ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్ర ప్రభుత్వం, మేము మద్య నిషేధం చేస్తున్నాం అంటూ, ఇందులో భాగంగా, షాపులు తగ్గిస్తున్నాం, రేట్లు పెంచేస్తున్నాం, ఆ రేట్లు చూస్తే షాక్ కొట్టే విధంగా ఉంటాయి, దీంతో అసలు మందు తాగటమే మానేస్తారు, మద్య నిషేధం లో ఇది ఒక భాగం అంటూ ఊదరగొట్టారు. అయితే ఈ క్రమంలో ఊరు పేరు లేని బ్రాండులు తెచ్చి, మార్కెట్ లోకి వదలటంతో, మందు బాబులకు నిజంగానే షాక్ కొట్టింది. అందులో నాసిరకం సరుకు పెడుతున్నారని, బ్రాండెడ్ వాటి కంటే భారీగా రేట్లు పెంచేసారని, ఆరోగ్యంతో ఆటలు ఆడుకోకుండా, కనీసం బ్రాండెడ్ మందు అయినా మార్కెట్ లోకి వదలాలని గోల గోల చేసారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక దీనికి తోడు తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక నుంచి వచ్చే మద్యం అయితే అంతు లేకుండా వస్తుంది. ప్రభుత్వం స్పెషల్ డిపార్టుమెంటు పెట్టామని చెప్పినా, వారిని ఒకసారి ఎక్కడో ఒక చోటు పట్టుకుంటూ ఉన్నా, బయట రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం మాత్రం కంట్రోల్ లేదు. ఈ దందా అంతా కూడా అధికార పార్టీ నేతలే నడుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ నడుస్తూ ఉండగానే, లాక్ డౌన్ వచ్చింది. దాదాపుగా మూడు నెలలు అన్నీ మూసుకు పోయి ఉన్నాయి. మందు బాబులకు కూడా ఈ కష్టాలు తప్పలేదు. దీంతో శాశ్వతంగా ఈ షాపులు మూసేయటానికి ఇదే మంచి తరుణం అని అందరూ ప్రభుత్వాన్ని కోరారు. అలవాటు తప్పి పోయింది కాబట్టి, ప్రభుత్వం చెప్పిన మద్యపాన నిషేధానికి ఇదే కరెక్ట్ టైం అని, ఇలాంటి అవకాసం మళ్ళీ రాదని చెప్పినా, ప్రభుత్వం దేశంలోనే మొదటి సారి మన రాష్ట్రంలోనే లాక్ డౌన్ తరువాత మద్యం షాపులు తెరిచింది.

రేట్లు కూడా భారీగా మళ్ళీ పెంచింది. అయినా వెనక్కు తగ్గలేదు మందు బాబులు. అయితే మళ్ళీ ప్రభుత్వం ఏమి అనుకుందో ఏమో, ఈ సారి మద్యం రేట్లు తగ్గించింది. మద్యపాన నిషేధంలో భాగంగా షాక్ కొట్టే రేట్లు పెట్టామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు తగ్గించేందో ఎవరికీ అర్ధం కాలేదు. ప్రభుత్వ రెండు నాల్కుల ధోరణి ఇక్కడే అర్ధం అవుతుంది. ఇక దీంతో మందు బాబులకు అడ్డు అదుపు లేకుండా పోయండి. మద్యపాన నిషేధం అనే ప్రభుత్వ మాటలు ఉత్తిత్తి మాటలు గానే మిగిలిపోయాయి. అమ్మాకలు 50 శాతం పైగా పెరిగాయి. ఈ ఏడాది మే నుంచి ఆగష్టు వరకు 12 లక్షల కేసులు లిక్కర్, 2.5 లక్షల కేసుల బీరు అమ్మిన ప్రభుత్వం, సెప్టెంబర్ నెలలో 18.39 లక్షల కేసులు లిక్కర్, 5.82 లక్షల కేసుల బీర్ అమ్మింది. దీంతో ఇటు ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. మరి ఈ లెక్కలు చూసిన ఎవరైనా దీన్ని మద్యపాన నిషేధం అంటారా ? ఈ నెల అంటే, అక్టోబర్ నెలలో కూడా ఇప్పటికే భారీగా అమ్మకాలు జరిగాయని, పండుగ సీజన్ కావటంతో, ఈ సారి సేల్స్ సెప్టెంబర్ కంటే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు, ఈ నిర్ణయాన్ని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

అమరావతి.. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించిన వేళ, రాష్ట్రమే కాదు, దేశం కూడా పులకించింది. రాష్ట్రం నలు మూలాల నుంచి, ఇది మన రాజధాని అంటూ, ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు తెచ్చి, అమరావతికి మద్దతు తెలిపారు 13 జిల్లాల ప్రజలు. కానీ రాను రాను, వారిలో విష భీజాలు నాటారు కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు. ఇది చివరకు అమరావతి అంటే ద్వేషంగా, అమరావతి ప్రజలని, మహిళలను, రైతులను అవమాన పరిచే స్థాయి వరకు వెళ్ళిపోయింది. ముందుగా ఈ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే పనిలో పడింది. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేసింది. తరువాత శాసన రాజధాని అని చెప్పింది. కొంత మంది మంత్రులు, అసలు అది శాసన రాజధానిగా కూడా ఉండటానికి వీలు లేదని తేల్చి చెప్పారు. ఇలా అమరావతి పై కక్ష కొనసాగుతున్న వేళ, ఈ రోజు అమరావతి ప్రజలకు మరో షాకింగ్ వార్త వినాల్సి వచ్చింది. ఇది నిజానికి అమరావతి వాసులకే కాదు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలకు కూడా షాకింగ్ వార్తే. రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అనంతపురం-అమరావతి ఎక్ష్ప్రెస్ వే. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తరువాత, రాయాలసీమ జిల్లాలకు దగ్గరగా, వేగంగా కనెక్టివిటీ ఉండాలనే లక్ష్యంతో, అప్పట్లో చంద్రబాబు ఈ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టారు. అయితే కేంద్రం 22 వేల కోట్ల ఖర్చులో, రాష్ట్రం సగం పెట్టుకోవాలని ప్రతిపాదన చేయటంతో, అప్పట్లో ప్రభుత్వం ఒప్పుకుంది. మొత్తంగా 394 కిమీ కొత్త రహదారి నిర్మించాలని అనుకున్నారు. మొత్తం డీపీఆర్ కూడా రెడీ అయ్యింది. కేంద్రం నిర్వహించే భారతమాల ప్రాజెక్ట్ లో దీన్ని చేర్చారు.

అయితే జగన్ మోహన్ రెడ్డి అమరావతిని మూడు ముక్కలు చేయటంతో, ఈ ప్రాజెక్ట్ పై కూడా ఆ ప్రభావం పడింది. ఎలాగు అమరావతి రాజధానిగా ఉండదు కాబట్టి, ఈ ప్రాజెక్ట్ లో ఖర్చు తగ్గించుకుంటే రాష్ట్ర వాటా కూడా తగ్గుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని కేవలం చిలకలూరిపేట వరుకే కుదించాలని, ఇలా చేస్తే 59 కిమీ రహదారి తగ్గి, 3,700 కోట్లు ఆడా అవుతాయని నిర్ణయం తీసుకుని, కేంద్రానికి చెప్పటంతో, కేంద్రం దీని ప్రకారమే తాజగా బులిటెన్ విడుదల చేసింది. దీంతో అందరూ షాక్ తిన్నారు. ముఖ్యంగా ఈ పరిణామంతో ఆటు రాయలసీమ ప్రజలకు, ఇటు గుంటూరు, కృష్ణా ప్రజలకు కూడా ఇబ్బంది అనే చెప్పాలి. రాయలసీమ ప్రజలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎక్కువ పని ఉంటుంది. ఇక్కడే రైల్, ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇక్కడకు అనుసాధనం చేయకుండా, కేవలం పేట దగ్గరే ఆపేస్తే, ఏమి ఉపయోగం ఉంటుందో మరి. ఇక పొతే ఇక్కడ తగ్గించిన ప్రభుత్వం, అనంతపురం నుంచి బెంగుళూరు కు ఈ రాజహదరి విస్తరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఇక్కడ రాజధానికి అనుసంధానం ఉండదు కాని, పక్క రాష్ట్ర రాజధానికి మాత్రం అనుసంధానం కావాలని చెప్పటం ఏమిటో మరి.

తిరుమల తిరుపతి దేవస్థానం తరుచూ వివాదాల్లోకి వెళ్తుంది. రెండు నెలల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులు అమ్మకానికి పెట్టటం పెను వివాదం అయ్యింది. భక్తులు ఇచ్చిన ఆస్తులు కొన్ని అమ్మకానికి పెట్టారని వార్తలు రావటంతో, పెద్ద ఎత్తున వివాదం జరిగింది. అయితే వివాదం దేశ స్థాయిలో జరగటంతో, తిరుమల తిరుపతి దేవస్థానం వెనక్కు తగ్గింది. అయితే ఇప్పుడైనా ఇలాంటి వివాదాలు జోలికి పోకుండా ఉంటారు అనుకుంటే, ఈ రోజు మరో వార్త ఉదయం నుంచి ప్రచారం జరుగుతుంది. ఇది దేశ స్థాయిలో కూడా చర్చకు దారి తీసింది. శ్రీవారికి ఉన్న డబ్బులు, బ్యాంకులలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్స్ లో పెట్టాలని నిర్ణయం తీసుకోవటంతో, మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం పై విమర్శలు వచ్చాయి. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ విషయాన్ని ఖండించారు. ప్రభుత్వం ఈ చర్య వెనక్కు తీసుకోక పొతే పెద్ద ఉద్యమం చేస్తామని తిరుపతిలో కూడా నిరసన చేయటం జరిగింది. ఈ విషయం పై ఉదయం నుంచి అలజడి రేగింది. హిందూ మతానికి ఒక ఆధ్యాత్మిక రాజధానిగా తిరుమల ఉన్న నేపధ్యంలో, ఇక్కడ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా, భక్తులు స్పందిస్తూ ఉంటారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయాలు అన్నీ వివాదస్పదం అవుతున్నాయి.

ఈ రోజు భక్తులు కానుకులుగా ఇచ్చే డబ్బులు, ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కాబట్టి, అక్కడ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేసే నిర్ణయం తీసుకోవటం, బ్యాంకులు కంటే, ప్రభుత్వం ఎక్కువ వడ్డీ ఇస్తుంది అంటూ సమర్ధించుకోవటం పై, ఉదయం నుంచి విమర్శలు వచ్చయి. దీని పై కోర్టులో కేసు వేయటంతో పాటుగా,అ ప్రజా ఉద్యమానికి కూడా సిద్ధం అయ్యారు. రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజా ఆగ్రహం గుర్తించిన ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం చేత పత్రికా ప్రకటన విడుదల చేపించింది. తాము ఈ నిర్ణయం అమలు పరచటం లేదని, ఎప్పటిలాగే ఇక నుంచి కూడా డిపాజిట్లు అన్నీ బ్యాంకుల్లోనే చేస్తామని ఆ ప్రకటనలో తెలిపారు. బండ్ల రూపంలో, ప్రభుత్వ సెక్యూరిటీల్లో డిపాజిట్ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. దీంతో రేపు చేపట్టే నిరసన కార్యక్రమాలు వాయిదా పడే అవకాసం ఉంది. మొత్తానికి భక్తుల ఆగ్రహంతో మరోసారి టిటిడి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకి జగన్ లేఖ రాసి, ప్రెస్ మీట్ పెట్టి దాన్ని బహిరంగ పరచటం పై అనైతిక చర్యతో పాటుగా, అది కోర్టుని దిక్కారించటం కూడా అవుతుందని పలువురు అభిప్రాయ పడుతూ తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను వివాదాల్లోకి లాగే జగన్ చర్యలను ఖండిస్తున్నారు. చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు రాసిన లేఖను మీడియా కు వదలటం పై, సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఖండించింది. రాజ్యంగ పదవుల్లో ఉన్న వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తే, ఎలా అంటూ, ఆ చర్యలను ఖండిస్తూ తీర్మానం చేసింది. ఇలాంటి చర్యలు న్యాయ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వారి పై ఒత్తిడి పెంచే అవకాసం ఉంటుందని అభిప్రాయ పడింది. ఇక ఏపి ప్రభుత్వం నిర్వహించిన ప్రెస్ మీట్, జగన్ రాసిన లేఖ బయట పెట్టటం పై, ఆల్ ఇండియా న్యాయమూర్తుల సంఘం కూడా ఖండించింది. న్యాయ వ్యవస్థను కించ పరిచే విధంగా, బలహీన పరిచే విధంగా జగన్ లేఖ రాసారంటూ అభిప్రాయ పడింది. రాజకీయ నాయకులు చేస్తున్న ఈ ఆరోపణలు అనుమానాస్పదంగా ఉన్నాయని కూడా పేర్కొంది. ఎన్సీఎల్టీ బార్ అసోసియేషన్ కూడా ఈ లేఖ పై అభ్యంతరం తెలుపుతూ తీర్మానం చేసింది. ఇలా వివాద సంఘాలు జగన్ లేఖ బహిర్గతం చేయటం పై అభ్యంతరం తెలిపాయి. అయితే ముందుగా తీర్మానం చేసిన ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ మాత్రం, ఆ లేఖ రాసిన తరువాత తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ భయపడి పోతున్నారు. ఇదే విషయం పై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాసారు.

తాము జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖను ఖండిస్తూ తీర్మానం చేసామని తమను కొంత మంది కాళ్ళు విరగ్గొడతామని బెదిరిస్తున్నారని, తమకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంటూ, శనివారం ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ చేసారు. ఢిల్లీ హైకోర్ట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ అయిన అభిజిత్ కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కు కూడా ఇదే రకమైన బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాము లండన్ నుంచి ఫోన్ చేసినట్టు, వాళ్ళు బెదిరించారని, ఆ ఫోన్ నెంబర్ కూడా పోలీసులకు ఇచ్చారు. అయితే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా చూస్తే, ఆ ఫోన్ కాల్ కడప జిల్లా నుంచి వచ్చినట్టు గుర్తించారు. 08565 కోడ్ తో, ఆ ఫోన్ కాల్ కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చినట్టు గుర్తించారు. అయితే ఫోన్ చేసింది ఎవరు, ఎందుకు చేసారు, ఎవరు చెప్తే చేసారు అనే దాని పై విచారణ కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి పోలీసుల బృందం, కడపకు వచ్చి విచారణ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఏకంగా సీనియర్ న్యాయవాదులను బెదిరించటం పై, ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారని, త్వరలోనే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read