ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైసీపీకి తెలుగుదేశం పార్టీ మరో షాక్ ఇచ్చింది. గతంలో అమరావతి విషయంలో కూడా ఇలాగే షాక్ ఇవ్వటంతో, అధికార పక్షం గిల గిలా కొట్టుకుంది, ఏకంగా కౌన్సిల్ చైర్మెన్ షరీఫ్ గారి పై చేసిన రుబాబు తెలిసిందే. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు విషయంలో, తెలుగుదేశం పార్టీ బ్రేక్ వేసింది. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించింది. అప్పుడు వేసిన బ్రేక్, ఇప్పటికీ అమరావతిని మూడు ముక్కలు చేయలేక, అధికార పక్షం విలవిలలాడుతుంది. అంతే కాదు తెలుగు మీడియం ఆప్షన్ లేకుండా, కేవలం ఇంగ్లీష్ మీడియం పెట్టటం పై కూడా బిల్లు వెనక్కు పంపించారు. ఇంగ్లీష్ మీడియం పై అభ్యంతరం లేదని, కానీ తెలుగు మీడియం అనే ఆప్షన్ కూడా ఉండాలని బిల్లు వెనక్కు పంపించారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో, అధికార పక్షం ఆటలు సాగటం లేదు. రెండో సారి మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించుకు వెళ్లిపోవచ్చు కానీ, మండలిలో తెలుగుదేశం చేస్తున్న పోరాటంతో, బిల్లుల పై చర్చ జరుగుతుంది. ప్రజలకు ఏమి నష్టమో అర్ధం అవుతుంది. ఈ విధంగా అధికార పక్షానికి అన్నీ ఇబ్బందులే ఎదురు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు తాజాగా మరో షాక్ ఇచ్చింది శాసన మండలి. అసెంబ్లీలో నిన్న ప్రజల పై భారీగా భారం పడే ఒక బిల్లుని అధికార పక్షం ఆమోదించింది. ఆ బిల్లు పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరం చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు వాక్ అవుట్ కూడా చేసారు. ఆ బిల్లు పట్టాన ప్రాంతాల్లో ఆస్తి విలువ ఆధారంగా ఇక నుంచి పన్నులు బాదే బిల్లు.

council 02122020 2

ఈ చట్టంతో, ఇక నుంచి పన్నులు భారీగా పెరగనున్నాయి. అయితే ఇది కేవలం 10 శాతమేగా పెంచుతుంది అంటూ అధికార పక్షం ఎదురు దాడి చేస్తుంది. అయితే అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుని శాసనమండలికి పంపించారు. అక్కడ ఈ బిల్లు పై జరిగిన ఓటింగ్ లో మరోసారి అధికార పక్షానికి షాక్ ఇచ్చింది ప్రతిపక్షం. తెలుగుదేశం సభ్యులతో పాటుగా,  పీడీఎఫ్ సభ్యులు ఈ బిల్లుని వ్యతిరేకించారు. అయితే బీజేపీ ఈ బిల్లుని సుపోర్ట్ చేసిందో, తటస్తంగా ఉందొ తెలియ లేదు. మొత్తంగా ఈ బిల్లు మండలిలో వీగిపోయింది. బిల్లుకు వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. అనుకూలంగా 11 ఓట్లు వచ్చాయి. అయితే ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించాలని మండలి చైర్మెన్ ను తెలుగుదేశం పార్టీ కోరనుంది. ఇలా చేస్తే ప్రజల అభిప్రాయం తెలుస్తుందని, ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితి తెలుస్తుందని తెలుగుదేశం భావన. మరి దీని పై తుదపరి ఏమి జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే ప్రజల పై పడే భారాన్ని తెలుగుదేశం పార్టీ ఆపగలిగింది. ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా మళ్ళీ రెండో సారి అసెంబ్లీలో ఆమోదిస్తే, ప్రజలకు పన్నుల షాక్ తప్పదు.

తమ పై వచ్చే తప్పుడు ప్రచారం తిప్పి కొట్టటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ నిర్లిప్తతగానే ఉంటుంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి అంతే. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటానికి ఒక కారణమే ఈ ఫేక్ ప్రచారం అని చాలా మంది విశ్లేషకులు కూడా చెప్పారు. ఫేక్ ప్రచారం తిప్పి కొట్టక పోవటంతో, అదే నిజం అని ప్రజలు నమ్మి, ఇప్పుడు నిజం తెలుసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇదేదో ఇప్పుడు బీహార్ నుంచి వచ్చిన సలహాదారుడు చేసింది కాదు, గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే చేసారు. రెండు ఎకరాలు రెండు వేల కోట్లు, సింగపూర్ లో హోటల్, వ్యవసాయం దండగ అంటూ, ఇలా అనేక తప్పుడు ప్రచారాలు చంద్రబాబు మీద చేసినా, ఆయన తిప్పి కొట్టలేక పోయారు. కాలక్రేమణ అదే నిజం అని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది. అయితే మొత్తం అయిపోయిన తరువాత, దీనికి ఎంత కౌంటర్ ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఉపయోగం ఉండదు కదా. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా, చంద్రబాబు వ్యసాయం దండగ అని అన్నారు అంటూ రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేసారు. మనసులో మాట అనే పుస్తకంలో ఈ విషయం చెప్పారని అన్నారు. అయితే ఆ పుస్తకంలో రైతులను ఎలా ఆదుకోవాలి, ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలని చంద్రబాబు రాసుకున్నారు.

ln 021122020 2

ఐటి గురించి రాస్తూ, వ్యవసాయం నష్టాలు పాలు అవుతున్న ఈ రోజుల్లో, యువత ప్రత్యామ్న్యాయాలు వైపు చూస్తున్నారు అని రాసుకున్నారు. ఇది పట్టుకుని రచ్చ రచ్చ చేసారు. నిజానికి అది నిజమే కదా, అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ, వ్యవసాయం చేయటం లేదు కదా. అయితే చంద్రబాబు తాను ఆ మాటలు ఎక్కడ అన్నాను అని రాజశేఖర్ రెడ్డిని చాలెంజ్ చేస్తే, ఆయన చనిపోయే వరకు అది నిరూపించలేకపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ పార్టీ నిన్న శాసనమండలిలో, చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు అంటూ విమర్శలు చేసింది. దీంతో లోకేష్ లెగిసి, ఆ మాటలు ఎక్కడ అన్నారు, ఎప్పుడు అన్నారు చెప్పండి అని చాలెంజ్ విసిరారు. మనసులో మాట పుస్తకంలో అని, అది దొరకటం లేదని వైసీపీ మంత్రులు అనటంతో, ఆ పుస్తకం తీసుకు వచ్చి తెలుగుదేశం ఇందులో ఎక్కడ ఉందో చెప్పమని ఛాలెంజ్ చేసింది. ఆ మాటలు అన్నట్టు నిరూపించాలని చాలెంజ్ చేయటంతో, వైసీపీ ఇప్పటి వరకు ఏమి చెప్పలేక పోయింది. నాడు తండ్రి, నేడు కొడుకు విసిరిన చాలెంజ్ నిరూపించ లేక పోయారని, తెలుగుదేశం విమర్శిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమను, గుజరాతీ కంపెనీ చేతిలో పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలను ముంచి వేస్తూ, తీసుకున్న ఈ నిర్ణయం పై, అందరూ అభ్యంతరం చెప్తున్న వేళ, అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి, ఈ చర్యను సమర్ధించుకున్నారు. అలాగే ఈ రోజు ఒక పెద్ద పేపర్ యాడ్ ఇచ్చి, అందులో వివిధ డైరీలు చెల్లిస్తున్న రేట్లు, గుజరాతీ కంపెనీ అముల్ చెల్లించే రేట్లు గురించి, చెప్తూ ఒక పెద్ద యాడ్ వేసారు. అయితే అసెంబ్లీలో జగన్ మోహన్ రెడ్డి తమ కంపెనీ గురించి తప్పుడు ప్రచారం చేసారని, సంగం డైరీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సంగం డైరీ వారు పాల ఉత్పత్తిదారులకు తక్కువ ధర చేల్లిస్తున్నమాని చెప్పిన మాట అవాస్తవం అని ప్రకటనలో తెలిపారు. గత కొన్నేళ్ళుగా సంగం డైరీ పాల ఉత్పత్తిదారులకు ఎక్కువ ధర చెల్లిస్తుందని తెలిపారు. ఎక్కువ ధరలు చెల్లించటమే కాదని, బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నట్టు చెప్పారు.

sangam 02122020 2

దీనికి సంబంధించిన ధరల వివరాలు కూడా చెప్పారు. తాము గేద పాలుకు 46.83 రూపాయలు చెల్లిస్తున్నామని, అలాగే ఆవు పాలుకు 30.19 రూపాయలు చెల్లిస్తున్నామని, అయితే అముల్ మాత్రం గేద పాలుకు 45.48 రూపాయాలు, అలాగే ఆవు పాలుకు 28.00 రూపాయలకు చెల్లిస్తామని చెప్పారని తమ ప్రకటనలో తెలిపారు. ఇదే రేట్లతో తాము గత ఏడాది దాదాపుగా 9 కోట్లు పాల ఉత్పత్తిధారులకు చెల్లించామని అన్నారు. అలాగే ఉత్పత్తిధారులకు, పశువైద్య సేవలు, పశుదాణా కూడా సరఫరా చేసి, సబ్సిడీ పై పాడి పశువులకు బీమా ఇచ్చామని, వీటి కోసం ఏడాదికి 2.58 కోట్లు విడుదల చేసామని అన్నారు. సంగం కంటే, అముల్ వాళ్ళు 5 రూపాయాలు ఎక్కువ ఇస్తున్నారని ప్రభుత్వం ప్రకటించటం వాస్తవం కాదని అన్నారు. ఇలా మొత్తం వివరాలతో ప్రభుత్వ ప్రకటనను సంగం డైరీ ఖండించింది. మరి దీని పై ప్రభుత్వం స్పందిస్తుందో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రతిపక్ష పోరాటానికి తలొగ్గి, నిర్ణయం తీసుకున్న ఘటన, బహుసా ఈ 18 నెలల్లో ఇది ఒక్కటేనేమో. 151 సీట్లతో గెలిచిన జగన్ మోహన్ రెడ్డి, ఏ నాడు తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశాలు పట్టించుకోలేదు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో, తెలంగాణాతో కలిసి చట్టాపట్టాల్ వేసుకుని తిరిగుతున్న సందర్భంలో కూడా చంద్రబాబు, జగన్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇది మీ ఇద్దరి మైత్రి విషయం కాదు, రెండు రాష్ట్రాల భవిష్యత్తు, మీ ఇష్టం కాదు అంటూ, వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో చెవికి ఎక్కించుకోని జగన్, కేసిఆర్ ఎంతో గొప్పవారు అని అసెంబ్లీలో చెప్పారు. అయితే తరువాత తత్వం బోధ పడిందో ఏమో కానీ, అప్పటి నుంచి కేసీఆర్ జోలికి అయితే వెళ్ళటం లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో అంశంలో, ఇలాగే దూకుడుగా వెళ్ళినా, చివరకు తెలుగుదేశం పార్టీ చెప్పిన విషయం పై, గంటలు గడవక ముందే రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు రోజుల క్రిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన సంగాతి తెలిసిందే. మొదటి రోజున, నీరవ్ తుఫాన్ వల్ల రైతులు ఎదురుకున్న ఇబ్బందులు, పంట నష్టం గురించి చర్చ జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కన్నబాబు ఎప్పటిలాగానే జగన్ మోహన్ రెడ్డి భజన అందుకున్నారు. అయితే ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ లేవనెత్తిన అంశంతో ఒక్కసారిగా ప్రభుత్వం షేక్ అయ్యింది. కన్నబాబు మాట్లాడుతూ, తాము రైతుల తరుపున మొత్తం పంట భీమా ఇన్సురన్సు ప్రీమియం కడుతున్నాం అంటూ, చెప్పారు.

jagan 02122020 2

సరిగ్గా ఈ అవకాసం కోసమే ఎదురు చూస్తున్న తెలుగుదేశం పార్టీ, మీరు ఇన్సురన్సు కట్టలేదు, అబద్ధం చెప్తున్నారు అంటూ నినాదాలు చేసారు. లేదు మేము కట్టేసాం అని కన్నబాబు ఎదురు చెప్పారు. అయితే తమ దగ్గర ఆర్టీఐ రిపోర్ట్ ఉందని, మీరు కట్టలేదు ని తెలుగుదేశం చెప్పటంతో, డిసెంబర్ 15 న కడతాం అంటూ మాట మార్చారు. దీంతో అందరూ అవాక్కయారు. వెంటనే చంద్రబాబు దీని పై తాను మాట్లాడాలని, రైతులకు ఇంత అన్యాయం చేస్తారా, ఇన్సురన్సు కట్టకుండా, ఇప్పుడు తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇంత నష్టం చేస్తారా అంటూ అసెంబ్లీలో నేల పై కూర్చుని ధర్నా చేసారు. అయితే అప్పుడు ప్రభుత్వం చంద్రబాబుని కామెడీ చేసింది, ఏముంది, ఎందుకు హడావిడి, రేపు పేపర్ లో రావటానికి అంటూ దెప్పి పొడిచింది. అయితే ఇవి ప్రజల్లోకి వెళ్ళటంతో, చేసిన తప్పు తెలుసుకున్న ప్రభుత్వం రాత్రికి రాత్రి 590 కోట్లు రిలీజ్ చేస్తూ, జీవో విడుదల చేసింది. తాము చేసిన తప్పు, ప్రతిపక్షం చెప్పే దాకా, అధికార పక్షానికి తెలియలేదు. ఏది అయితేనేం రైతులకు ఇలా అయినా న్యాయం జరిగితే చాలు.

Advertisements

Latest Articles

Most Read