ఈ రోజు నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తన ఎంపీల చేత ఎలాంటి పోరాటం చెయ్యాలి అనే అంశం పై పార్టీ అధ్యక్ష్యుడు జగన్ తో, వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. అయితే ఈ సమావేశానికి రావాలని మొదట రఘురామకృష్ణం రాజు ని పిలిచిన ఏపి భవన్ అధికారులు, తరువాత రెండు గంటలకు మీరు రానవసరం లేదు అంటూ, రఘురామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చారు. అయితే ఈ విషయం పై అదే స్థాయిలో రియాక్ట్ అయిన రఘురామరాజు, మీడియా మందు చాకిరేవు పెట్టి, జరిగిన విషయం స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేసారు. ఈ అంశం పై రఘురామ రాజు మాట్లాడుతూ, "రాష్ట్రం కోసం మనం ఢిల్లీలో ఎలా పోరాడాలి, ఎందుకంటే రాష్ట్రం కోసం పోరాడే విషయంలో, పార్టీలకు అతీతంగా కలిసి పోరాడితేనే, ఢిల్లీలో విలువ ఉంటుంది. ఎలా పోరాడాలి అనే విషయంలో, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రతి ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు. ఎలా పోరాడాలి ఏమి పోరాడాలి అనేది చెప్తారు. స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా చెప్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమావేశంలో పాల్గునాలని నాకు, ఉదయం 9:10కి ఆంధ్రా భవన్ నుంచి ఒక అధికారి ఫోన్ చేసి, ఇలా ముఖ్యమంత్రి గారు, వీడియో కాన్ఫరెన్స్ లో , పార్లమెంట్ లో ఎలాంటి అంశాల పై పోరాడాలి అనే దాని పై దిశానిర్దేసం చేస్తారు, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మీరు పాల్గునాలి, తరువాత లంచ్ కూడా ఉంటుంది, మీరు లంచ్ చేసి వెళ్ళాలి అని చెప్పారు. "

"అయితే నేను సంతోషించాను. ఆంధ్రభవన్ కాబటి, అందరు ఎంపీలను పిలిచారేమో అనుకుంటే, కేవలం యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీలను మాత్రమే పిలిచారని అనుకున్నారు. అయితే మళ్ళీ ఏమైందో ఏమో, 11 గంటలకు మళ్ళీ అదే అధికారి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని రావద్దు అన్నారని, పై నుంచి కబురు వచ్చింది, మిమ్మల్ని రావద్దు అన్నారని చెప్పారు. అదేంటి నన్ను రమ్మన్నారు, భోజనం కూడా చేసి వెళ్ళమన్నారు, మళ్ళీ ఇప్పుడు రావద్దు అంటారు ఏంటి అని అడిగితే, లేదు అండి పై నుంచి వచ్చిన ఆర్డర్స్ అన్నారు. మరి మీ ద్రుష్టిలో నేను పార్టీలో లేనట్టా అని అడిగితే, లేనట్టే అనుకుంటా అండి అనే సమాధానం వచ్చింది. అయితే మొన్న ప్రజా సమస్యలు చెప్పినప్పుడు, షోకాజ్ నోటీస్ వచ్చింది. అలాగే ఇప్పుడు రఘురామరాజు పిలిచినా రాలేదు అంటారేమో, మళ్ళీ నోటీస్ ఇస్తారేమో అని భయం వేసి, స్పీకర్ గారికి జరిగిన విషయం చెప్పి, మీడియా ముందు కూడా సాక్ష్యం ఉంటుందని చెప్తున్నా. పిలిచారు రావద్దు అన్నారు, పార్టీలో మీరు లేరు అన్నారు. అంటే నన్ను బషిష్కరించారేమో అని అర్ధం అవుతుంది." అని రఘురామరాజు అన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, రాష్ట్రంలో ఏమి జరిగినా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఉంటారు. ఏది జరిగినా చివరకు చంద్రబాబుకు అంటిస్తూ ఉంటారు. ఎక్కడైనా అధికారంలో ఉన్న వాళ్ళు, తాము అధికారంలో ఉంటూ, ప్రజల కోసం ఏమి చేస్తుంది, ప్రజలకు ఉపయోగ పడే సమాచారం చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం తాము అధికారంలో ఉన్నాం అనే సంగతి కూడా మర్చిపోయి, ఆ ట్విట్టర్ ను కేవలం ఆరోపణలకే ఉపయోగిస్తూ ఉంటారు. చంద్రబాబు పలానా స్కాంలో అవినీతి చేసి, వేల కోట్లు దోచేసారని ట్వీట్ చేస్తారు. మరి అధికారంలో ఉంది మీరే కదా, ఆధారలు బయట పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చెయ్యండి అంటే మాట్లాడరు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా, అది చంద్రబాబు చేసారు, చేపించారు, దాని వెనుక చంద్రబాబు ఉన్నారు అంటారు. మరి అధికారం మీదే కదా, ఎందుకు అరెస్ట్ చెయ్యరు అంటే, మాట్లాడరు బురద చల్లటం, వాళ్ళే కడుక్కుంటారులే అని వెళ్ళిపోవటం. అయితే ఈ మధ్య పోలీసులు, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏమైనా ఆరోపణలు చేస్తే, ఆధారాలు చెప్పండి, అంటూ నోటీసులు ఇస్తూ , లేఖలు రాస్తున్నారు.

సహజంగా ప్రతిపక్షంలో ఉన్నవారు, అధికార పక్షం చేస్తున్న పనుల పై ఆరోపణలు చేస్తూ ఉంటారు. అదే నిజమో కాదో చెప్పాల్సిన బాధ్యత అధికారులది. మన్నా మధ్య ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే, ఆధారాలు ఇవ్వండి అంటూ డీజీపీ , చంద్రబాబుకి లేఖ రాసారు. ఆరోపణలు ఉండేది పోలీసుల మీద అయితే, వీరికి ఆధారాలు ఎలా ఇస్తారు ? అది నిజమో కాదో చెప్పాల్సిన అవసరం పోలీసులకు ఉంది. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి, గత వారం రోజులుగా పదే పదే, అంతర్వేది రధం తగలబెట్టించింది చంద్రబాబు అంటూ, ట్వీట్లు చేస్తూ, ప్రకటనలు ఇస్తున్నారు. ఒక పక్క పోలీసులకు ఎవరు చేసారో తెలియటం లేదు, మరో పక్క ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది, విజయసాయి రెడ్డి మాత్రం పదే పదే చంద్రబాబు పేరు చెప్తున్నప్పుడు, డీజీపీ గారు విజయసాయి రెడ్డి గారికి నోటీసులు పంపించి, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తెలిస్తే, అది నిజం అయితే చంద్రబాబు మీద చర్యలు తీసుకోవచ్చు కదా ? లేదు అనుకుంటే ఇలాంటి మతపరమైన సున్నిత అంశాల పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కనీసం వార్నింగ్ అయినా ఇవ్వాలి.

రాజధాని అమరావతి ప్రాంతంలో, తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి పై సొంత పార్టీ నేత ఆరోపణలు చేస్తూ, ఒక సేల్ఫీ వీడియో విడుదల చేయటం సంచలంగా మారింది. గత మూడు నాలుగు రోజులుగా, ఇదే అంశం పై సోషల్ మీడియాలో కధనాలు వస్తున్నా, అవి ఎలాంటి వార్తలో అని ఎవరూ నమ్మలేదు. అయితే ఈ రోజు వైసీపీ నేత మేకల రవి, తన ఆవేదన చెప్తూ, సేల్ఫీ వీడియో విడుదల చేసారు. తన వద్ద ఎమ్మెల్యే, రూ.1.40 కోట్లు తీసుకున్నారని, 40 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చారని, మిగతా 80 లక్షలు అడుగుంటే, డీసీఎంఎస్ డైరెక్టర్ పదవి తీసుకున్నావ్ కదా, దానికి సరిపోయింది అంటూ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, డబ్బులు అడుగుంటే, పోలీసులుకు చెప్పి అరెస్ట్ చేపిస్తాను అంటూ, బెదిరిస్తున్నారని, ఈ విషయం పై జగన్ మోహన్ రెడ్డి గారు కలుగు చేసుకుని తనకు న్యాయం చెయ్యాలి అంటూ, మేకల రవి తన అవేదన వ్యకం చేసారు. అయితే ఈ సేల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు, మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచారం అవుతుంది. అయితే దీని పై ఇప్పటి వరకు ఎమ్మెల్యే శ్రీదేవి గారు స్పందించ లేదు.

దక్షిణాదిన బీజేపీ పార్టీ ఎంత పాగా వెయ్యాలని చూసినా, వాళ్ళ వల్ల కావటం లేదు. కర్ణాటక మినహా, మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి నిలిపుకోవటానికి ప్రయత్నం చెయ్యటంతోనే సరిపోతుంది. తమిళనాడులో బీజేపీ అడ్రస్ లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో అక్కడ బీజేపీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా వచ్చే అవకాసం లేదు . ఇక కేరళలో కమ్యూనిస్ట్ ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. అక్కడా బీజేపీ గెలిచే అవకాశమే లేదు. ఇక ఒరిస్సా, తెలంగాణాలో ఏదో చెప్పుకో తగ్గ బలం ఉన్నా, అదీ నామమాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్ లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సోము వీర్రాజును అధ్యక్షుడిని చెయ్యటంలోనే, ఏపిలో బీజేపీకి పెద్దగా ఆశలు లేవని అర్ధం అవుతుంది. అయితే జనసేన పార్టీతో కలవటంతో, బీజేపీ-జనసేన కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటూ, సోము వీర్రాజు ప్రతి రోజు హడావిడి చేస్తున్నారు. అయితే తెలంగాణాలో మాత్రం బీజేపీ ఈ సారి గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కేసీఆర్ మీద వస్తున్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. తద్వారా, ఈ సారి కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకుని, కేసీఆర్ ని దెబ్బ కొట్టాలని, ఇంకా కుదిరితే అధికారంలోకి కూడా వచ్చేయటానికి ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో భాగంగా, ముందుగా త్వరలోనే జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని, గత 7 ఏళ్ళుగా టీఆర్ఎస్ ఇక్కడ ఏమి చెయ్యలేదని, అందుకే జీహెచ్ఏంసి ఎన్నికలు టార్గెట్ చేసి, ఇక్కడ మంచి ఫలితాలు రాబిడితే, తరువాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలపడవచ్చు అనేది బీజేపీ ఆలోచన. జీహెచ్ఎంసిలో మంచి ఫలితాలు వస్తే, అది తెలంగాణాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభావం చూపిస్తుందని బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే, జీహెచ్ఎంసి పరిధిలో ఆంధ్రా ప్రాంతం వారు గణనీయంగా ఉన్నారు. అందుకే సర్వ శక్తులు ఒడ్డి అయినా, జీహెచ్ఏంసి ఎన్నికల్లో తమ ప్రభావం చూపించాలని బీజేపీ భావిస్తుంది. అయితే, ఇదంతా బాగానే ఉన్నా, ప్లాన్లు అన్నీ వర్క్ అవుట్ అవుతాయా ? ప్రజలు నిజంగానే బీజేపీని ఆదరిస్తారా ? తెలంగాణా సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బీజేపీని ఎందుకు ఆదరిస్తారు ? విభజన హామీలు దగ్గర నుంచి అమరావతి దాకా, అన్ని విషయాల్లో బీజేపీ అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. ఈ భావన నేను పోగొడతా, అధికారంలోకి తెస్తా అంటున్న సోము వీర్రాజు గారి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read