కనకదుర్గ గుడి టోల్‌ గేటు నుంచి కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఉన్న రోడ్డుకు నేషనల్ హైవే అథారిటీ మరమ్మతులు చేపట్టనున్న సందర్భంగా నెల రోజుల పాటు ఈ మార్గాన్ని మూసివేశారు. దీంతో ఈ మార్గంలో 30రో జుల పాటు ఎలాంటి వాహనాల రాకపోకలకు ఇటు వైపు నుంచి అనుమతించరు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లిస్తూ పోలీసులు చర్యలు చేపట్టారు.

బుధవారం అర్ధరాత్రి నుంచి నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల నగర ప్రజలు, వాహనచోదకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీస్ శాఖ సూచించింది.

విద్యాధరపురం, ఇబ్రహింపట్నం వైపు వెళ్లే వాహనాలు బీఆర్పీ రోడ్డు, వీజీ చౌక్‌, చిట్టినగర్‌ నుంచి సొరంగం మార్గం ద్వారా వెళ్లాలి. వయా ఎర్రకట్ట, సొరంగ మార్గంలోనూ ప్రయాణించవచ్చు వైవీరావు ఎస్టేట్‌, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, సితారా జంక్షన నుంచి రాకపోకలు సాగించవచ్చు. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి వైపు నుంచి విజయవాడకు వచ్చే వాహనాలు గొల్లపూడి సెంటర్‌, సితారా జంక్షన, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, మిల్క్‌ ఫ్యాక్టరీ, చిట్టినగర్‌, వీజీ చౌక్‌, పంజా సెంటర్‌, రైల్వే దక్షిణ బుకింగ్‌ రోడ్డు, లోబ్రిడ్జి మార్గంలో రావాలి. గొల్లపూడి సెంటర్‌, సితార జంక్షన, సీవీఆర్‌ ఫ్లైఓవర్‌, వైవీరావు ఎస్టేట్‌, పైపుల రోడ్డు, సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌, బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రాకపోకలు సాగించవచ్చు.

గన్నవరం మండలం కేసరపల్లి వద్ద హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుకు అవసరమైన భూమి లభ్యత పై ప్రతిపాధనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టరు బాబు.ఎ. రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ఏర్పాటుపై కంపెనీ ప్రతినిధులు, ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా, రెవిన్యూ అధికారులతో బుధవారం ఎయిర్ పోర్టు లాంజిలో జిల్లా కలెక్టరు బాబు.ఎ. ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐటి సూట్ గా తీర్చిదిద్దేందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఇందులో ఎపిఐఐసికి చెందిన కేసరపల్లిలోని భూములను హెచ్.సి.ల్(HCL) ప్రోజెక్టుకు చెందిన కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టరు పరిశీలించారు.

<div style="text-align: center;">

</div>

ఎయిర్ పోర్టు పరిశర ప్రాంతాల్లో నిర్మించే భవనాలకు ఎయిర్పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియూ వారి అనుమతి తప్పనిసరిగా కావడంతో దీనిపై ఎయిపోర్టు అధికారులతో కలెక్టరు చర్చించారు.

పరిశీలనలో జిల్లా కలెక్టరు తో పాటు హెచ్.సి.ఎల్(HCL) ప్రోజెక్టు కంపెనీ ప్రతినిధులు, జిల్లా రెవిన్యూ అధికారి సిహెచ్.రంగయ్య, గన్నవరం తాహసిల్టారు మాధురి, ఎపిఐఐసి అధికారులు తదితరురు ఉన్నారు.

రేపటి నుంచి గన్నవరం-కాశీ మధ్య బోయింగ్‌ సర్వీస్ మొదలుకానుంది. 189 మంది ప్రయాణికులు పట్టే భారీ బోయింగ్‌ 737- 800, విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు, ఎయిర్‌బస్‌ - 320 లాంటి పెద్ద విమానలనే చుసిన గన్నవరం ఎయిర్‌పోర్టు, ఇప్పుడు బోయింగ్‌ 737- 800 లాంటి భారీ విమానాన్ని చూడనుంది. గన్నవరం విమానాశ్రయం చరిత్రలోనే ఇంత పెద్ద భారీ విమానం నడవటం ఇదే మొదటిసారి. గన్నవరం నుంచి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన కాశీకి నేరుగా ప్రత్యేక విమానం అందుబాటులోకి తీసుకురానుంది స్పైస్ జెట్.

ఈ ఫ్లైట్ సర్వీస్ రేపటి నుంచి (ఫిబ్రవరి 19) నుంచి, మధ్యాహ్నం 2.40కి గన్నవరం నుంచి బయలుదేరి, సాయంత్రం 6.50కి వారణాశి చేరుకుంటుంది. తిరిగి మర్నాడు ఉదయం 10 గంటలకు వారణాశిలో బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.

కేవలం 4 గంటల 15 నిమిషాల్లో కాశీకి చేరుకునేలా భారీ విమానాన్ని ఇందుకోసం సిద్ధం చేస్తున్నారు.

ఇప్పటివరకూ వారణాసికి విమానంలో వెళ్లాలంటే ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులో ఢిల్లీకి చేరుకుని ఆక్కడి నుంచి మరోటి మారాల్చి వస్తోంది. రైలు, రోడ్డు మార్గంలో వెళ్లేందుకు 30 గంటల పైనే పడుతోంది. నేరుగా విమాన సర్వీసు అందుబాటులోనికి రావడం వల్ల నాలుగు గంటల్లోనే కాశీకి చేరుకునేందుకు వీలుంటుంది.

ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌.. విజయవాడ నగరంలో ఎలక్ర్టానిక్‌ పరికరాల వ్యాపారానికి కేంద్రం.... కాని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో త్వరలో "హార్డ్ వేర్ బజార్"ను ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. నగరంలోని ఆటోనగర్లో జరిగిన 8 ఐటీ కంపెనీల ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయం తెలిపారు.

సర్కిల్-2 పరిధిలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్సులో అదనంగా పై అంతస్తు నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. రూ. 9కోట్ల 90లక్షల వ్యయంతో నిర్మిస్తున్న అదనపు అంతస్తులో దాదాపు 128 షాపులు నిర్మిస్తున్నారు. ఇందులోనే "హార్డ్ వేర్ బజార్"ను ఏర్పాటు చేయనున్నారు. 2017 జూన్ నెలలో ఈ హార్డ్ వేర్ బజార్ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు.

హార్డ్ వేర్ రంగానికి సంబంధించిన ఏ చిన్న వస్తువయినా ఇక్కడ లబిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. హార్డ్ వేర్ రంగానికి సంబంధించి చిన్న చిప్ దగ్గరి నుంచి భారీ హార్డ్ వేర్ వస్తువులు ఇక్కడ లభించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం, ఎన్టీఆర్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో మొత్తం 119 షాపులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త ఐటి కంపెనీలు పలకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత, రాజధాని అమరావతి ప్రాంతానికి ఏ కంపెనీలు రావట్లేదు అనుకునేవారికి ఎట్టకేలకు కొంత ఉపసమనం.

మొదట విడతగా, విజయవాడలో ఫిబ్రవరి 16న ఎనిమిది ఐటి కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
విజయవాడ, ఆటోనగర్ ప్రాంతంలో, ఈ ఎనిమిది ఐటి కంపెనీలు ఫిబ్రవరి 16న ప్రారంభం అవుతాయి.

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT

అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.

ఎంతో కాలంగా, నిరుపయోగంగా ఉన్న గాన్నవరంలోని మేధా టవర్స్ కూడా త్వరలో జీవం పోసుకోనుంది. స్పెయిన్ కు చెందిన Grupo Antolin త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే HCL, Neslova Systems కూడా త్వరలో మేధా టవర్స్ నంచి పని చేయ్యనున్నాయి.

ఈ పరిశ్రమల రాకతో, రాజధాని ప్రాంతంలో ఐటి పరిశ్రమలకు పెద్ద ఊతమిచ్చినట్లు అవుతుంది. HCL లాంటి పెద్ద కంపెనీ రాజధానిలో కాలు మోపితే, దాని బాటలో మరి కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగం అంతగా ఉనికి చాటుకోలేదు. కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read