ఈ రోజు అసెంబ్లీలో విద్యుత్‌ సవరణ బిల్లులోని, అసైన్డ్‌ భూములు లీజు అంశాలపై చర్చ జరిగింది. అయితే ఈ బిల్లులో సోలార్ పార్కులు పెట్టటం కోసం, అసైన్డ్‌ భూములు తీసుకోవచ్చు అని ఉండటం పై, తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. దీని పై తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది. ఇదే విషయం పై చంద్రబాబు అసెంబ్లీ ప్రాంగణం నుంచే వీడియో మెసేజ్ విడుదల చేసారు. ఆయన ప్రసంగం ముఖ్యాంశాలు "ప్రభుత్వం పేదల దగ్గరున్న భూములను లాక్కొనేలా కొత్తగా అసైన్డ్ మెంట్ యాక్ట్ కి సవరణలు చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అసైన్డ్ మెంట్ యాక్ట్ కింద ఎక్కువగా ఎస్సీలు, బీసీలే భూములు సాగుచేసుకుంటున్నారు. వారి స్వాథీనంలోఉన్నభూములను ఎవరైనా బలవంతంగా లాక్కున్నా, తిరిగి వారికే స్వాధీనపరిచి, సదరు భూములపై వారికే హక్కు కల్పించేలా గతంలోనే చట్టాలు చేశారు.అటువంటి చట్టానికి తూట్లు పొడిచేపరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఎస్సీల భూములను, ఆదాయంకోసం ఎవరైనా వినియోగిస్తారని నీచంగా మాట్లాడుతున్నారు. అది చాలా దుర్మార్గం. ఒకవేళ అలాజరిగితే చట్టాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఎస్సీలకు న్యాయం చేయాలనుకుంటే, చట్టం లేకపోయినా వారిభూములు వారికి ఇవ్వొచ్చుగా.అదే సమయంలో ఎక్కువలాభం వస్తుందని చెబుతున్నారు. లాభం కోసమే అయితే పేదలస్వాధీనంలోని భూములెందుకు ఇవ్వడం.. మీ సొంత భూములే ఇవ్వొచ్చుగా? మీరే మీ భూములిచ్చి, ఆలాభాలు మీరే పొందండి. పేదలు, మరీ ముఖ్యంగా ఎస్సీల పొట్టకొట్టడమేంటి? కోర్టులు మొన్ననే చాలా సీరియస్ గా చెప్పాయి. పేదల భూములు ఒకరి దగ్గర తీసుకొని మరొకరికి ఇస్తానంటారా... ఇదెక్కడి న్యాయం.. అసైన్డ్ మెంట్ భూములు లాక్కోవడం చాలా తప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. కోర్టులు చీవాట్లు పెట్టినా వీళ్లకు బుద్ధిరాలేదు. ఈ రోజు వీళ్లు చేస్తున్న పనులు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. బాధ్యతలేని, ప్రజాస్వామ్యంపై గౌరవం లేని స్పీకర్ కనీసం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అవతలి వైపున 10మందికి అవకాశమిచ్చి, వారితో నన్ను తిట్టిస్తారా?"

" మాపార్టీని విమర్శిస్తారు.. మాట్లాడదామంటే కనీసం మైక్ కూడా ఇవ్వరు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే స్థితికి దిగజారారు. రాష్ట్రంపై పెనుభారం వేయబోతున్నారు. 10వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్పి చేస్తున్నామనిచెబుతున్నారు. ఒకపక్క రాష్ట్రంలో ఇప్పటికే 19,500మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. కొత్తగా అగ్రిమెంట్లు జరిగాయి. ఆ విద్యుత్తే సరిపోతుంది. వీళ్లు కావాలనే అవినీతికోసం అదనంగా ఉత్పత్తి అంటూ వ్యవస్థను కుప్పకూల్చే ప్రయత్నాలు మొదలెట్టారు. ప్రజలపై పెనుభారం వేసేపరిస్థితికి వచ్చారు. పీపీఏలపై విమర్శలు చేసిన పెద్దమనుషులు, విపరీతంగా ఎక్కడాలేని విధంగా ఇన్సెంటివ్ లు ఇచ్చారు. ఆ ఇన్సెంటివ్ లు ఇచ్చినవిధానం కూడా చాలా దారుణం. వీటన్నింటిపై మేము చర్చ జరగాలంటున్నాం. మీకు మీరు కావాలని బలవంతంగా అవినీతికోసం మరో 10వేల మెగావాట్లు తేవచ్చు. కానీ ప్రజలు మిమ్మల్ని ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మీకు తగినగుణపాఠం చెప్పే వస్తుందని, ప్రభుత్వం ఇది గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా." అని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడని వింత, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు చూసారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలో, కనిపించిన దానికి, కనిపించనట్టు, ఏది కనిపిస్తే దానికి తమ పార్టీ రంగులు వేసుకుంటూ వెళ్లారు. గేద కొమ్ములు, చెత్త బుట్టలు, స్మశానాలు, ఆకులు, గుడిలు, గడ్డర్లు, ఇలా ఏది కనిపిస్తే దానికి వేసుకుంటూ వెళ్లారు. అయితే ఇక్కడ వరకు బాగానే ప్రభుత్వ భావనలకు, స్కూల్ బిల్డింగ్లకు, పంచాయతీ బిల్డింగ్లకు కూడా తమ పార్టీ రంగులు వేసుకున్నారు. పోనీ వీళ్ళు ఏదైనా కొత్తది కట్టి, వేసుకున్నారా అంటే అదీ కాదు. ఎప్పుడో గత ప్రభుత్వాలు కట్టిన భవనాలకు, చివరకు బ్రిటీష్ కాలంలో కట్టిన భావనలకు కూడా తమ పార్టీ రంగులు వేసుకున్నారు. చివరకు ఒక చోట అయితే, ఏకంగా జెండా దిమ్మకు కూడా రంగులు వేసేసారు, గాంధీ తాత విగ్రహానికి కూడా వేసేసారు. అయితే ఈ పనులు చూసిన కొంత మంది కోర్టుకు వెళ్లారు. దీని పై హైకోర్ట్ సీరియస్ అయ్యింది. వెంటనే రంగులు మార్చమంది. అయినా మార్చకపోవటంతో, అధికారులని బాధ్యులను చేసింది. తరువాత మరొక్క రంగు కలిపి, ఇది పార్టీ రంగు కాదని చెప్పే ప్రయత్నం చేయటంతో, హైకోర్టు మరింత సీరియస్ అయ్యింది. ఇక తరువాత మార్చాల్సిన పరిస్థితి రావటంతో, మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం. హైకోర్టు కంటే ఎక్కువగా సీరియస్ అయ్యింది సుప్రీం కోర్ట్. దీంతో ప్రభుత్వానికి రంగులు మార్చటం తప్ప, వేరే ఆప్షన్ లేకుండా పోయింది.

hc 011122020 2

ఒకసారి పార్టీ రంగులు వేయటానికి ఖర్చు. మళ్ళీ తెల్ల సున్నం. మళ్ళీ పార్టీ రంగులు తీయటానికి ఖర్చు. ఇలా కొన్ని వందల వేల కోట్లు ఖర్చు అయ్యాయి. అయితే ఈ అనవసరపు ఖర్చు ప్రజల పై భారమే అవుతుంది. అయితే ఇప్పుడు ఇదే విషయం పై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు విషయంలో, వేయటానికి తీయటానికి అయిన ఖర్చు మొత్తం, వారి నుంచే రాబట్టాలి అంటూ పిటీషన్ దాఖలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగులు వేయటానికి, తీయటానికి దాదాపుగా 4 వేల కోట్లు ఖర్చు అయ్యింది అంటూ, పిటీషనర్ తెలిపారు. ఈ 4 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యేలా చూడాలని హైకోర్టుని కోరారు. చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణలను ప్రతివాదులుగా చేర్చి, పిటీషన్ దాఖలు చేసారు. అయితే అఫిడవిట్ సరిగ్గా లేదని చెప్పిన హైకోర్టు, అసలు వీరిని ఎందుకు ప్రతివాదులుగా చేర్చారో స్పష్టంగా తెలపాలని కోరింది. మొత్తానికి రంగులు విషయం మళ్ళీ హైకోర్టుకు చేరింది. ఈ విషయం పై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఈ రోజు అసెంబ్లీలో మధ్యానం స్పీకర్ కు, చంద్రబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా స్పీకర్ సహనం కోల్పోయారు. తెలుగుదేశం వైసిపీ మధ్య ముందుగా గందరగోళం చెలరేగగా, ఆ తరువాత ఇది స్పీకర్, చంద్రబాబు మధ్య గోదావగా మారింది. సవాళ్లు , ప్రతి సవాళ్ళ వరకు విషయం వెళ్ళింది. తమకు మాట్లాడే అవకాసం ఇవ్వకుండా, వారి చేత ఇష్టం వచ్చినట్టు తిట్టిస్తున్నారని, తమకు అవకాసం ఇవ్వాలని చంద్రబాబు నిరసన తెలిపారు. టిడ్కో ఇళ్ళకు సంబందించిన వ్యవహారంలో ఈ రోజు చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంలో వరుస పెట్టి వైసీపీ నేతలకు అవకాసం ఇవ్వటం, వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ విమర్శలు చేయటంతో, తెలుగుదేశం పార్టీ అభ్యంతరం తెలిపింది. అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు ధీటైన సమాధానం తాము ఇస్తాం అని, తమకు అవకాసం ఇవ్వాలని పదే పదే అభ్యర్ధన చేసినప్పటికీ కూడా స్పీకర్ అవకాసం ఇవ్వలేదు. ఈ నేపధ్యంలోనే, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు లెగిసి, తమకు అవకాసం ఎందుకు ఇవ్వటం లేదు అని చెప్పి, నిలదీశారు. అధికార పార్టీ సభ్యులు మాట్లాడిన తరువాత అవకాసం ఇస్తాం అని స్పీకర్ చెప్పారు. అయితే వారు వరుసగా విమర్శలు చేస్తూ, తమను వ్యక్తిగతంగా తిడుతున్నా అవకాసం ఇవ్వటం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలియచేసారు. ఈ తరుణంలోనే స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య మాటల యుద్ధం జరిగింది. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని, కనీసం ఒక్కసారి కూడా తమకు అవకాసం ఇవ్వటం లేదని, ప్రతిపక్షం గొంతు నొక్కితే ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉండదు అని చంద్రబాబు చెప్పారు.

speaker 01122020 2

దీంతో తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, నిబంధనలు ప్రకారం అవకాశాలు వస్తాయని స్పీకర్ అన్నారు. నిన్నటి నుంచి తమకు ఇప్పటి వరకు అవకశం ఇవ్వలేదని, ఇచ్చి పుచ్చుకోవటం నేర్చుకోవాలని, ప్రతిపక్ష నేతకు అవకాసం ఇవ్వకుండా ఎన్ని రోజులు ఇలా చేస్తారు అని చంద్రబాబు అనగా, మీ దగ్గర నుంచి నీతులు మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వేలు చూపించి నన్ను భయపెడతారా, మీ ఉడత ఊపులకు నేనేమీ భయపడను, మీ చేష్టలు ప్రజలు చూస్తున్నారు అని తమ్మినేని అనగా, మీ ప్రవర్తన కూడా చూస్తున్నారని, హుందాగా ఉండండి అని చంద్రబాబు అన్నారు. దీంతో సహనం కోల్పోయిన స్పీకర్, నువ్వు నువ్వు అని సంబోధించి, చేతిలో ఉన్న పేపర్ ను విసిరి పేపర్ మీదకు కొట్టటంతో, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అదే దురుసుగా స్పీకర్ వద్దకు వచ్చి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ, నినాదాలు చేసారు. మొత్తానికి నిన్న ఇన్సురన్సు ప్రీమియం కట్టలేదని తెలుగుదేశం చెప్పటంతో, నిన్న సస్పెండ్ చేసారు. ఈ రోజు టిడ్కో ఇళ్లు గురించి అడిగితే, ఈ రోజు కూడా సస్పెండ్ చేసారు. తెలుగుదేశం సభ జరగనివ్వటం లేదని, అందుకే సస్పెండ్ చేసాం అని అధికార పక్షం అంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే ప్రభుత్వం భయపడుతుంది. సహజంగా అధికారంలో ఉన్న పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ఉత్సాహంగా నిర్వహిస్తుంది. ఈ రోజు జరిగిన హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలే నిదర్శనం. మార్చ్ లో జరపాల్సి ఉండగా, ముందుగానే ప్రభుత్వం నిర్వహించింది. అలాగే చాలా ప్రభుత్వాలు పెండింగ్ ఉంటే కనుక, రాగానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరుపుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కోర్టు ద్వారానే స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగే పరిస్థితి వచ్చింది. మార్చిలో కూడా హైకోర్టు చెప్తేనే ఎన్నికలకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అప్పట్లో ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు అయ్యింది. అయితే ఇవన్నీ జరుగుతూ ఉండగా, క-రో-నా వచ్చింది. ప్రపంచానికి ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. దీంతో ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి కుదుట పడింది. అన్ని రాష్ట్రాలు ఎన్నికలు మొదలు పెట్టాయి. బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా బై ఎలక్షన్స్ కూడా జరిగాయి. కొన్ని రాష్ట్రాలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిపాయి. అయితే మన రాష్ట్రంలో మాత్రం మళ్ళీ ఎన్నికలు అంటే ప్రభుత్వం భయపడుతుంది. ఒక పక్క క-రో-నా ని ఎదుర్కోవటంలో మేమే నెంబర్ వన్ అని ప్రచారం చేస్తూ, ఎన్నికలు అంటే మాత్రం క-రో-నా అంటుంది. పాదయాత్రలు, ఈ యాత్ర ఆ యాత్ర అంటూ చేసుకుంటూ, స్కూల్స్ నుంచి సినిమా హాల్స్ వరకు ఓపెన్ చేసి, ఆ సాకుతో ఎన్నికలు వద్దు అంటున్నారు.

hc 01112020 2

అయితే ఈ అంశం కోర్టులో ఉండటంతో, కోర్టు ఈ విషయం పై ఆరా తీయగా, ఎన్నికల కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంది. వైసీపీ తప్ప అన్ని పార్టీలు ఎన్నికలకు ఒప్పుకున్నాయి. ఇదే విషయం కోర్టుకు చెప్తూ, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే దీని పై ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అభ్యంతరం చెప్తూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, హైకోర్టులో ఈ పిటీషన్ వేసారు. ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పారు. ఎన్నికల కమీషనర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తమను సంప్రదించకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నాట్టు ప్రకటన చేసామని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు ఈ నిర్ణయం విరుద్ధం అని అన్నారు. అందుకే ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. హైకోర్టు మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గతంలోనే ఎన్నికలు నిర్వహణకు ఇబ్బంది ఏమిటి అని హైకోర్ట్ ప్రశ్నించింది. అయితే నిమ్మగడ్డ ఉన్నంత వరకు ఎన్నికలు నిర్వహించే అభిప్రాయం ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read