ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం రూపు మారుతుంది. గతంలో అభివృద్ధి, సంక్షేమం, లాంటి వాటి మీదే ఎన్నికలు జరిగేవి. 2019లో బీహార్ నుంచి దిగుమతి చేసుకున్న వ్యక్తి వల్ల , ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడు లేనంతగా, కులాల వారీగా చీలిపోయింది. ఒక కులం అంటే మరొక కులానికి ద్వేషం పుట్టించేలా రాజకీయం చేసి, సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కులం పక్కన పెట్టి, మతం వైపు ప్రజలను మళ్లించే ప్రయత్నాలు మొదలయ్యాయా అనే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనా ఇవ్వన్నీ చూస్తున్న అభివృద్ధిని కాంక్షించే వారికి, రాష్ట్రం పట్ల ప్రేమ ఉన్న వారికి మాత్రం, విచారం కలిగించే అంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 16 నెలలుగా, హిందూ మతాన్ని టార్గెట్ చేస్తూ, కొన్ని పనులు జరిగాయి అని, దీనికి వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అనేది బీజేపీ, జనసేన ఆరోపణ. మత మార్పిడులు ఎక్కువ అయ్యాయని, దేవాదాయ శాఖ నిధులు మళ్ళిస్తున్నారని, దేవాదాయ భూములు అమ్ముతున్నారని, కావాలని గుళ్లని టార్గెట్ చేస్తున్నారని, ఇలా అనేక ఆరోపణలు వస్తూ వచ్చాయి. అలాగే పాస్టర్లకు జీతాలు ఇవ్వటం పై కూడా బీజేపీ అభ్యంతరం చెప్పింది. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, అంతర్వేది రధం దగ్ధం కావటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. 62 ఏళ్ళ నాటి రధం దగ్ధం కావటంతో, సహజంగానే హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయి.

అలాగే గతంలో నెల్లూరులోని బిట్రగుంటలో జరిగిన రధం దగ్ధం కూడా. అయతే ప్రభుత్వం, ఈ ఘటనలు వెనకాల ఎవరు ఉన్నది ? ఎవరు చేసింది తేల్చలేకపోయింది. పోలీసుల పైన ఈ విషయంలో విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ ఎంటర్ అయ్యింది. అంతర్వేది ఘటన పై గొడవ గొడవ చేసింది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ అంటూ కొంత మంది కుర్రకారు వచ్చి ఆందోళన చేసారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. సరిగ్గా ఇక్కడే ప్రభుత్వానికి మంచి అవకాసం దక్కినట్టు అయ్యింది. విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవటం, పోలీసులు ఏమి తేల్చలేదు అనే విమర్శలు వస్తున్న టైంలో, ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం పట్టుకోలేకపోయింది అనే విమర్శ రాదు. బీజేపీ గట్టిగా అడగటానికి ఉండదు. బాల్ ఇప్పుడు సిబిఐ కోర్టులో ఉంది. ఏదైనా సిబిఐ తేల్చాలి. ఒక్క దెబ్బతో, బాల్ బీజేపీ కోర్టులోకి నెట్టిన జగన్, ఈ విషయంలో బీజేపీ మరోసారి విమర్శలు చెయ్యకుండా చెక్ పెట్టారు. మరి బీజేపీ నేతలు, కేంద్రంతో మాట్లాడి, ఈ అంశం పై సిబిఐ విచారణకు అంగీకరించేలా చేసి, విచారణ వేగవంతం అయ్యేలా చేసి, అసలు నిజం బయట పెట్టేలా కేంద్రం పై ఒత్తిడి తెస్తారో లేదో.

ఆయన పేరు అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ. బీజేపీ అధికార ప్రతినిధి అయినా, ఆయన ఎక్కువగా కోర్టుల్లోనే కనిపిస్తూ ఉంటారు. ఆయనకు పీఐఎల్ మ్యాన్ అని కూడా పేరు ఉంది. రాజకీయాలు కంటే, ఆయన ఎక్కువ కోర్తుల్లోనే గుడుపుతూ ఉంటారు. అయితే ఆయన గత వారం రోజులుగా, దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. దీని కారణం ఆయన సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆరోపణలు ఎదుర్కుంటూ, కేసులు ఉన్న ప్రజా ప్రతినిధుల కేసులు, ఏడాది లోపు విచారణ పూర్తవ్వాలి, అలాగే శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. అయితే, ఈ తీర్పు ఇప్పుడు అమలు కావటం లేదు అంటూ, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఈ కేసు పై, తమకు సహాయకారిగా ఉండాలి అంటూ, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయని అమికస్‌ క్యూరీగా సుప్రీం కోర్టు నియమించింది. సుప్రీం కోర్టు కోరినట్టు, ఆరోపణలు ఎదుర్కుంటున్న నేతల జాబితీ మొత్తం, సుప్రీం కోర్టు ముందు పెట్టారు. ఇక ఇది సుప్రీం కోర్టులో అంశం, కేంద్రం ఇచ్చే సమాధానం బట్టి, దీని పై సుప్రీం కోర్టు తమ ఆదేశాలు ఇస్తుంది.

అయితే అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ, వివిధ నాయకులు ఎదుర్కుంటున్న కేసులు వివరాలు ప్రస్తావిస్తూ, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి కేసుప్రస్తావిస్తూ, గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన లాలూ, జయలలిత, కేసులు తేలి శిక్ష పడతనానికి 20 ఏళ్ళకు పైగా పట్టిందని, ప్రస్తుతం కేసులు నడుస్తున్న జగన్ మోహన్ రెడ్డికి, అంత కాలం కాకుండా, వీలు అయినంత త్వరగా విచారణ జరిగి, ఏదో ఒకటి తేలాలని అన్నారు. అందరితో పాటుగా, జగన్ మోహన్ రెడ్డి పై ఉన్న కేసులు కూడా ఏడాది లోపు తేల్చేయాలని, తమ పోరాటం ఇదే అని అన్నారు. వివిధ హైకోర్టుల్లో, ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల వివరాలు కోర్టుకు సమర్పించాలని, ఇదే క్రమంలో సిబిఐ, ఈడీ కూడా సుప్రీం కోర్టు ఇవ్వాలని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అవినీతి బాగా పెరిగిపోయిందనే సమాచారం ఉందని, ఏపి ఎమ్మెల్యేలో 55 శాతం మంది నేరచరితులని సర్వే చెప్పిందని, స్యాండ్, ల్యాండ్, లిక్కర్, తదితర వాటిల్లో అనేక స్కాంలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని అన్నారు.

వైఎస్ వివేక హత్య కేసు, హైకోర్టు ద్వారా సిబిఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే గతంలో సిబిఐ కొన్ని రోజులు విచారణ చేసి, ఢిల్లీ వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ 40 రోజులు తరువాత, సిబిఐ ఢిల్లీ నుంచి పులివెందుల చేరుకొని, రెండో విడత విచారణ మొదలు పెట్టింది. జూలై నెలలోని మొదటి వారంలో, దాదపుగా 15 రోజులు పాటు, కడపలో, అలాగే పులివెందులలో కూడా చాలా మందిని సిబిఐ విచారించింది. గతంలో సిట్ చేసిన విచారణ వివరాలు మొత్తం సిబిఐ తీసుకుని, చాలా మంది సాక్ష్యులని, హత్య జరిగిన సమయంలో అక్కడ ఉన్న వారిని, ముందుగా ఘటనా స్థాలానికి వచ్చిన పోలీసులను, వివేక కూతురుని, ఇలా అనేక మందిని, దాదాపుగా 15 రోజులు పాటు సిబిఐ విచారణ జరిపింది. అయితే ఉన్నట్టు ఉండి సిబిఐ ఢిల్లీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చే వారం వస్తారని అందరూ భావించినా, సిబిఐ మళ్ళీ తిరిగి రాలేదు. నెల రోజులు గడుస్తున్నా సిబిఐ రాకపోవటంతో, విచారణ ఏమైందా అనే వ్యాఖ్యలు వస్తున్న వేళ, దాదాపుగా 40 రోజులు తరువాత మళ్ళీ సిబిఐ తిరిగి వచ్చింది.

ఢిల్లీ నుంచి నేరుగా పులివెందుల చేరుకున్న సిబిఐ బృందం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ లో బస చేసారు. విచారణ జరిగిన తీరు, తరువాత ఎవరిని విచారించాలి, విచారణ తీరు ఎలా సాగాలి అనే దాని పై చర్చించారు. ఈ సారి విచారణలో, రాజకీయ ప్రముఖులని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీ ప్రముఖులు, కొంత మంది ప్రజా ప్రతినిధుల పేర్లు వినపడుతున్న సమయంలో, వారిని ఈ సారి విచారణకు పిలిచే అవకాసం ఉంది. మరి ఈ సారి విడతలో విచారణ పూర్తి చేస్తారా ? లేదా విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది ? ఇప్పటికే సిబిఐ ఒక అంచనాకు వచ్చిందా ? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇంకా సస్పెన్స్ లోనే ఉన్నాయి. కేసు విచారణ, హైకోర్టు ద్వారా, సిబిఐకి రావటంతో, సిబిఐ విచారణ మొత్తం, హైకోర్టుకే ఇచ్చే అవకాసం ఉంది. ఎప్పటికి విచారణ పూర్తి అవుతుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ సిఐడి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక యూట్యూబ్ ఛానల్ పై సిఐడి అధికారులు ప్రవర్తించిన తీరు విషయంలో, హైకోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. మీరు ఉన్నది ప్రజల రక్షణ కోసం కానీ, అధికార పార్టీ మెప్పు పొందటానికి కాదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలుగు వన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై, రెండు నెలల క్రిందట సిఐడి పోలీసులు హైదరాబాద్ వెళ్లి, అక్కడ సర్వర్ లు అన్నీ స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. అదే విధంగా తెలుగు వన్ అధినేత రవిశంకర్ పై కూడా కేసు నమోదు చేసారు. తన పై నమోదు అయిన కేసు విషయం పై రవి శంకర్ ఏపి హైకోర్టు లో క్వ్యాష్ పిటీషన్ వేసారు. తన పై వేసిన కేసు కొట్టేయాలని హైకోర్టుని కోరారు. ఈ విషయం పై సిఐడి పోలీసులను తప్పు పడుతూ, గత నెల 26న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాల పూర్తి కాపీ నిన్న బయటకు వచ్చింది. ఇందులో అనేక అంశాలు, కోర్టు సిఐడి పై చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. మనం ఉన్నది డెమోక్రసీ, కనీ మీ తీరు చూస్తుంటే ఖాకిస్టోక్రసీలో జీవిస్తున్నాం అనే భావన కలుగుతుంది అంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

ఖాకిస్టోక్రసీ అంటే, పోలీస్ రాజ్యం అనే విధంగా హైకోర్టు స్పందించింది. ఈ కేసు విషయంలో, కేసు నమోదు దగ్గర నుంచి, కంప్యూటర్లు, సర్వర్లు తీసుకురావటం, దర్యాప్తు తీరు, అన్నీ చూస్తుంటే సిఐడి పోలీసుల అత్యుత్సాహం కనపడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది అరాచకత్వానికి దారి తీసే విధంగా ఉందని, సరైన ఆధారాలు లేకుండా కేసు నమోదు చేసి, దర్యాప్తు పేరుతొ వేధించటం అన్యాయం అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యలకు బ్రేక్ వెయ్యకపోతే, ప్రజలకు జీవించే హక్కు కానీ, స్వేఛ్చ కానీ లేకుండా, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయని కోర్టు హెచ్చించింది. సిఐడి పోలీసులు అధికారాన్ దుర్వినియోగానికి పాల్పడ్డారని, పెట్టిన సెక్షన్లకు, చేస్తున్న అబియోగాలకు సంబంధం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. శాంతిభద్రతలు కాపాడటం సిఐడి ప్రాధమిక విధి అని కోర్టు గుర్తు చేసింది. అంతే కాకుండా కేసు కొట్టేసి, సిఐడి స్వాధీన పరుచుకున్న పరికరాలు అన్నీ తిరిగి వారికి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.

Advertisements

Latest Articles

Most Read