కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చాలా రోజులు తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. గతంలో మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆవ భూములు స్కాం, ఇసుక, మద్యంలో జరుగుతున్న అక్రమాల పై మాట్లాడారు. ఇప్పుడు తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులను డీ కొట్టే అంశం పై, అమరావతి భూములు పై, జగన్ కేసులు పై తదితర అంశాల పై సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టి తన అభిప్రాయాలు వేల్లదిన్కాహారు. ముందుగా ఈ క-రో-నా సమయంలో కోర్టులు బౌతికంగా పని చేయటం లేదు కాబట్టి, ఇప్పుడు అంతా ఆన్లైన్ లోనే కేసులు నడుస్తున్నాయని, దీనికి కొనసాగింపుగా వర్చువల్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ తానూ చీఫ్ జస్టిస్ కు ఉత్తరం రాసినట్టు చెప్పారు. ప్రజా ప్రతినిధుల పై కేసులు విచారణ మొదలు కాబోతుంది కాబట్టి, ఈ అంశం పై ప్రతి విషయం ప్రజలకు తెలియాలని, ప్రజలే నిర్ణయం తీసుకుంటారని, అందుకే కోర్టులలో జరిగే విషయాలు లైవ్ టెలికాస్ట్ చేయాలని తాను చీఫ్ జస్టిస్ కి సూచించినట్టు ఉండవల్లి తెలిపారు. ఈ ప్రక్రియ ఇప్పటికీ విదేశాల్లో ఉందని, మనకు కూడా ఉంటె బాగుటుందని, తాను లేఖ రాసిన విషయాన్ని ఆయన మీడియాకు చెప్పారు. ఇక మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు జగన్ ప్రభుత్వం, కోర్టుల విషయం పై చేస్తున్న దా-డి విషయంలో కూడా ఉండవల్లి స్పందించారు.

జడ్జిల పై లేఖలు రాయటం కొత్త కాదని ఉండవల్లి అన్నారు. కానీ ఆ లేఖను ఇలా బహిర్గతం చేయటం తప్పు అని, దీని పైనే ఇప్పుడు చర్చ జరుగుతుందని అన్నారు. ఆ లేఖలో ఉన్న అంశాలు ప్రజల్లో చర్చ అవ్వాలని లేఖ మీడియాకు ఇవ్వటం తప్పా, ఒప్పా అనేది చర్చ అని అన్నారు. కేంద్రం తలుచుకుంటే, ఇలాంటివి కట్టడి చేయవచ్చని ఉండాల్లి చెప్పారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇలాగే కోర్టు తీర్పుల పై మొదట అసహనం వ్యక్తం చేస్తే, తరువాత తెలుసుకుని, చట్టాలకు లోబడి పాలన చేసారని, కోర్టులతో ఘ-ర్షణ పడలేదని, అలాగే రాజశేఖర్ రెడ్డికి కూడా అనేక వ్యతిరేక తీర్పులు వచ్చినా, పోరాడారే కానీ, ఘ-ర్షణ పడలేదని చెప్పారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ పై జరుగుతున్న చర్చ హుందాగా జరిగితే ఉపయోగం ఉంటుందని అన్నారు. న్యాయ వ్యవస్థకు, శాసనవ్యవస్థకు ఘ-ర్షణ మొదలైతే, రాష్ట్రము అల్ల-కల్లోలం అవుతుందని అన్నారు. కోర్టుల పరువు తీయాలనుకుంటే, కోర్టులకు ఏమి అవుతుందని ప్రశ్నించారు ? ఎక్కడైనా కోర్టులు ఇచ్చే తీర్పులు చట్టాలకు లోబడి ఉంటాయని అన్నారు. చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని, ప్రశ్నించకూడదు అంటే ఎలా అన్నారు. ఇక అమరావతి భూముల పై మాట్లాడుతూ, అక్కడ రాజధాని వస్తుందని తెలిసి, ఎవరైనా కొంటారు, జడ్జీలు కొంటే తప్పు ఏంటి ? జడ్జి కూతురు కొంటే తప్పు ఏంటి ? అక్కడే రాజధాని వస్తుందని ప్రచారం జరిగింది కొన్నారు, ఇప్పుడు రాజధాని లేదు అంటే కొంత మంది అమ్ముకోవటం లేదా ? అని ఉండవల్లి ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, కేంద్రానికి మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఒక విధంగా వాస్తవం అని కొన్ని సంఘటనలు చూస్తే అర్ధం అవుతుంది కూడా. కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ, ఎక్కువగా అప్పులు తీసుకునే వెసులుబాటు విషయంలో కానీ, ఇలా అనేక విషయాల్లో కేంద్రం సపోర్ట్ జగన్ కు ఉంటూ వస్తుందని ఆ పార్టీ చెప్పుకుంటూ వస్తుంది. అయితే కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్రం ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు పై సిబిఐ ఎంక్వయిరీ వేయాలని ఎంత మొత్తుకున్నా, సరైన ఆధారాలు ఏమి లేకపోవటంతో కేంద్రం ఒప్పుకోలేదు. అలాగే రాజధాని మార్పు విషయంలో కానీ, శాసనమండలి రద్దు విషయంలో కానీ, అన్నిటికంటే ముఖ్యమైన విభజన హామీలు, పోలవరం, స్పెషల్ స్టేటస్, ఇలా అనేక కీలకమైన విషయాల్లో మాత్రం కేంద్ర సహకారం లేదనే చెప్పాలి. ఇప్పుడు మరోసారి మరో కీలకమైన విషయం పై, కేంద్రం నో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిశా చట్టం బిల్లుని కేంద్రం వెనక్కు పంపించింది. గతంలో కూడా ఒకసారి కేంద్రం ఇలాగే బిల్లుని తిప్పి పంపించింది. సవరణలు చేసి మళ్ళీ పంపించగా, ఇప్పుడు రెండో సారి కూడా కేంద్రం ఆ బిల్లుని వెనక్కు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లు పై అనేక ప్రచారాలు చేసింది. రాజకీయంగా కూడా ఈ బిల్లును వాడుకుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లు ఇంకా పాస్ కూడా కాలేదు, ఇంకా చట్టం కూడా అవ్వలేదు.

దిశా చట్టం కింద కేసులు పెడుతున్నామని పోలీసులు చెప్తున్నారు, ఉ-రి శిక్ష కూడా పడిందని అంటున్నారు, తీరా చుస్తే ఈ బిల్లు అసలు ఆమోదమే పొందలేదని, ఇలాంటి బిల్లుతో ఆ చట్టాలు కింద ఎలా కేసులు పెడుతున్నారని, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఈ రోజు వచ్చిన వార్త, ఈ వాదనకు బలం చేకుర్చుంది. దిశా బిల్లులోని లోపాలను ఎత్తి చూపుతూ, కేంద్రం అభ్యంతరం తెలిపింది. వాటిని సరి చేసి, మళ్ళీ తమకు బిల్లు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారే చేసింది. దీంతో ఇప్పుడు ఈ బిల్లు సవరణలు చేసి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెట్టి కానీ కేంద్రానికి పంపించటానికి కుదరదు. ఈ బిల్లులో ఏపి విభాగానికి వర్తించేలా మాత్రమే, ఐపిసిలో కొత్త సెక్షన్లను ఏపి జోడించింది, బిల్లుగా మార్చింది. ఇందులో 21 రోజుల్లో శిక్షతో పాటుగా, ఉ-రి శిక్ష లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో, మండలిలో మాత్రమే ఆమోదం పొందింది. ఈ బిల్లుని కేంద్రం మాత్రం ఆమోదించలేదు. బిల్లులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని వెనక్కు తిరిగి పంపించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశం పై ఎలా స్పందిస్తుందో చూడాలి. పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఈ చట్టం, ఇంకా కేంద్రం ఆమోదించక పోవటం, రాజకీయంగా కూడా విమర్శలు ఎందుర్కునే సందర్భం అనే చెప్పాలి.

జగన్ మోహన్ రెడ్డి ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పైనే ఫిర్యాదు చేయటం వెనుక, ప్రజాప్రతినిధులు కేసులు ఏడాదిలో తెల్చాయలని, ఆ సుప్రీం కోర్టు న్యాయవాది ఇచ్చిన ఆదేశాల వల్లే, ఇదంతా అంటూ ప్రచారం జరుగుతున్న వేళ, అసలు ఈ కేసు వేసిన పిటీషనర్, సీనియర్ అడ్వకేట్, అలాగే బీజేపీ సీనియర్ నేత అశ్విని ఉపాధ్యాయ, జగన్ రాసిన లేఖ పై స్పందించారు. ఒక విధంగా చెప్పాలంటే విరుచుకు పడ్డారు. జగన్ రాసిన లేఖ, ప్రెస్ కాన్ఫరెన్స్ పై, అశ్విని ఉపాధ్యాయ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు. తానూ 2016లో సుప్రీం కోర్టులో ఒక పిటీషన్ వేసాను అని, ప్రజాప్రతినిధుల పై ఉన్న కేసులు ఏడాదిలోగా విచారణ జరగాలని, అలాగే వాళ్ళు దోషులు అని తేలితే, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలి అంటూ తాను వేసిన పిటీషన్ , జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ ముందుకు వచ్చిందని, ఆయన తగు ఆదేశాలు ఇచ్చారని తన లేఖలో తెలిపారు. దీని పై స్పెషల్ కోర్టులు పెట్టి, ఏడాదిలోగా విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, అలాగే ఒక వేళ దోషులు అని తేలితే ఏమి చేయాలి అనే విషయం పై ఇంకా నిర్ణయం తీసుకులేదని, అలాగే 2017లో వేసిన మరో పిటీషన్ లో, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షడు పై ఏదైనా కేసు ఉంటే, వారిని కూడా తప్పించాలని పిటీషన్ వేశానని, అది కూడా పెండింగ్ లో ఉంది అంటూ, చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో అశ్విని ఉపాధ్యాయ తెలిపారు. ముఖ్యంగా బ్లాక్ మనీ, మనీ లాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న రాజకీయ నాయకుల పై చర్యలు తీసుకోవాలని తన పోరాటం అని అన్నారు.

అయితే ఈ క్రమంలో తను సంపాదించిన వివరాలు, వివధ పబ్లిక్ డాకుమెంట్స్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డి పై, మనీ లాండరింగ్, బినామీ ఆస్తులు, అక్రమ ఆస్తులు ఉన్న కేసులు ఆయన పై పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఏడీఆర్ రిపోర్ట్ ప్రకారం జగన్ మోహన్ రెడ్డితో పాటు, ఆయన పార్టీ నేతల పై కూడా అనేక క్రిమినల్, అవినీతి ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇవి కనుక కోర్టు లో ప్రూవ్ అయితే, ఒకేసారి అయితే 10 ఏళ్ళు, విడి విడిగా అయితే 30 ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించే కేసులు అని చీఫ్ జస్టిస్ కు తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి రాసిన లేఖ, దాన్ని బయటకు విడుదల చేయటం చూస్తుంటే, సామాన్య ప్రజల్లో, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోగెట్టే విధంగా ఉందని అన్నారు. పైన చెప్పిన కేసులు పెండింగ్ లో ఉండగా, ఇలా చేస్తున్నారు అంటే, న్యాయస్థానాల పై ఒత్తిడి తేవటానికి అని తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇది బెంచ్ హంటింగ్ మాత్రమే కాదని, తన పై ఉన్న కేసులు విచారణ జరగకుండా చేసే కుట్ర అని అన్నారు. ఇదేదో చిన్న తప్పు కాదని, కావాలని కుట్ర పన్ని చేసిన విషయం అని, ఫుల్ బెంచ్ సమావేశం అయి, దీని పై తగు చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎవరైనా ఇలా చేయాలి అంటే, భయపడే విధంగా చేయాలని చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో తెలిపారు.

విజయవాడ వాసుల దశాబ్దాల కల కనకదుర్గమ్మ ఫ్లైఓవర్. రెండు ప్రధాన జాతీయ రహదారాలు విజయవాడ సిటీ మీదుగా వెళ్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్ళే హైవే, కనకదుర్గమ్మ గుడి దగ్గర మలుపు ఉండటం, చాలా తక్కువ స్పేస్ ఉండటంతో, నిత్యం ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు ఉంటూ ఉండేవి. అయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఫ్లై ఓవర్ కట్టటం కుదరదని తేల్చి చెప్పింది. అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, ఈ ఫ్లై ఓవర్ కోసం పోరాటాలు చేసింది. చంద్రబాబు కూడా ఈ ఫ్లై ఓవర్ కోసం చేసిన మహా ధర్నాలో పాల్గున్నారు. అప్పట్లో ఈ మహా ధర్నాను అడ్డుకోవటానికి, ఇప్పుడు వైసీపీలో ఉన్న మల్లాది విష్ణు, వెల్లంపల్లి, జోగి రమేష్ అడ్డుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం, ఇక్కడ ఫ్లై ఓవర్ కట్టాలని, మీరు కట్టలేక పొతే, మేము అధికారంలోకి వచ్చిన తరువాత కట్టి చూపిస్తాం అన్నారు. చెప్పినట్టే, అధికారంలోకి వచ్చిన తరువాత, 2015లో ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. గతంలో బుద్దా వెంకన్న ఈ ఉద్యమం నడిపితే, తరువాత ఎంపీ కేశినేని నాని ఈ ఫ్లై ఓవర్ కోసం కేంద్రంతో ఫాలోఅప్ అయ్యి, పనులు జరిగేలా చేసారు. అయితే నిధులు లేమి, కేంద్రం సహకరించపోవటం, డిజైన్ ల అప్రూవల్ లో జాప్యం, పుష్కరాలు, ఇలా అనేక సమస్యలతో, ఈ నిర్మాణం ఆలస్యం అయ్యింది. 2019 జూన్ నాటికి, అంటే చంద్రబాబు దిగిపోయే సమయానికి 85% నిర్మాణం పూర్తయ్యింది. అయితే తరువాత వచ్చిన వైసీపీకి, 15 శాతం పనులు పూర్తి చేయటానికి 17 నెలల సమయం పట్టింది. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ గత ప్రభుత్వం హయంలో జరిగిన కృషి పై వివరించారు. నితిన్ గడ్ఖరీ మాట్లాడుతూ, "విజయవాడ కనకదర్గ ఫ్లై ఓవర్ ఎంతో ముఖ్యమైనది. గతంలో నేను అక్కడకి వెళ్ళాను. ఆ ఫ్లై ఓవర్ నిర్మాణం దేశానికి ప్రైడ్. నాకు గుర్తుంది, గత ప్రభుత్వంలో ఇప్పటి గౌరవ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, గతంలో కేంద్ర పట్టనాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవారు. ఆయన సమక్షంలో నేను ఆ ప్రదేశానికి వెళ్లి చూసాను. నేను అప్పుడు కనకదుర్గమ్మ గుడికి వెళ్లి దర్శనం కూడా చేసుకున్నాను. నేను మొత్తం పరిశీలన చేశాను. ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు అర్ధం అయ్యాయి. అప్పుడు ఇక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణం జరగాలని, ఇది ఒక్కటే పరిష్కారం అని అర్ధం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ కోసం, విజయవాడ ఎంపీ కేశినేని నాని కృషి కూడా ఎంతో ఉంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ గ్రౌండ్ అవటానికి, ఎప్పటికప్పుడు నాతొ ఫాలో అప్ చేసే వారు. మొత్తానికి ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయింది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి కావటం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఫ్లై ఓవర్ విజయవాడ నగరానికి ఎంతో ఉపయోగం కానుంది. ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి చేసుకున్నందుకు, సహకరించిన అందరికీ ధన్యవాదలు అంటూ", గడ్ఖరీ చెప్పుకొచ్చారు. గడ్కరీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/tGu4O_GTrgo

Advertisements

Latest Articles

Most Read