ఆయన గతంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. కేంద్ర సర్వీసుల్లో చేసారు. కీలకమైన ఆర్ధిక శాఖలో చేసారు. అది కూడా అలాంటి ఇలాంటి పదవిలో కూడా, ఏకంగా కార్యదర్శి పదవిలో. కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శిగా ఆయన పని చేసారు. అంటే కేంద్రం ఆర్ధిక మంత్రి తరువాత, ఆ శాఖలో అంత పవర్ ఉండేది ఆయనకే. ఆయనే సుభాష్‌ చంద్ర గార్గ్‌. అయితే ఆయన ఆకంసికంగా రిటైర్డ్ అయ్యారు. స్వచ్ఛదంగా పదవి నుంచి తప్పుకున్నారు. నిర్మలా సీతారామన్‌ ఆర్ధిక మంత్రిగా ఉండగా, సుభాష్‌ చంద్ర గార్గ్‌ కార్యదర్శిగా ఉండేవారు. అయితే ఆయన్ను ఆర్ధిక శాఖ నుంచి, విద్యుత్‌ శాఖకు బదిలీ చేసారు. ఇది అవమానంగా భావించిన సుభాష్‌ చంద్ర గార్గ్‌ , తన పదవికి స్వచ్ఛదంగా పదవీ విమరణ చేసి, 2019 అక్టోబర్ నెలలో రిలీవ్ అయిపోయారు. అయితే అనూహ్యంగా ఆయన రిటైర్డ్ అవ్వగానే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనతో సంప్రదించి, ఆయనకు వెంటనే ప్రభుత్వంలో సలహదారు పదవి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక సలహాదారుడుగా నియమితులు అయ్యారు. రాష్ట్రం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో, ఇలాంటి సలహాదారులు కావాలని అనుకున్నారో ఏమో కానీ, రిటైర్డ్ అయిన వెంటనే ఆయన్ను తీసుకు వచ్చారు. అయితే ఎక్కడో ఉన్న సుభాష్‌ చంద్ర గార్గ్‌ కి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు ఎలా లింక కుదిరిందో తెలియదు కానీ, ఆయన్ను సలదారుడుగా పెట్టుకున్నారు.

garg 03112020 2

ఆయన సలహాలు ఏ మేరకు ఉపయోగ పడుతున్నయో కానీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి ఎప్పుడూ లేని విధంగా దిగజారి పోతుంది. ఏడాదికి పెట్టుకున్న అప్పు అంచనాలు, ఆరు నెలల్లోనే రాష్ట్రం దాటేసింది. ఆదాయం పెరగటం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. మరి సుభాష్‌ చంద్ర గార్గ్‌ గారి సలహాలు వర్క్ అవ్వటం లేదా, లేక ఆయన ఇచ్చే సలహాలు ఏమిటి అనేవి అర్ధం కావటం లేదు. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు సుభాష్‌ చంద్ర గార్గ్‌ సడన్ గా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసారు. ఎప్పుడో అక్టోబర్ లో రిటైర్డ్ అయితే ఇప్పుడు ఆయన విమర్శలు చేస్తున్నారు. నిర్మలా సీతారామన్ తనను కావాలని టార్గెట్ చేసారని, నన్ను ఫైనాన్సు డిపార్టుమెంటు లో లేకుండా చేసారని, ఆమెతో పని చేయటం చాలా కష్టం అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ఆర్ధిక మంత్రి పై, గతంలో పని చేసిన కార్యదర్శి ఈ విధంగా వ్యాఖ్యలు చేయటంతో, ఇది నేషనల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర సలహాదారుగా ఉన్న గార్గ్, ఇలా కేంద్రాన్ని టార్గెట్ చేయటం వెనుక, రాష్ట్ర ప్రభుత్వ అజెండా కూడా ఏమైనా ఉందా అనే వార్తలు కూడా వచ్చాయి. నిర్మలా సీతారామన్, గతంలో రాష్ట్రానికి ఇచ్చిన ఆర్ధిక స్వేఛ్చ, ఇప్పుడు ఇవ్వటం లేదనే వాదన మధ్య, ఈ కొత్త అంశం చర్చకు దారి తీసింది.

కేసీఆర్ , జగన్ ల మధ్య స్నేహం ఎంత బలంగా ఉంటుందో అందరూ చూసారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు అయితే , కోటలు దాటాయి. తాము పోలవరం ప్రాజెక్ట్ పై వేసిన కేసులు అన్నీ వెనక్కు తీసుకుంటాం అన్నారు. ప్రత్యెక హోదా కోసం కలిసి పోరాటం చేస్తాం అన్నారు. ఎన్నికలు తరువాత రాయలసీమను రత్నాలు సీమ చేస్తాను అన్నారు. ఇక జగన్ గారు అయితే, రాయలసీమకు అన్యాయం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు కూడా వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఇలా ఇద్దరూ ఒకరిని ఒకరు వాటేసుకుని, దావత్ లు ఇచ్చుకుని, రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పారు. ఇక ఎన్నికల తరువాత, మొత్తం సీన్ మారిపోయింది. కీలకమైన ఇరిగేషన్ రంగంలో తెలంగాణా నుంచి కొర్రీలు మొదలు అయ్యాయి. ఇక నీటి పంపకాలు విషయంలో కూడా గొడవలే. ఆస్తులు విభజనలో పురోగతి లేదు. ఇలా అన్ని విషయాలో తెలంగాణా కొర్రీలు పెడుతూనే ఉంది. అయితే ఎందుకో కానీ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి మాత్రం, అనుకున్న స్థాయిలో ప్రతిఘటన లేదు. ప్రతి దానికి తెలంగాణా చెప్పిన దానికి లొంగిపోతున్నారు అనే అభిప్రాయం ఉంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసి, తెలంగాణా ఆర్టీసి మధ్య జరిగిన ఒప్పందం చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేసింది, ఎందుకు తెలంగాణా ప్రభుత్వానికి ఇంతలా లొంగిపోవాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు.

tn rtc 03112020 2

రాష్ట్ర విభజన తరువాత, తెలంగాణా రాష్ట్రానికి ఆర్టీసి బస్సులు, అటు తెలంగాణా రాష్ట్రము నుంచి ఏపికి వచ్చేవి. అయితే ఎక్కువగా ఏపి బస్సులే తెలంగాణాలో తిరిగేవి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ కర్నూల్ రూట్ లో ఎక్కువగా ఏపి బస్సులు తిరిగేవి. భారీ లాభాలు ఈ రూట్ లో మన రాష్ట్ర ఆర్టీసికి వచ్చేది. అయితే లాక్ డౌన్ లో బస్సులు ఆగిపోవటంతో, మళ్ళీ బస్సులు తిప్పటానికి తెలంగాణా అడ్డు పడింది. దాదపుగా రెండు మూడు నెలల నుంచి చర్చలు జరుపుతున్నారు. మన మంత్రి పెర్ని నాని గారు అయితే, అదిగో ఇదిగో అని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు తెలంగాణా చెప్పిన ప్రతి షరతుకు లొంగి, ఆర్టీసీకి దెబ్బ కొట్టారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఆరోపించారు. గతమలో టిడిపి హయంలో, తెలంగాణాకు తిప్పింది 2,65,367 కి.మీ అయితే, దాన్ని ఇప్పుడు 1,60,999 కి.మీ తగ్గించారని, అంటే 1,04,368 కి.మీ తగ్గించారని, అలాగే 250 బస్సులు నడిపే హక్కును ఏపి కోల్పోయిందని, దీని వల్ల రూ.273 కోట్ల వరకు మనకు నష్టం అని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణా మాత్రం, మన రాష్ట్రంలో తిప్పే బస్సులు పెంచుకుందని, దాని వల్ల తెలంగాణాకు రూ.300 కోట్ల వరకు లాభం అని, ముఖ్యంగా విజయవాడ - హైదరబాద్ రూట్ లో, మొత్తం తెలంగాణా ఆధిపత్యమే ఉందని, అసలు ఇలా ఎందుకు లోనిపోయి, ఏపిఎస్ ఆర్టీసికి నష్టం చేస్తూ, తెలంగాణాకు లాభం చేసే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు, పట్టాభి.

సీనియర్ ఐపిఎస్ అధికారి, గత ప్రభుత్వ హయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబి వెంకటేశ్వరరావు పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఎక్కడా కొనుగోళ్ళు జరగకుండానే, ఏమి లేకుండానే తన పై కక్ష సాధింపు చేస్తున్నారు అంటూ, ఏబి వెంకటేశ్వర రావు, ప్రభుత్వ సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ, హైకోర్టుకు ఎక్కారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్ట్, ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి, ఆయనకు ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న జీతం కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఈ విషయాన్ని ప్రతిష్టగా తీసుకుని, హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ రద్దు ఉత్తర్వులు ఎత్తివేయాలి అంటూ, సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. దీనికి సంబందించిన విచారణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే ఈ కేసు విచారణ తన ముందుకు రావటంతో, ఈ కేసు విచారణ నుంచి తాను వైదొలుగుతున్నట్టుగా జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. ఈ కేసు నాట్ బిఫోర్ మీ అంటూ, ఈ కేసుని వేరే బెంచ్ కు విచారణకు తీసుకుంటే బాగుటుందని తప్పుకున్నారు. శీతాకాల సమావేశాలు తరువాత అంటే, దీపావళి తరువాత, ఈ కేసు వేరే బెంచ్ ముందుకు వచ్చే అవకాసం కనిపిస్తుంది.

sc 03112020 2

అయితే ఈ పరిణామం పై ఎందుకు నాట్ బిఫోర్ అన్నారు అనే విషయం పై కారణాలు అయితే చెప్పలేదు. లావు నాగేశ్వరరావు గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి చెందిన వారు. అంచెలంచెలుగా ఎదిగి, సుప్రీం కోర్టు జస్టిస్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం, ఏకంగా సుప్రీం కోర్టు జడ్జిల పై, కాబోయే చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా పైనే , వివిధ ఆరోపణలు ఆపాదించి, అలాగే వైసీపీ పార్టీ సోషల్ మీడియా, కులం పేరుతో జడ్జిలను అల్లరి చేస్తున్న నేపధ్యంలో, ఆ వాతావరణం, ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో, అనవసర చర్చ ఎందుకు అనుకున్నారో ఏమో కానీ, జస్టిస్ లావు నాగేశ్వరరావు ఈ కేసు నుంచి తప్పుకున్నారు. గతంలో ఏపి, తెలంగాణా నుంచి వచ్చిన అనేక కేసుల్లో విచారణ జరిపారు, కానీ ఈ కేసులో మాత్రం, తప్పుకున్నారు. ఒక విధంగా ఇదే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే, కేసు merits ప్రకారం, హైకోర్టు తీర్పుని సమర్ధించాల్సిన పరిస్థితి వస్తే, రాష్ట్రంలో జడ్జిల పైనే వ్యక్తిగతంగా అల్లరి చేస్తున్న పరిస్థితిలో, ఇది సరైన నిర్ణయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక్క జిల్లాలో రూ.700 కోట్ల అంటే, రాష్ట్రం మొత్తం ఎంత కుంభకోణం చేసి ఉంటారో చూడండి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్, కేంద్ర ప్రభుత్వానికి సంచలన లేఖ రాసారు. ఇప్పటి వరకు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియని స్కాం అనే చెప్పాలి. నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణలో భాగంగా, ఇంత భారీ స్కాం జరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌కు లేఖ రాసారు ఎంపీ గల్లా జయదేవ్. దళారులు, కొంత మంది అధికారులు, మిల్లర్లు, వీరి వెనుక ఉన్న బడా నేతల వైఖరి వల్ల, రైతులు అన్యాయం అయిపోతున్నారని వాపోయారు. ఈ మొత్తం వ్యవహారం పై జాతీయ దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించి, ఈ కుంభకోణం మొత్తాన్ని బయటకు తీయాలని కోరారు. దీనికి ఉదాహరణగా నెల్లూరు జిల్లాలో ఒక రైతు ఖాతాలో 8 లక్షాలు రూపాయలు అదనంగా పడిన విషయాన్ని , తరువాత అతను ఈ విషయం పై ఫిర్యాదు చేస్తే, దాని పై విచారణ చేయకుండా, రైతుని పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం, వంటివి ఈ స్కాంలో ఉన్న మరో కోణం అంటూ, గల్లా వివరించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ధాన్యం సేకరణ జరుగుతుంది కాబట్టి, ఈ విషయం పై కేంద్రం కూడా చొరవ చూపాలని గల్లా లేఖలో తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రాల్లో ఉండే సివిల్ సఫ్లై కార్పొరేషన్ ల ద్వారా ధాన్యం సేకరణ చేస్తారు.

piyush 03112020 1

ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈ సారి 8 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే, కేవలం 3 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసారు. దీనికి కారణం మధ్యవర్తులు, అధికారులు, మిల్లర్లు, బడా నేతలు కలిసి కుంభకోణం చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఇది తెలుగుదేశం ఆరోపణ "మిల్లర్లు, మద్యవర్తులు కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు రైతులను అధిక మొత్తంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడమే కాకుండా తేమ, తరక నెపంతో తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మొత్తాలను కొలుచుకున్నారు. లోకల్ అధికారులతో కుమ్మకైన మిల్లర్లు, మధ్యవర్తులు డేటా బేస్ లో బినామి పేర్లను ఎక్కించారు. ఈ-క్రాప్ ప్రొక్యూర్ మెంట్ డేటా బేస్ ను, ఆంధ్రప్రదేశ్ సివిల్ సఫ్లైస్ కార్పొరేషన్ డేటాను, వ్యవసాయ శాఖకు సంబంధించిన పంట మరియు సాగు డేటాను పరిశీలించిన జరిగిన అవకతవకలు బయటపడుతాయి. డేటా బేస్ లోని పొంతనలేని లెక్కలే వరి ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందనడానికి సూచన. ఇలా రైతులకు చెందాల్సిన కనీస మద్దతు ధర పొందిన మిల్లర్లు/మధ్యవర్తులు స్థానిక ప్రొక్యూర్ మెంట్ అధికారులకు వాటాలను చెల్లించారు.
" ఇలా అనేక వివరాలతో కేంద్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసిబికి తెలుగుదేశం ఫిర్యాదు చేసింది. మరి ఇందులో నిజా నిజాలు తెలుస్తారా, లేదో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read