తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో తిరుమల ప్రతిష్ట దెబ్బ తీస్తూ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి, అప్పట్లో తిరుమలని రాజకీయ వేదికగా వాడుకున్న రమణ దీక్షితులు, వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లేని పింక్ డైమండ్ ఉన్నట్టు, నెలమాళిగలు తవ్వినట్టు, శ్రీవారి నగలు చంద్రబాబు తన ఇంట్లో దాచుకునట్టు, శ్రీవారి హుండీలో డబ్బులు వేయకండి దోచేస్తున్నారు అంటూ గతంలో రమణదీక్షితులు, విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసారు. ఈ విషయం పై అప్పట్లో టిటిడి తీవ్రంగా పరిగణించి, రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి పై 200 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తిరుమల వ్యవహారం, స్వామి వారి ప్రతిష్ట కావటంతో, తీవ్రంగా స్పందించారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అప్పట్లో చేసిన ఆరోపణలు నిరూపించి, తాము చేసిన వ్యాఖ్యలు నిజం అని చెప్పాల్సింది పోయి, అవేమి చేయకుండా కూర్చుకున్నారు. ఇక మరో పక్క జగన్ బాబాయ్ చైర్మెన్ గా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం, విజయసాయి రెడ్డి, రమణ దీక్షితులు పై, గతంలో వేసిన పరువు నష్టం దావా పిటీషన్ వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు, ఈ రోజు ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. పాలకమండలిలో ఇప్పటికే ఈ విషయం పై తీర్మానం కూడా చేసాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఈ పిటీషన్ కోసం, 2 కోట్లు కోర్టులో డిపాజిట్ చేసారు. ఇప్పుడు పిటీషన్ వెనక్కు తీసుకుంటే, ఈ 2 కోట్లు టిటిడి కోల్పోవాల్సి ఉంటుంది. నిజాలు తేల్చకుండా, టిటిడి ఇలా చేయటం పై, పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు. శ్రీవారి హుండీలు డబ్బులు వేయవద్దు, శ్రీవారి నగలు ఎవరో ఇంట్లో ఉన్నాయి అంటూ చేసిన వారిని, వదిలి పెట్టటం పై అభ్యంతరం తెలుపుతున్నారు.

ఈ విషయం పై, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ధర్మకర్తల మండలి అంటే కాపలాదారులు మాత్రమే అని, అది హోదా కాదని, భక్తులు ఇచ్చే డబ్బులని కాపాడాల్సిన బాధ్యత వీరి పై ఉందని అన్నారు. గతంలో టిటిడి మీద అసత్య ఆరోపణలు చేసారని, రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డి పై, పరువు నష్టం దావా వేసారని, 200 కోట్లకు పరువు నష్టం దావా వేసి, 2 కోట్లు కట్టారని, ఇప్పుడేమో ఈ ప్రభుత్వం ఆ పరువు నష్టం దావాను వెనక్కు తీసుకుందని, కట్టిన డబ్బు రెండు కోట్ల రూపాయాలు వదులుకోవటానికి కూడా సిద్ధం అయ్యారని, ఇప్పుడు వెనక్కు తీసుకున్నారని, ఈ డబ్బులు ఎవరు కడతారని అడిగారు. అందరూ కలిసి ఆ డబ్బులు, వడ్డీతో సహా జమ చేసి, మీ కేసులు వెనక్కు తీసుకోవాలని అన్నారు. రాజకీయ వేదికకు శ్రీవారితో ఆటలు వద్దని అన్నారు. శ్రీవారి హుండీలో డబ్బులు వేయవద్దు అని చెప్పిన రమణ దీక్షితులు, 40 ఏళ్ళు స్వామి వారి సేవ చేసి, పింక్ డైమెండ్ అంటూ, నెలమాళిగలు తవ్వేసారు అంటూ, ఆరోపణలు చేసారని, 40 ఏళ్ళు సేవ చేసారని, అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అలాంటి రమణ దీక్షితులకు, ఈ ప్రభుత్వం మళ్ళీ ఈ పదవి ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. రాజకీయ ఆరోపణలు చేయటానికి, ఈయన్ను అక్కడ పెట్టారా అని ప్రశ్నించారు.

ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, తెలకపల్లి రవి గారు అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పిన రఘురామ రాజు, ఒకప్పటి ప్రజాశక్తి ఎడిటర్ గా, ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిగా, చాలా టీవీ చానల్స్ లో కనిపిస్తారని, ఆయనంటే గౌరవం అని, అయితే తాను నిన్న రాత్రి, తన మాటలకు చెలించిపోయినట్టుగా ఒక వీడియో చూసి, నేను చాలా బాధపడ్డానని రఘురామ రాజు అన్నారు. తెలకపల్లి రవి గారు చాలా మంచి ఆయన అని, అందులో సందేహం లేదని, ఆయనకు భాష అంటే కూడా చాలా ఇష్టం అని, సాహితీ స్రవంతి అని భాషకు సంబంధించి కూడా ఒకటి మొదలు పెట్టారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాషని నిర్మూలించే కార్యక్రమం జరుగుతుంటే, సాహితీ స్రవంతి అధినేత , తమ ప్రభుత్వ విధానాన్ని ఎందుకు ఖండించలేదో తెలియదు, నేను అయితే చూడలేదని, ఆయన గొంతు ఎందుకో మూగబోయిందో అంటూ ప్రశ్నించారు. అయితే ఈ మధ్య తమ ముఖ్యమంత్రి గారి పని తీరు చూసి, ఈయనకు ప్రేమ ఎక్కువ అయినట్టు, ఆయన మాటల్లో తెలుస్తుందని అన్నారు. అయితే నిన్న నేను చెప్పింది, రేపు కోర్టు ధిక్కరణ రుజువు అయితే, రాజీనామా చేసే అవసరం రావచ్చు, అప్పుడు చాలా మంది నొచ్చుకుని, ఓదార్పు యాత్రకు రెడీ అవ్వాలని, ఎలా చేస్తారని తాను అంటే, రవి గారు దాని పై స్పందిస్తూ, ఎంతో బాధ పడ్డారని, ఆయన మొఖంలో ఆ బాధ కనిపించిందని అన్నారు.

అయితే ఇదే రవి గారికి, అమరావతి భూములు, రాజధానికి ఇచ్చి, ఇప్పుడు మూడు ముక్కలు చేస్తుంటే, రవి గారు ఎంత ప్రతిఘటించారో, ఎంత తల్లడిల్లారో కూడా తాను చూడలేదని రఘురామ రాజు అన్నారు. వంద మంది మనవోదేనతో పొతే, మీ కొలీగ్ అయిన సజ్జల, ఇప్పుడు ఎంతో పెద్ద వాడు అయిపోయాడు కానీ, గతంలో మీలాగే వార్తలు రాసుకునే వాడు అని, ఆయన అమరావతి రైతులని హేళన చేస్తుంటే, చావులను హేళన చేస్తుంటే, ఏమైపోయారు రవి గారు, మీ హృదయ వేదన ఏమైంది ? ఎందుకు మాట్లాడలేదు, మీ దయా హృదయం ఏమైంది అని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి అంటే మీకు ప్రేమ కాబట్టి బాధ కలిగి ఉండవచ్చు కానీ, రైతులను అవహేళన చేసినప్పుడు కూడా స్పందించి ఉంటే బాగుండేది అని అన్నారు. అయితే రఘురామ రాజు వ్యాఖ్యల పై , తెలకపల్లి రవి స్పందించారు. తనకు ముఖ్యమంత్రి అంటే ఏమి ప్రేమ లేదని, రఘురామ రాజు మాట్లడిన వ్యాఖ్యల పై అభ్యంతరం చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే తాను తెలుగు భాష పై, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై స్పందించానని, అలాగే అమరావతి రైతులకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం పై కూడా తాను స్పందించానని, తెలుసుకుని రఘరామరాజు స్పందించాలని అన్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజా, ఈ మధ్య సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి, చంద్రబాబుని, లోకేష్ ని తిట్టి వెళ్ళటం మినహా పెద్దగా ఆక్టివ్ గా ఉండటం లేదనే చెప్పాలి. ఇటీవల రోజుకి సొంత జిల్లాలో, సొంత పార్టీ నుంచే పోరు ఎక్కువ అయ్యింది. సొంత పార్టీ క్యాడర్ నుంచి కూడా బహిరంగంగా వ్యతిరేకత రావటం ఒకటి రెండు సందర్భాల్లో మీడియాలో కూడా వచ్చింది. ఇక మరో పక్క ఇద్దరు మంత్రులు నుంచి కూడా రోజాకు సహకారం లేదనే ప్రచారం ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే, జగన్ దగ్గర తనకు పలుకుబడి ఉందని, ఏదైనా అక్కడే తెల్చుకుంటా అంటూ, వ్యతిరేక వర్గానికి చెక్ పెడతాను అంటూ రోజా తన సన్నిహితుల దగ్గర చెప్తూ ఉంటారని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అధిష్టానం వైపు నుంచి కూడా రోజాకు షాక్ తగిలింది. దీనికి కారణం ఇటీవల ప్రకటించిన 56 బీసి కులాల కార్పొరేషన్ లు వాటి కూర్పు. రోజాకు తన నియోజకవర్గంలో, కే.శాంతి అనే వైసిపీ నేత నుంచి వ్యతిరేకత వస్తుంది. ఒకానొక సందర్భంలో బహిరంగంగా కూడా మాటలు అనుకునే స్థాయికి వచ్చారు. అయితే ఇప్పుడు శాంతి అనే ఆవిడకు ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించటం, రోజా వర్గానికి మింగుడు పడటం లేదు. ఇంకా ఇబ్బంది పెట్టే అంశం, ఈ చైర్మెన్ లు అందరికీ క్యాబినెట్ ర్యాంక్ ఉండటం. రోజాకు కూడా ఏపీఐఐఐసి చైర్మెన్ గా క్యాబినెట్ ర్యాంక్ ఉంటే, ఇప్పుడు తన వ్యతిరేక వర్గం అయిన శాంతికి కూడా క్యాబినెట్ ర్యాంక్ తో కూడిన పదవి రావటంతో, షాక్ తిన్నారు.

గతంలో శాంతి అనే వైసీపీ నాయకురాలు, నగరి మునిసిపల్ చైర్ పర్సన్ గా పని చేసారు. ఆమె భర్త కుమార్ కూడా, మునిసిపల్ చైర్పర్సన్ గా పని చేసారు. వీరికి నగిరి నియోజకవర్గం పై పట్టు ఉంది. అదీ కాక నియోజకవర్గం బీసిలు, ఎస్సీల డామినేషన్ ఎక్కువ. గతంలో వీరు, రోజాతో కలిసి పని చేసేయిన్ వారే. ఎలక్షన్ ప్రచారంలో, రోజా వీరి ఇంట్లో హాల్ట్ తీసుకునేంత చనువు కూడా ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత, ఇరు వర్గాలకు గ్యాప్ వచ్చింది. కారణాలు బయటకు తెలియకపోయినా, ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ట్ నడుస్తుంది. దీంతో ఇరు వైపులా, ఎవరి ఎత్తులు వారు వేస్తూ రాజకీయం చేస్తున్నారు. ఇక మరో పక్క వీరికి, జిల్లాలోని ఇద్దరు మంత్రులు నుంచి సపోర్ట్ ఉండటం, అలాగే ఇరువురు రోజాకి వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపధ్యంలో, మంత్రుల అండదండలతోనే, శాంతికి పదవి వచ్చిందని, రోజా వర్గం భావిస్తుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రోజా వ్యతిరేక వర్గం అయిన శాంతికి పదవి రావటం రోజాకు షాక్ అనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రోజా దూకుడుకు బ్రేక్ వేసే క్రమంలోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చేరే వారి కంటే, సస్పెండ్ చేసే వాళ్ళ లిస్టు ఎక్కువ అయిపొయింది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తరువాత, ఒక వర్గాన్ని చూసి మరీ దెబ్బ కొడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా గత అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారయణకు అనుకూలంగా ఉండేవారిని, రాష్ట్ర కమిటీలో ప్రాధన్యత ఇవ్వకపోవటంతో పాటుగా, వారిని టార్గెట్ చేసి పంపించేస్తున్నారు కూడా. సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ హవా నడుస్తుందనే భావన కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో బీజేపీ నాయకుడు లంకా దినకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సోము వీర్రాజు ఆదేశాలు ఇచ్చారు. ఈ నిర్ణయం అందరికీ షాక్ కలిగించింది కూడా. ఎందుకంటే లంకా దినకర్ మంచి సబ్జెక్ట్ తో, వాగ్ధాటితో టీవీ చానల్స్ లో, చర్చల్లో తమ పార్టీ వాణి వినిపిస్తూ ఉంటారు. నేషనల్ మీడియాలో కూడా ఆయన పార్టీ అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అయితే ఎప్పుడో జరిగిన దానికి, ఇప్పుడు దినకర్ ను సస్పెండ్ చేయటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై కొన్ని టీవీ చానల్స్ తో దినకర్ మాట్లాడారు. తన సస్పెన్షన్ ను వెనక్కు తీసుకుంటారనే నమ్మకం ఉందని దినకర్ తెలిపారు. నేను ఏ తప్పు చేయలేదని, ఈ విషయమే గతంలో పార్టీకు వివరణ కూడా ఇచ్చానని అన్నారు. తాజాగా బెంగుళూరులో పార్టీ వర్క్ షాప్ కి కూడా, ఏపి తరుపున రిప్రజెంట్ చేసానని గుర్తు చేసారు. బీజేపీ పార్టీ సిద్ధాంతంలు, రాష్ట్ర, దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే తాను చర్చల్లో పాల్గుంటానని, ఎప్పుడు తప్పు చేయలేదని అన్నారు. అయితే జూలై 26న ఒక ప్రాముఖ ఛానల్ డిబేట్ లో లంకా దినకర్ పాల్గున్నారు. అయితే అప్పటికే అమరావతి పై ఎలాంటి డిబేట్ లకు వెళ్ళవద్దని పార్టీ ఆదేశించింది.

అయితే సదరు ఛానల్ ముందుగా ఈ డిబేట్ నిమ్మగడ్డ విషయం పై అని చెప్పి, చివరి నిమిషంలో టాపిక్ మార్చారని, ఇదే విషయం తానూ రైజ్ చేస్తే, యాంకర్ క్షమాపణ చెప్పారని, ఇదే విషయాన్ని తాను ఆ రోజే అప్పటి అద్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణకు చెప్పిన విషయన్ని గుర్తు చేసారు. తాను రెండు నెలల నుంచి ఏ టీవీ ఛానల్ డిబేట్ లో పల్గునలేదని చెప్పారు. ఇటీవలే దినకర్ కు కరోనా సోకి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ పరిస్థితిలో, ఎప్పుడో జరిగిన దాన్ని, ఇప్పటికే వివరణ ఇచ్చిన విషయం పై, దినకర్ ను సస్పెండ్ చేయటం పై, పార్టీలో అతని పై కుట్ర జరిగిందని, కొంత మంది కావాలనే అతన్ని తప్పించేలా వార్తలు మోసారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది. ఇక నుంచి ఎవరైనా టీవీ చర్చలకు వెళ్ళాలి అంటే, ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలని సర్కులర్ విడుదల అయ్యిందని, సాయంత్రానికి రాత్రికి దినకర్ ను సస్పెండ్ చేసారని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం బీజేపీ అంతర్గత వ్యవహారం కావటంతో ఇతర పార్టీలు స్పందించలేదు. దినకర్ మాత్రం, తన సస్పెన్షన్ రద్దు చేస్తారని, తన వివరణ మళ్ళీ ఇస్తాననే ధీమాలో ఉన్నారు.

Advertisements

Latest Articles

Most Read