ప్రజా ప్రతినిధుల పై క్రిమినల్ కేసులకు సంబంధించి విచారణ వేగవంతం చేయాలి అంటూ, అమికస్ క్యూరి హన్సారియ ఇచ్చినటు వంటి నివేదికల పైన ఈ రోజు, సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ జరిగింది. అమికస్ క్యూరి హన్సారియ ఇచ్చిన నివేదికలో, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసుల విచారణ త్వరతిగతిన జరపించాల్సిన మార్గదర్శకాలు జారీ చేయాలి అంటూ, ఆయన సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసారు. దీని పై పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాది లోపు విచారణ చేయాలని, 2015 నాటి సుప్రీం కోర్టు తీర్పు అమలు కాక పోవటాన్ని, బీజేపీ నేత అశ్వనీ కుమార్ ఉపాధ్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దానికి సంబంధించి, ఈ కేసును జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సత్వర విచారణ పై, వివిధ రాష్ట్రాల హైకోర్టుల నుంచి కూడా, వివరాలు కోరుతూ నివేదిక కోరింది. ఆ నివేదిక వచ్చిన తరువాత, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టులు ఇచ్చిన నివేదికలు ఆధారంగా, అమికస్ క్యూరి సుప్రీం కోర్టుకు తాజాగా ఒక నివేదిక సమర్పించారు. ఇందులో ముఖ్యంగా తమిళనాడుకు సమర్పించి, మద్రాస్ హైకోర్టు ఇచ్చినటు వంటి తీర్పులో, ప్రత్యేక కోర్టుల పై రాజ్యాంగా చెల్లుబాటుకు సంబంధించి మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులు అనేక సందేహాలు వ్యక్తం చేసారు.

sc 04112020 2

దీంతో వీటి పై కూడా ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. మద్రాస్ హైకోర్టు, నేరస్తుల ఆధారంగా కాకుండా, నేరాల ఆధారంగా ఈ ప్రత్యెక కోర్టులు ఉండాలంటూ వ్యాఖ్యానించటం సరి కాదు, దాన్ని సరిచేసుకోవాలని, రెండు వారాలు గడువు సుర్పీం కోర్టు ఇచ్చింది. ఈ రోజు ముఖ్యంగా ప్రత్యేక కోర్టులు, నోడల్ ఆఫీసర్ , జ్యుడీషియల్ ఆఫీసర్స్, సాక్షులకు రక్షణ, ప్రత్యెక కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ లాంటి మౌళిక సదుపాయాల ఏర్పాటు, వాటి అన్నిటి పై సిఫార్సు చేయగా, ఈ రోజు వీటి పై ఆదేశాలు ఇచ్చే అవకాసం ఉంది. అలాగే కర్ణాటక, బెంగాల్ లో కేవలం ఒకే ప్రత్యేక కోర్ట్ ఉండటంతో, వాటిని పెంచే ఆదేశాలు కూడా ఇచ్చే అవకాసం ఉంది. ఇక ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటి అంటే, అధిక శిక్షపడే కేసులను ముందు విచారణ చేయాలనీ, సిట్టింగ్ ప్రజాప్రతినిధుల కేసులకు ప్రాధాన్యం ఇచ్చి, వారి సంగతి ముందు చూడాలని కోర్టుకు తెలిపారు. కోర్టు దీని పై సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వాళ్ళు, అలాగే ఎక్కువ నేరారోపణ ఉన్న వాళ్ళ కేసులు ముందుగా విచారణ చేస్తారు. దీని పై ఈ రోజు కానీ, రేపు కానీ మార్గదర్శకాలు ఇచ్చే అవకాసం ఉంది.

పోలవరం విషయంలో రోజుకి ఒక షాకింగ్ వార్త కేంద్రం నుంచి వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. ప్రతి రూపాయి కేంద్రం ఇస్తామని చెప్పింది. పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏజెన్సీగా పెట్టుకుని, పోలవరం పనులు చేస్తున్నారు. గత ప్రభుత్వం, ముందుగానే డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చింది. కేంద్రం నుంచి డబ్బులు రీయింబర్స్ అయ్యేవి. ఎన్నికల ముందు పోలవరం అంచనాలను రూ55 వేల కోట్లకు సాధించుకోవటంలో తెలుగుదేశం సక్సెస్ అయ్యింది. అయితే ఆ తరువాత మొత్తం మారిపోయింది. జగన్ ప్రభుత్వం రావటం, పోలవరం ప్రాజెక్ట్ పనులు ఆపేసి రివర్స్ టెండరింగ్ కి వెళ్ళటం. వెయ్యి కోట్లు వరకు మిగిలాయి అంటూ, ప్రచారం చేయటం ఇలా జరిగిపోయాయి. దాదపుగా ఆరు ఏడు నెలలు పోలవరం పనులు ఆగిపోయాయి. తరువాత కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. అయితే పనులు మాత్రం నత్త నడకన సాగుతున్నాయి. ఇవి ఇలా జరుగుతూ ఉండగానే, గతంలో ఆమోదించిన రూ.55 వేల కోట్లు కాకుండా, కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం అంటుంది. దీని పై చర్చ జరుగుతుంది. ఈ నేపదంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, ఇదంతా తెలుగుదేశం పార్టీ వల్లే అంటూ ఎప్పటి లాగా రాజకీయ ఆరోపణలు మొదలు పెట్టింది. అప్పట్లో కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే, చంద్రబాబు చూస్తూ కూర్చున్నారు అంటూ, ఒక రకమైన ప్రచారం మొదలు పెట్టారు. అయతే ఈ ప్రచారం పై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది.

nirmala 04112020 2

ఆ నాటి క్యాబినెట్ నోట్ తో పాటుగా, అనేక డాక్యుమెంట్ లు బయట పెట్టారు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని, కేవలం తమ కేసులు కోసం, రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని, రాజధానిని అలాగే చేసారని, ఇప్పుడు పోలవరం విషయంలో కూడా రాష్ట్రానికి తీవ్ర నష్టం చేస్తున్నారని వాపోయారు. అయితే వీరి ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మరో అంశం మీడియా వర్గాల్లో ప్రచారం అవుతుంది. పోలవరం అంచనాలు తగ్గింపు విషయం వచ్చిన తరువాత, కేంద్రం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారమాన్ మీడియా సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో కేంద్ర పధకాల గురించి చెప్పారు. మీడియా సమావేశం అయిన తరువాత మీడియాతో చిట్ చేస్తూ ఉండగా, పోలవరం విషయం పై ఒక విలేఖరి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్లు ఆదా చేసామని చెప్తుంది కదా అని ప్రశ్నించగా, దానికి నిర్మలా సీతారమన్ మాట్లాడుతూ, అవును మంచి విషయం చెప్పారు, వెయ్యి కోట్లు ఆదా చేసారు, ఇది కూడా తుది అంచనాలలో తగ్గించాలి అంటూ, పక్కనే ఉన్న అధికారులకు, ఈ వెయ్యి కోట్ల గురించి చెప్పి, తుది అంచనాలలో తగ్గించమని కోరినట్టు తెలుస్తుంది. అంటే జగన్ గారి రివర్స్ టెండరింగ్ మరి రాష్ట్రానికి నష్టమో, కేంద్రానికి లాభమో, కాలమే నిర్ణయం తీసుకుంటుంది. మొత్తానికి అన్ని విధాలుగా పోలవరం పై కొర్రీలు పెడుతూ, ఖర్చులు తగ్గిస్తూ వస్తున్నారు అనమాట.

నెల్లూరు జిల్లా, గూడూరు నియోజవర్గంలో వైసిపీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరుకున్నారు. ఏకంగా గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్ ఇంటినే, వైసీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే వరప్రసాద్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని, పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. ఆయన పైన అవినీతి ఆరోపణలు రావటం కొత్త కాదు. గతంలో ఒక తోళ్ళ పరిశ్రమ ఏర్పాటు విషయంలో, ఆ కంపెనీ యాజమాన్యం నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆందోళన చేసారు. అయితే ఈ సారి మాత్రం, ఏకంగా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే పై తిరగబడ్డారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే, గూడూరు ఎమ్మెల్యే పై, రెండు సార్లు తిరుగుబాటు వచ్చింది. గూడూరు ప్రాంత ప్రజలు కూడా , ఏకంగా ఒక ఎమ్మెల్యే పై, అదే పార్టీ నేతలు ఆందోళన చేయటం ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ప్రధానంగా నాలుగు రోజుల క్రిందట, ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, అలాగే ఇంచార్జ్ మంత్రి బాలినేని, జిల్లా మంత్రి అనిల్, ముగ్గురు కలిసి, గూడూరులో ఉన్న నాయకులును, ఎమ్మెల్యేని కూర్చోబెట్టి, వర్గ విబేధాలు మానండి, పార్టీని బజారున పడేయ వద్దు, ప్రత్యర్ధి పార్టీలకు అవకాసం ఇవ్వకండి, ఇప్పటికే పార్టీ పై వ్యతిరేకత వస్తున్న వేళ, మనం మనం కొట్టుకుంటే కష్టం అంటూ, ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు.

guduru 04112020 2

అయితే ఆ సమయంలోనే రెండు వర్గాల మధ్య మాటలు యుద్ధం జరిగిందని సమాచారం. అయితే సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రులు బాలినేని, అనిల్ లాంటి వాళ్ళు చెప్పినా, అక్కడ వినే పరిస్థితి లేదు. గూడూరుకి నలుగురు ఎమ్మేల్యేలు ఉన్నారు అంటూ, వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద గూడూరులో నాలుగు వర్గాలుగా ఉండటం, అలాగే అధిష్టానం వీరి పై పట్టు తెచ్చుకోలేక పోవటంతో, ఏకంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి, అవినీతి చేస్తూ, ఇంటి గుట్టు బయట పెట్టుకునే వరకు వచ్చింది. అయితే ఎమ్మెల్యే వరప్రసాద్ మాత్రం, తన పై , పై స్థాయిలోనే కుట్ర జరుగుతుందని వాపోతున్నారు. జగన్ తోనే తేల్చుకుంటాను అంటూ, చెప్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో అవినీతి చేస్తుంటే, కావాలని వరప్రసాద్ ని అల్లరి చేస్తున్నారు అంటూ, వరప్రసాద్ వర్గీయలు వాపోతున్నారు. అయితే వరప్రసాద్ దీని పై ఏమి చేస్తారు ? జగన్ వద్ద తెల్చుకుంటారా, లేక ఏదైనా కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనేది చూడాలి. మరో పక్క మెజారిటీ నియోజకవర్గాల్లో, వైసీపీలో గ్రూపులు ఎక్కవు అయిపోతున్నాయి. ప్రతి చోట రెండు వర్గాలు, పార్టీని రోడ్డున పడేస్తున్నారు. మరో పక్క, జగన్ మొహన్ రెడ్డి మాత్రం, ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ అప్పాయింట్మెంట్ ఇవ్వకపోవటం, తరుచూ వాళ్ళతో మాట్లాడకపోవటంతో, గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల పై, ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి క్లారిటీ వచ్చింది. ఇక హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది, దీని పై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తుందా, లేక ఎలక్షన్ కమిషన్ తో సహకరిస్తుందా లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. హైకోర్టులో గత ఏడాది వేసిన పిటీషన్ విచారణకు వచ్చిన సందర్భంలో, ఇప్పుడు ఎన్నికలు జరుపుతారా లేదా చెప్పాలి అంటూ, ఒక అఫిడవిట్ వేయమని హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని పై కసరత్తు చేసింది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టింది. రాష్ట్ర హెల్త్ అధికారులతో మాట్లాడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోవటానికి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరి నుంచి నివేదిక తెప్పించుకుంది. ఈ మొత్తం కసరత్తు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో సమర్పించింది. తాము ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించింది. సమయం చూసుకుని, ఎన్నికల షడ్యుల్ కూడా ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఇదే సందర్భంలో పలు విషయాలు కూడా కోర్టుకు తెచ్చింది. ముఖ్యంగా ఎన్నికలు జరపటానికి, బ్యాలెట్ బాక్స్ లు సిద్ధంగా లేవని చెప్పింది. గతంలో తెలంగాణా నుంచి తెప్పించామని, అయితే హైదరాబాద్ లో మునిసిపల్ ఎన్నికలు రావటంతో, వారు తమ బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరటంతో, వారికి తిరిగి ఇచ్చేసామని, అలాగే వివిధ దక్షిణాది రాష్ట్రాలతో మాట్లాడామని అయినా, ఎవరి నుంచి సహకారం అందలేదని తెలిపింది. బ్యాలెట్ బాక్సుల అందుబాటుని బట్టి, తాము ఎన్నికల షడ్యుల్ ప్రకటిస్తామని కోర్టుకు తెలిపింది.

nimmagadda 04112020 2

ఇక అలాగే మార్చి నెలలో నామినేషన్ లో సందర్భంలో జరిగిన ఘటనలు గురించి కూడా ప్రస్తావిస్తూ, ఈ సారి అదనపు బలగాలు కావాలని, ప్రభుత్వం దీనికి సహకారం అందించాలని కోరింది. అయితే తమతో ప్రభుత్వం , శత్రుత్వం పెంచుకున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం రావటం లేదని తెలిపింది. గత మార్చిలో క-రో-నా ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, మొత్తం అన్ లాక్ చేసారని, ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలో అవగహన వచ్చిందని, అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, అన్నీ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల నిర్వహణ చేస్తామని, అయితే దీనికి ప్రభుత్వ సహకారం అవసరం అని తెలిపింది. గతంలో జరిగిన ఘటనల పై కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చామని తెలిపింది. తాము కొంత మంది అధికారులని బాధ్యత చేసి చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా కోర్టుకు తెలిపింది. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని, స్వేచ్చగా, ఎలాంటి ఘటనలు జరగకుండా , ప్రభుత్వం సహకారం ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. మరి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ పై ప్రభుత్వం కౌంటర్ వేస్తుందా, లేక కోర్టు ఏదైనా నిర్ణయం ప్రకటిస్తుందా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read