటన పై ఈ రోజు మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు తన అభిప్రయం చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులతో నెట్టుకుని వస్తున్న సంగతి తెలిసిందే. జీతాలు, పెన్షన్లు ఇవ్వటానికి కూడా ఒక్కో నెలలో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం కూడా జరగటం లేదు. అమరావతి నిర్మాణం ఆగిపోయింది, పోలవరం ఏమి అవుతుందో అర్ధం కానీ పరిస్థితి. ఈ నేపధ్యంలోనే ఈ 18 నెలల్లో దాదాపుగా లక్షా 30 వేల కోట్లకు పైగా అప్పులు చేసినట్టు కాగ్ చెప్తుంది. ఈ స్థాయి అప్పులు ఏ రాష్ట్రం కూడా చేయలేదు, చేయదు కూడా. గత చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్ళలో, లక్ష కోట్లు అప్పు చేస్తేనే హడావిడి చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఏడాదిన్నర లోనే, లక్షా 30 వేల కోట్లు అప్పు చేసారు. ఇంకా ఇంకా అప్పులు కోసం వేటాడుతున్నారు. కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కొన్ని బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే, ఏకంగా ప్రభుత్వ భూములు అమ్మటానికి కూడా వెనకాడటం లేదు. పోనీ ఏదైనా గుర్తుండే పోయే అభివృద్ధి చేస్తున్నారా అంటే, సున్నా. మరో పక్క పన్నుల బాదుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొత్త కొత్త రికార్డులు చేస్తున్న సమయంలో, మన రాష్ట్రం నుంచే రాజ్యసభ ఎంపీగా ఉన్న బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు, రాష్ట్రాలు విచ్చల విడిగా చేస్తున్న అప్పుల పై కేంద్రానికి లేఖ రాసారు.

sureshprabhu 02122020 2

విశాఖపట్నం కు చెందినా, నరేష్ కుమార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ గా ఉన్నారని, ఆయన తనకు అప్పుల విషయంలో లేఖ రాసారని, ఆ అభిప్రాయం కరెక్ట్ అని నేను కూడా నమ్ముతున్నాను అంటూ, రాష్ట్రాలు విచ్చల విడిగా చేస్తున్న అప్పుల పై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేసారు. విచ్చల విడిగా చేస్తున్న అప్పులు కంట్రోల్ చేయాలని కోరారు. అలాగే ఇదే లేఖను మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు కూడా లేఖ రాసారు. ప్రజాలను బుట్టలో వేసుకునే పధకాల కోసం, కొన్ని ప్రభుత్వాలు కార్పొరేషన్లు పెట్టి మరీ, విచ్చల విడిగా అప్పులు తీసుకుంటున్నాయని, ఇవి చాల ఆందోళనకర అంశం అని ఆయన అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఎఫ్ఆర్బీఎం చట్టాలని అతిక్రమిస్తున్నారని అన్నారు. కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుని, వాటిని వేరే వాటికి మళ్ళిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. అప్పులు తిరిగి చెల్లించే సామర్ధ్యం కూడా చూడాలని, సిబిల్ స్కోర్ దాటి రుణాలు తీసుకుంటున్న వారి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్పొరేషన్ పెట్టి, 25 వేల కోట్లు అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రభు లేఖ, ఏపిని టార్గెట్ చేసి రాసిందే అని అర్ధం అవుతుందని, విశ్లేషకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తమకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహణ కష్టం అని, అందుకే ఎన్నికలు వాయిదా వేయాలి అంటూ, హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన పిటీషన్ పై , ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్న విషయం పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తూ కొన్ని ప్రధానమైన అంశాలు పేర్కొంది. క-రో-నా నేపధ్యంలో చాలా మంది అధికారులు, పోలీసులకు క-రో-నా వ్యాప్తి చెందింది. సుమారుగా 11 వేల మంది అధికారులు కానీ, పోలీసులు కానీ వైరస్ బారిన పడ్డారని, ప్రధానంగా కోర్టు దృష్టికి తెచ్చారు. అదే విధంగా గత ఏడాది ఎన్నికలు జరపాల్సిన టైంలో, వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఉద్దేశంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిందని, ఇప్పుడు వ్యాప్తి ఎక్క్వుగా ఉన్న సమయంలో, ఎన్నికల నిర్వహణ కష్టం అని కోర్టుకు తెలిపారు. మరో వైపు, అక్టోబర్ లో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనంతరం, కొన్ని సమీక్షలు జరిపి, అందరి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రయం ప్రకారం, ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపారు. అలాగే ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అయితే దీని పై చీఫ్ సెక్రటరీ ఉత్తరం రాస్తూ, తాము ఈ పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించలేమని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలిపారు. అయితే తమ అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా, ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తుందని, అందుకే ఈ ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలని తెలిపారు.

hc 03122020 2

ప్రస్తుతం రెండో వేవ్ కూడా వస్తుందని అంటున్నారని, అందుకే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే హైకోర్టు మాత్రం, ఈ విషయంలో తాము స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ రేపు చేస్తాం అని, కోర్ట్ తెలిపింది. ప్రభుత్వం తరుపు సంప్రదించి మరిన్ని వివరాలు రేపు ఇస్తామని, రేపు కూడా వాదిస్తామని ప్రభుత్వం తరుపు న్యాయవాది చెప్పటంతో, హైకోర్టు ఒప్పుకుంది. మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు వినిపిస్తూ, బీహార్ లాంటి చోట అసెంబ్లీ ఎన్నికలే నిర్వహించారని, హైదరాబాద్ లో కూడా ఎన్నికలు జరిగాయని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా కేసులు బాగా తగ్గిపోయాయని, అంతే కాకుండా చాలా రాజకీయ పార్టీలు, క-రో-నా నిబంధనలు పాటిస్తూ, ఎన్నికలు జరపటానికి అభ్యంతరం లేదని చెప్పారని తెలిపాయి. ఈ నేపధ్యంలో రేపు విచారణ వాయిదా పడటంతో, రేపు మరిన్ని వివరాలు తెలిసే అవకాసం ఉంది.

Advertisements

Latest Articles

Most Read