ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష్యుడు మాట్లాడుతూ, పోలవరంలో చంద్రబాబు అవినీతి చేసారు అంటూ, మాట్లాడారు. చంద్రబాబు దిగిపోయి 18 నెలలు అయినా, కేంద్రం పోలవరంలో అవినీతి జరగలేదని చెప్పినా, ఇప్పటి కొత్త ప్రభుత్వం పోలవరం పనులు నత్త నడకన చేస్తున్నా, వారిని కాకుండా తెలుగుదేశం పార్టీని నిందించటం చూసి,అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఈ అబద్ధాలను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జవహర్, ఘాటుగా స్పందించారు. ఆయన మాటల్లోనే "ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, చంద్రబాబు గారు అవినీతి అంటూ మాట్లాడుతున్న మాటలు చూస్తా ఉంటే, ఏమి తెలియని వ్యక్తికి పదవి ఇస్తే అదో రకం, అదే విధంగా అన్నీ తెలిసిన వ్యక్తికి పదవి ఇస్తే అదో రకం, అలా కాకుండా తెలిసీ తెలియని వాళ్లకు ఇస్తే, సోము వీర్రాజు రకంగా ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ సాక్షిగా జలవనరులు శాఖ, పోలవరం మీద ఎలాంటి అవినీతి జరగలేదని, పార్లమెంట్ సాక్షిగా చెప్పిన పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో ఉంటే, అదే ప్రభుత్వ పార్టీకి, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు, చంద్రబాబు అవినీతి చేసాడు అంటున్నారు. ఏదైతే పోలవరంలో అవినీతి జరిగింది, చంద్రబాబు సమయంలో, ఆ అవినీతి పై మీరు ఎందుకు మాట్లాడటం లేదని, సోము వీర్రాజు గారు, జగన్ గారిని ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే సోము వీర్రాజు గారు మేము ఒకటే చెప్తూ ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇరుకున పడినప్పుడు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ఫాల్ డౌన్ అయ్యే పరిస్థితి కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్లో ఎక్కడ తిరస్కారానికి గురి అవుతుందో అనే పరిస్థితి వచ్చినప్పుడు, భయంతో, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, అప్పుడప్పుడు నిద్ర లెగిసి వచ్చి స్టేట్మెంట్ లు ఇస్తూ ఉంటారు."

somu 05112020 2

"సోము వీర్రాజు గారు మీకు, ఏదైతే కేంద్ర జల శక్తి మంత్రి గారి ఫోన్ నెంబర్ లేకపోతే నేను పంపుతాను. మీరు ఆయన్ను కనుక్కోండి అవినీతి జరిగిందో లేదో. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వైరస్ ని అరికట్టటంలో రాష్ట్రం ఫెయిల్ అయితే, ఎన్నికలు జరపటం కుదరదు అనే వ్యక్తులు, స్కూల్స్ తెరిచి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంటే, దాని పై మీరు స్పందించండి. అదే విధంగా టిడ్కోకి సంబంధించి, మాట్లాడతా ఉన్నారు. ఈ రోజు ఆవ భూముల్లో జరిగిన అవినీతి గురించి మాట్లాడండి. అవినీతి పరులు మీ పక్కనే ఉన్నారు, వారిని నిలదీయండి. ఈ రోజు సోము వీర్రాజు గారికి ఒకటే సూచన చేస్తూ ఉన్నాం. నా ఇల్లు , నా సొంతం అని మేము కార్యక్రమం చేస్తున్నాం. దానికి మీరు మద్దతు తెలియ చేయండి. ప్రభుత్వ అవినీతిని, అలక్ష్యతను ప్రశ్నించండి. అప్పుడు మిమ్మల్ని బీజేపీ నాయకుడిగా మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు కాని, చంద్రబాబు పై ఉన్నవి లేనివి చెప్పి, అవినీతి జరగలేదని మీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, జరిగిందని మీరు చెప్తున్నారు కదా, మీరు కేంద్రంతో విచారణ జరపించుకోండి. చంద్రబాబు హయంలో 72 శాతం చేస్తే, ఇప్పుడు పనులు నత్తనడక కొనసాగుతున్నా, అవి మాట్లాడరు. రివర్స్ టెండరింగ్ లో చేసిన అవినీతి చెప్పారు. అవి చెప్పండి. ప్రజలు హర్షిస్తారు." అని జవహర్ అన్నారు.

అమరావతి భూములు అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దఖలు చేసినటువంటి పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ పిటీషన్ ను, జస్టిస్ అశోక్ బూషన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం, విచారణ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన మంత్రులతో ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సహజంగానే ఈ మంత్రులు సబ్ కమిటీ, అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ, గతంలో సాక్షిలో వచ్చిన అంశాలతో పాటు మరికొన్ని అంశాలు చెప్పింది. దీంతో ఈ క్యాబినెట్ సబ్ కమిటీ, అమరావతిలో అక్రమాలు జరిగాయని తేల్చటంతో, దీని పై రాష్ట్ర ప్రభుత్వం మరో సిట్ వేసింది. అయితే ఇది కావాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్న పనులు అని, ఒక్క ఆధారం కూడా చూపించకుండ, సిట్ వేసారని, కోర్టుకు వెళ్ళటంతో, హైకోర్టు క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ పై, అలాగే సిట్ పై స్టే వేధించింది. దీంతో హైకోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా రాకపోవటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టుకు వెళ్ళింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.

supremecourt 05112020 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గత ప్రభుత్వ హయంలో , అమరావతిలో జరిగిన వాటి పై ఒక క్యాబినెట్ సబ్ కమిటీ నియమించిందని, ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఆరు నెలలు పాటు అనేక అంశాలు పరిశీలించి, అవకతవకలు జరిగాయని నిర్ధారించుకుని, ఆ అంశాల పై విచారణ చేయటానికి సిట్ ని ఏర్పాటు చేసిందని, ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు వాదనలు వినిపించింది. అసలు ఈ విషయానికి సంబంధం లేని వ్యక్తులు, సిట్ కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేస్తే, హైకోర్టు దాని పై స్టే విధించటం సరి కాదని, రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని, సుప్రీం కోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు, హైకోర్టు స్టే ఎత్తివేయటానికి ఒప్పోకోలేదు. ముందుగా ప్రతి వాదులకు నోటీసులు ఇచ్చి, దీని పై వారి వాదన కూడా వింటామని, వారికి నోటీసులు ఇచ్చి, నాలుగు వారాలు సమయం కేటాయించి, అప్పటి లోగా అఫిడవిట్ దాఖలు చేయాలనీ, ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు, ఇప్పటికిప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయటానికి ఒప్పోకోలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు పై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సారీ చట్ట వ్యతిరేక నిర్ణయాలతో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నా, ఏ మాత్రం సరి చేసుకోకుండా, మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులలో అభాసుపాలు అవుతుంది. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, మళ్ళీ మమ్మల్ని కోర్టులు కావాలని తప్పు బడుతున్నాయి, మేము మంచి పనులు చేస్తుంటే మాకు అడ్డు పడుతున్నారు అంటూ, మీడియా ముందు చెప్పుకోవటం చూసాం. తాజాగా ఒక ప్రాంతంలో ఇస్తున్న ఇళ్ళ స్థలాల విషయంలో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఇళ్ళ స్థాలాలు కాదు, కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే అని గమనించాలి. విజయనగరం జిల్లాలో గుంపం అనే గ్రామంలో, దేవాయల భూములు తీసుకుని ఇళ్ళ స్థలాలకు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో, ఆ గ్రామస్తులు ఎదురు తిరిగారు. గుడి భూములు తీసుకోవటానికి వీలు లేదని ఎదురు తిరిగారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా, అక్కడ మార్కింగ్ లు అవి చేస్తూ ఉండటంతో, ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హైకోర్టు మెట్లు ఎక్కారు. ప్రభుత్వం, ఆలయాలకు సంబందించిన భూములు తీసుకుని, ఇళ్ళ స్థలాల పేరుతొ పంచి పెడుతుందని, దీని పై తగు ఆదేశాలు ఇవ్వాలి అంటూ వారు కోర్టుకు ఎక్కారు.

lands 04112020 2

దీని పై స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు ఆలయాల భూములు తీసుకోవాలనే నిబంధన ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించింది. దీని పై తమకు పూర్తి సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయం పై తమకు నాలుగు వారలు లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. దీని పై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు చేయవద్దు అంటూ, స్టే విధించింది. అయితే ఇప్పటికే ఇలా ఆలయాల భూముల్లో, మైనింగ్ భూముల్లో, ఆవ భూముల్లో, స్మశాన భూముల్లో, చెరువులు, మునక ప్రాంతాలలో, కొండలు, గుట్టల్లో , అటవీ భూముల్లో, మడ, ఆవ భూముల్లో, పశువుల మేత భూముల్లో, పాఠశాలల ఆటస్థలంలో, ఇలా అనేక చోట్ల ఇళ్ళ స్థలాలు అంటూ ప్రభుత్వం, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటంతో, సదరు పార్టీలు కోర్టుకు వెళ్ళటంతో, అక్కడ మాత్రమే కోర్టు తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటూ స్టే విధించింది. అయితే, ఇవన్నీ కలిపినా 2 వేల ఎకరాలు కూడా ఉండదు, మరి మిగతా 30 - 40 వేల ఎకరాలు ప్రభుత్వం ఎందుకు పంచిపెట్టటంలో అర్ధం కావటం లేదు. పంచి పెట్టకుండా, కోర్టులు ఆపేశాయి అంటూ, ఎదురు దాడి చేసి తప్పించుకుంటున్నారు. మరి మిగతా చోట్ల భూ సమీకరణ జరగలేదో, మరేదైనా కారణమో కానీ, ఇళ్ళ పట్టాల విషయంలో ప్రభుత్వం ఇలా రాజకీయం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, రాష్ట్ర విభజన తరువాత, వైసీపీ పార్టీ, ఒక పెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటి దాకా పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస పార్టీ, రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు తరువాత చిన్న పార్టీగా అయిపోయిన తరువాత, వైసీపీకి లైఫ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వారు అందరూ కాంగ్రెస్ ని కాదని, వైసీపీ వైపు చూడటం మొదలు పెట్టారు. అయితే చాలా మందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ అని అర్ధం. కానీ తన తండ్రి పేరుని రాజకీయంగా వాడుకోవటానికి, జగన్ మోహన్ రెడ్డి పార్టీ పేరుని ఇలా వాడుకుని ఉండవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ చేసే సమయానికి, అప్పటికే అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకో పార్టీ ఉండటంతో, జగన్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎక్కడా వాడకూడదు అంటూ ఆదేశాలు ఇచ్చింది. అయితే కాల క్రమంలో, ఎవరూ దాన్ని పట్టించుకోలేదని చెప్పాలి. వార్తల్లో కానీ, వివిధ పార్టీలు కానీ, చివరకు వైసీపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే సంబోధించింది. అయితే, ఎవరూ దీని పై ఫిర్యాదు చేయక పోవటం అది అలా నడుస్తూ వహ్చింది. అయితే ఈ మధ్య, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకి షోకాజ్ నోటీస్ ఇచ్చే సమయంలో, లెటర్ హెడ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంతో, అభ్యంతరం వ్యక్తం చేసారు ఎంపీ. 

ycp 0512020 2

తనకు ఇచ్చిన బీఫారంలో యువజన శ్రామిక రైతు కాంగ్రస్ పార్టీ అని చెప్పి, ఇక్కడ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారని, అభ్యంతరం తెలిపారు. దీంతో అసలు పార్టీ అయిన అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయ్యి, తమ పేరు వాడుకుంటున్నారు అంటూ, ఢిల్లీ హైకోర్టులో కంప్లైంట్ ఇచ్చింది. దీని పై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్‌ జయంత్‌నాథ్‌ ఈ పిటీషన్ విచారించారని, ఈ సందర్భంగా వైసిపీ రాజకీయ పార్టీ ఏనా అంటూ, జడ్జి విస్మయం వ్యక్తం చేసారు అంటూ, అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, షైక్‌ మహబూబ్‌ బాషా మీడియాకు తెలిపారు. ట్రేడ్ మార్క్ చట్టం ప్రకారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరు వాడుకునే హక్కు తమకు ఉందని జగన్ పార్టీ తరుపు న్యాయవాదులు వాదించగా, మీది రాజకీయ పార్టీ ఏనా అంటూ న్యాయమూర్తి అడిగారని, షైక్‌ మహబూబ్‌ బాషా తెలిపారు. జగన్ పార్టీ వేసిన అఫిడవిట్ పై కౌంటర్ కు సమయం అడిగామని, దీంతో ఈ కేసు వచ్చే ఏడాది జనవరి 29కి వాయిదా వేసారని తెలిపారు. జగన పార్టీ వేసిన అఫిడవిట్ మీడియాకు ఇవ్వటానికి, న్యాయమూర్తి ఒప్పుకోలేదని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read