గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్ బస్ నియో-320 బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 13 విమానాల్లో ఒకదాన్ని విజయవాడకు కేటాయించింది. ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ విజయవాడ-హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో నడుపుతోంది.

భారీ ఎయిర్ బస్ ల్యాండ్ కాగానే ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్తో స్వాగతించారు. ప్రపంచ వ్యాప్తంగా "ఎయిర్ బస్ నియో- 320 ఎయిర్ క్రాఫ్ట్ కు మంచి డిమాండ్ ఉంది. కువైట్ దేశం నుంచి వీటిని ఎయిర్ ఇండియా అద్దెకు తీసుకుంది. ఈ విమానంలో మొత్తం 162 సీటు ఉంటాయి. 12 బిజినెస్ కాస్ సీటు ఉంటాయి.

నిరుద్యోగ యువతీ,యువకులకు చేయూత నివ్వాలన్న ఆలోచనతో ట్రేడ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈనెల 18న మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల ఛైర్మన బోయపాటి అప్పారావు తెలిపారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారే కాకుండా పలు రకాల డిగ్రీలు చేసిన అనేక మంది యువతీ,యువకులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారికి చేయూత నివ్వాలన్న ఆలోచనతో ట్రేడ్‌ హైదరాబాద్‌ వారి సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్రేడ్‌ హైదరాబాద్‌లో సుమారు 40 వేల కంపెనీలు రిజిస్టరై ఉన్నాయన్నారు. అందులో 30నుంచి 40 కంపెనీలు ఈనెల 18వ తేదీన నిర్వహిస్తున్న జాబ్‌ మేళాకు వస్తున్నాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు వారి వారి సర్టిఫికెట్లతో 18వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడలోని ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాలకు రావాలని తెలిపారు.

ఆయా కంపెనీలనుంచి వచ్చే ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూలో ప్రతిభకనబర్చినవారికి అదే రోజు సాయంత్రం నియామక పత్రాలు అందజేస్తారన్నారు. జాబ్‌ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బాలశౌరి, ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ సీఈవో వెంకట్‌ బొలెమాని, కళాశాల ప్లేస్‌మెంట్‌ డైరెక్టర్‌ టి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వివరాలకు, ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి, వివరాలు కనుక్కోవచ్చు, 7032897510, 9030179246, 7337556150 .

అభివృద్దిలో దూసుకుపోతున్న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి, మరో సరి కొత్త ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించనుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) మరియు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి పూర్తి అనుమతులు వచ్చాయి.

ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్సు సంస్థ, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నడపటానికి ముందుకు వచ్చింది. వచ్చే మే నెలలో గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి జూమ్‌ ఎయిర్‌లైన్స్, ముంబై నగరంతో పాటు జైపూర్‌కు విమాన సర్వీసులు నడపనుంది. విజయవాడ నుంచి దేశ రాజధాని న్యూఢి ల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాలకు వివిధ విమానయాన సంస్థలు ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి.

ఇప్పుడు, మహారాష్ట్ర ముఖ్యపట్టణం ముంబై, రాజస్థాన ముఖ్యపట్టణం జైపూర్‌లకు విమాన సర్వీసులు నడపటంతో, మరింత కనెక్టివిటీ పెరగనుంది. వ్యాపార వర్గాలకే కాక, విదేశాలకు వెళ్ళేవారికి, పర్యటకంగా వెళ్ళేవారికి కూడా, ఈ సర్వీసులు ఉపయోగపడతాయి.

పేదవారికి ఉచితంగా సీటీ స్కాన్ వంటి అధునాతన సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రులలో అందించటానికి చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, అందులో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ ప్రారంభించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పీపీపీ పద్దతిలో కోటీ ఇరవై ఐదు లక్షలతో ఏర్పాటు చేసిన 16 సైస్ సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేదవర్గాలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు సీటీ స్కాన్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ కాలేజీ ఆసుపత్రిలలో సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారని, త్వరలోనే వీటిని రాష్ట్రంలో అన్ని కాలేజీ ఆసుపత్రులలో ప్రారంభిస్తామని తెలిపారు.

గుండెకి సంబంధించి పరీక్షలు తప్ప అన్ని పరీక్షలు దీని ద్వారా అందిస్తామని తెలిపారు. సీటీ స్కాన్ను బయట డయాగ్నస్టిక్స్ సెంటర్లో చేయించుకుంటే రెండున్నర వేల వరకు అవుతుందని, అదే ఇక్కడ పేద రోగులకు ఉచితంగా అందించటానికి దీనిని ఏర్పాటు చేసామని తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన బయోమెట్రిక్ విధానం వల్ల డాక్టర్స్ హాజరు శాతం పెరగటంతో ఓపీ రేటు పెరగటానికి ఉపయోగపడిందన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు 300 నుంచి 2500 మంది ఓపీ రేటు పెరిగిందని, ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పారు. అదే విశాఖలో నాలుగు వేల మంది ఓపీకి ప్రతిరోజు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా తీసుకుంటున్న మెరుగైన చర్యలు వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలలో అవుట్ పేషెంట్ రేషియో 28 శాతానికి పెరిగిందని తెలిపారు. డెలివరీల శాతం 12 శాతం పెరిగాయని చెప్పారు.

ఇలా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించటం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిందని ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు వారు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. ఇంకా పేదవారికి పూర్తిగా అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావటానికి కృషి చేస్తామన్నారు. గర్భిణులకు డెలివరీ అనంతరం వెయ్యి రూపాయల చెక్ తో పాటు మదర్ కిట్ తో పాటు తల్లీ,బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా సేస్టీగా ఇంటికి వెహికిల్ ఇచ్చి పంపిస్తున్నామన్నారు.

సిటీ స్కాన్ ప్రారంభ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్రావు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జగన్మోహన్రావు, సీటీ స్కాన్ యంత్రాన్ని పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేసిన రేడియాలజిస్ట్ రమణ కుమార్,ఆర్ఎంవోలు ప్రభుత్వ వైద్యులు,నర్సులు ప్రభుత్వ సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.

విజయవాడలో జాతీయ రహదారిపై బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌కు సరికొత్త డిజైన్ రూపుదిద్దుకుంటోంది. అత్యంత సుందరంగా కనిపించేలా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఫ్లై ఓవర్‌ నిర్మాణం జరగనుంది. నిర్మాణానికి వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దేశంలోనే రెండో సుందర పైవంతెనగా దీన్ని నిర్మించాలని ఆదేశించారు. మంగళవారం డిజైన్లను సీఎం పరిశీలించారు, ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషనను వీక్షించారు.. గతంలో రూపొందించిన డిజైన్లను సీఎం తిరస్కరించారు. ప్రస్తుతం డిజైన్ల ప్రకారం ఫ్లై-ఓవర్ 1.40 కిలోమీటర్ల దూరం నిర్మాణం చేయనున్నారు.

ఫ్లై-ఓవర్ రెండు భాగాలుగా ఉంటుంది. జ్యోతిమహల్‌ నుంచి విశాఖ వైపు వాహనాలు వెళ్లేందుకు ఒక వంతెన, ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌ నుంచి చెన్నై వైపు వెళ్లేందుకు ఒక వంతెన రెండు భాగాలుగా ఉంటాయి. మూడు వరసలతో ఇవి ఉంటాయి. మధ్యలో పచ్చదనం పెంచుతారు. ఫ్లై-ఓవర్ కింద కూడా గ్రీనరీ ఉంటుంది. ఈ నిర్మాణంతో బెంజి సర్కిల్‌ యథావిధిగా ఉంటుంది. దాని స్వరూపం మారదు.

బందరు రోడ్డు నాలుగు వరసల జాతీయ రహదారి విస్తరణ, బెంజి సర్కిల్‌ పైవంతెన కలిపి ఒకప్యాకేజీగా టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. దీనికి మొత్తం దాదాపు రూ.1462కోట్లు అంచనా వ్యయం. దీనిలో 64.6కిలోమీటర్ల బందరు రోడ్డుకు రూ.740.70కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ప్యాకేజీలో నాలుగు మేజర్‌ , అయిదు చిన్న , అయిదు పాదచారుల వంతెనలు నిర్మించనున్నారు. మిగిలిన వ్యయం బెంజిసర్కిల్‌ పైవంతెనకు వెచ్చించాల్సి ఉంద.

ఫ్లై ఓవర్‌ నూతన డిజైన్లకు సంబంధించి వీడియో ఎఫెక్ట్స్‌ ప్రజంటేషన్ ఈ క్రింది వీడియోలో చూడవచ్చు...

More Articles ...

Advertisements

Latest Articles

Most Read