అమరావతి మెట్రోరైల్‌ టెండర్లను అధికారులు తెరిచారు. అమరావతి మెట్రో ప్రాజెక్టు కోసం మూడు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్‌ అండ్‌ టీ, ఆఫ్కాన్స్‌, సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రా కంపెనీలు టెండర్లను దాఖలు చేశాయి. 10 రోజుల్లో నిర్మాణ సంస్థను డీఎంఆర్‌సీ ఖరారు చేయనుంది.

రెండు కారిడార్ల కోసం బిడ్లు దాఖలు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి నిడమనూరు కారిడార్‌కు రూ.800 కోట్లు, ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి పెనమలూరు కారిడార్‌కు రూ.847 కోట్లకు టెండర్లు మూడు సంస్థలు దాఖలు చేశాయి. దీంతో పాటు నిడమానూరు దగ్గర పెద్ద కోచ డిపోను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ డిపోలోనే మెట్రో ట్రైన్లు ఉంటాయి. మెయింట్‌నెన్స కూడా ఇక్కడే జరుగుతుంది. వీటికి సంబంధించి మరమ్మతులు కూడా ఇక్కడే నిర్వహిస్తారు.

డయల్‌ 100... అత్యవసర పరిస్ధితుల్లో ఉన్నప్పుడు, సహాయం కోసం చేసే ఫోన్ నెంబర్... విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్టాండు దగ్గర ఉన్న, పోలీస్‌ కంట్రోల్‌ రూంకు ఈ నెంబర్ అనుసంధానం అయ్యి ఉంటుంది. ఎంతో మంది ఈ నెంబర్ కు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇది వరకు పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు మట్టికి విజయవాడ పోలిసులు మెరుపు వేగంతో స్పందిస్తూ, సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. పోలీసులు అతి తక్కువ సమయం, సగటున సమయం..6 నిమిషాల16 సెకన్లలో ఘటనాస్థలానికి చేరుతూ, అమెరికా పోలీసులని దాటి రికార్డు సృష్టిస్తూ, ప్రజలకు చేరువ అవుతున్నారు.

పోలీస్‌ కంట్రోల్‌రూం 100కు ఫోన్‌ చేయగానే పోలీసు సిబ్బంది దానికి స్వీకరిస్తారు. విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌రూంలో మూడు లైన్లు ఉన్నాయి. విజయవాడ వ్యాప్తంగా ఉన్న గస్తీ వాహనాలు, పోలీసుస్టేషన్లు, రక్షక్ వాహనాలు, అగ్నిమాపక కేంద్రాలు, అంబులెన్సులు, జాతీయ రహదారి గస్తీ వాహనాలు వంటివాటన్నింటినీ ఈ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానిస్తారు. ఇక్కడకు వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ ఏ ప్రాంతం నుంచి వచ్చిందని గుర్తించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆ ప్రాంతంలో ఉండే వారిని అప్రమత్తం చేసి అవసరమైన అత్యవసర సేవలందిస్తున్నారు. ఇలా చేరుకునే సమయం విజయవాడలో అత్యంత తక్కువగా సగటున 6.16 నిమిషాలుగా నమోదవుతోంది.

ప్రపంచ దేశాల్లో కంట్రోల్‌రూం కేంద్రానికి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు పోలీసు సిబ్బంది హాజరయ్యే సమయాన్ని పోలిస్తే విజయవాడ పోలీసులు తక్కువ సమయంలోనే హాజరవుతున్నారు. ఇది అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతోందని చెబుతున్నారు. విజయవాడ నగర పరిధి తక్కువగా ఉండడం కూడా సంఘటనాస్థలికి సత్వరమే వెళ్లడానికి దోహదపడుతోంది. బెజవాడ పోలీస్ సగటున 6.16 నిమిషాల్లో ఘటనా స్థలానికి వెళ్తుంటే, న్యూయార్క్ 9.1 నిమిషాల్లో, డల్లాస్ 8.0 నిమిషాల్లో, లోస్ ఏంజెల్స్ 8.3 నిమిషాల్లో, అట్లాంటా 12 నిమిషాల్లో, లండన్ 15 నిమిషాల్లో, స్కాట్లాండ్ 11 నిమిషాల్లో, టోక్యో 7.3 నిమిషాల్లో, సింగపూర్ 15 నిమిషాల్లో చేరుతున్నారు.

అయితే, ప్రధానమైన సమస్య, పోలీస్‌ కంట్రోల్‌రూం కాల్‌ను చాలా మంది దుర్వినియోగం చేస్తుంటారు. బ్లాంక్‌ కాల్స్‌ చెయ్యటం, పిల్లలు సరదాగా చెయ్యటం, కావాలని పోలీసులని ఇబ్బంది పెట్టటం లాంటివి చేస్తూ, పోలీసు సహనానికి పరీక్ష పెడుతారు. రోజుకి సగటున 3 వేల కాల్స్ వస్తే, 150 కాల్స్ నిజంగా అవసరం ఉన్నవాళ్ళు చేసేవి.

విజయవాడలో చదువుకుని, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ, అమ్మా నాన్నలతో ఉండాలి అనేది చాలా మంది కోరిక... కాని, స్థానిక పరిస్థుతల ప్రభావంతో ఇన్నాళ్ళు ఇక్కడ చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరక్క, హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీలకి వెళ్ళాల్సిన పరిస్థితి... విభజన పుణ్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో, విజయవాడకి నెమ్మదిగా సాఫ్ట్-వేర్ కంపెనీల రాక మొదలైంది... 10 రోజుల క్రితం, ఆటోనగర్ లో, 8 ఐటి కంపెనీలు ప్రారంభం అయ్యాయి...

అలాగే APNRT, ప్రభుత్వ సహకారంతో http://itcentral.in అనే వెబ్సైటు ప్రారంభించారు. ఇందులో, ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తీ చేసిన విద్యార్థులు విజయవాడ చుట్టు పక్కల, ఉండే ఉద్యోగాల ఖాళీల వివారాలు తెలుసుకోవచ్చు. వివిద కోర్స‌ల వివారాలు, శిక్షణా సంస్థల వివరాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు.

విద్యార్థులు ఇక్కడ వాళ్ళ resume అప్లోడ్ చేస్తే, వివిధ కంపనీల వారు, మీ విద్యార్హత , మీ స్కిల్ల్స్ నచ్చితే, మీకు ఉద్యోగం ఇచ్చే అవకాశం కుడా ఉంది. మీ resume ఇక్కడ అప్లోడ్ చెయ్యాలి http://itcentral.in/resumes/

అలాగే ప్రస్తుతం, విజయవాడలో వివిధ సాఫ్ట్-వేర్ జాబ్స్ ఓపెనింగ్స్ వివరాలు... మీకు అర్హతలు ఉంటే, అప్లై చేసుకోండి....

ఈ కంపెనీ, మొన్న ప్రారంభం అయిన 8 ఐటి కంపెనీల్లో ఒకటి. మొత్తం 60 మంది ఫ్రేషేర్స్, MBA, MCA, B.Tech, M.Tech విద్యార్హత ఉండాలి. ఇక్కడ ఈమెయిల్ ID ఇచ్చారు. మీ resume పంపించి అప్లై చేసుకోండి.

software jobs vijayawada 25022017 2

అలాగే మరిన్ని జాబ్ ఓపెనింగ్స్....

.NET Developer - Disruptive Software Private Limited
http://itcentral.in/job/disruptive-software-private-limited-vijayawada-2-net-developer/

JavaScript Developer and Lead - Suthra Technologies
http://itcentral.in/job/suthra-technologies-vijayawada-2-javascript-developer-and-lead/

Angular 2 and NodeJS Trainer - Suthra Technologies
http://itcentral.in/job/suthra-technologies-vijayawada-2-angular-2-and-nodejs-trainer/

DOTNET Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-for-dotnet-developers/

JAVA Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-for-experienced-java-developers/

Web Designer - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruptive-software-private-limited-vijayawada-2-web-designer/

Search Engine Operators (SEO) - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-we-are-hiring-search-engine-operators-seo/

UI Developers - Disruve Software Pvt. Ltd
http://itcentral.in/job/disruve-software-pvt-ltd-vijayawada-2-vacancies-are-available-for-experienced-ui-developers-positions/

నవ్యాంధ్రలో తిరుమల తరువాత అత్యంత ప్రజాదరణ కలిగిన ఇంద్రకీలాద్రి అభివృద్ధిపై అధికారులు దృష్టిని కేంద్రీకరించారు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో రూ. 46.92 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆలయ అధికారులు అంచనాలు రూపొందించారు. పునర్విభజన తరువాత ఏర్పడిన నవ్యాంధ్రకు నూతన రాజధానిగా అమరావతి ఖరారు కావడంతో విజయవాడలోని దుర్గగుడికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. తిరుమలలో నిత్యం సుమారు 60 వేల మంది కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటుండగా, ఇంద్రకీలాద్రిలో వెలసిన ఆదిశక్తి కనకదుర్గమ్మను దాదాపు 30 వేల మంది వరకు నిత్యం దర్శించుకుంటున్నారు. దీనితో పెరిగిన భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆలయ పరిసరాల అభివృద్ధి తప్పనిసరి అయింది.

ఆలయ అధికారులు పలు దఫాలుగా పరిశీలన జరిపిన అనంతరం తుదిగా అభివృద్ధి పనుల నిధుల అంచనాలను విడుదల చేశారు. శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం అభివృద్ధి ప్రాకార మండపం పునఃనిర్మాణం నిమిత్తం రూ.3.90 కోట్లు, శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, కొలనుకొండ నిర్మాణం నిమిత్తం రూ.45 లక్షలు, శ్రీ దుర్గమ్మ వారి దర్శనార్ధమై వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం కుమ్మరిపాలెం సెంటర్లో పార్కింగ్ నిమిత్తం రూ.3.70కోట్లు, దేవాలయంలో పుష్కరిణి నిర్మాణం, పవిత్ర వనముల అభివృద్ధి నిమిత్తం రూ.2 కోట్లు అవసరమని అధికారులు తేల్చారు.

అమ్మవారి దర్శనానికి హై స్పీడు లిఫ్ట్లు
కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం క్రింద ఉండే అడ్మినిస్తేషన్ భవనసముదాయం నుంచి హై స్పీడు లిఫ్ట్లును రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. అర్జున వీధి సుందరీకరణ నిమిత్తం రూ.7.90 కోట్లు, ఘాట్ రోడ్డు సుందరీకరణ నిమిత్తం రూ.3 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన, దిగువన జలపాతములకు రూ.3 కోట్లు, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం బంగారం మలాం పనులకు రూ.8.97 కోట్లు, ఇంద్రకీలాద్రి క్షేత్ర ముఖద్వారం సుందరీకరణ పనులకు రూ.1 కోటి, గోశాల నిర్మాణం రూ.2కోట్లు, అన్నప్రసాదాల నిర్మాణం నిమిత్తం రూ.5 కోట్లు ఖర్చుకు నివేదికలు రూపొందించారు. ప్రసాదం పోటు నిర్మాణానికి రూ.3 కోట్లు, శ్రీ కనకదుర్గ అమ్మవారి పురాతన మెట్లు మార్గం పునఃనిర్మాణం నిమిత్తం రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేసేందుకు అంచనాల నివేదికలను అధికారులు తయారు చేసారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భక్తులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల ఏర్పాటు చేయనున్నారు. గతంలో కొండపై ఉన్న పలు దుకాణాలను, కళ్యాణకట్ట, ఆలయ పరిపాలనా భవనాలను క్రిందికి తరలించడంతో కొండపై విశాలమైన స్థలం అందుబాటులోకి వచ్చింది. దీనితో అధికారులు వేలాదిగా తరలి వచ్చే భక్తుల సదుపాయాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ, సాధ్యమైనంత త్వరగా అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

మొన్న సంక్రాంతికి విజయవాడలో జరిగిన ఎయిర్ షో చూసారా ? చాలా బాగుంది కదూ.... మనం భావని ఘాట్, పున్నమి ఘాట్ లో నుంచి ఈ విన్యాసాలు చూసాం... మరి, పైన గింగిరాలు తిరిగుతున్న ఆ ఫ్లైట్ నుంచి, కిందకు చుస్తే ఎలా ఉంటుంది ? చూడటమే కాదు, ఆ అనుభూతి మొత్తం, కెమెరాలో రికార్డు చేసారు, ఫ్లైట్ పైలట్స్.... విన్యాసాలు మొత్తం రికార్డు చేసారు...

ఎయిర్ షో చేయటానికి ఉపయోగించిన నాలుగు ఫ్లైట్స్ కు కెమెరాలు పెట్టి, విన్యాసాలు రికార్డు చేసారు.... విమానాలు గింగిరాలు తిరుగుతూ, పొగ వదులుతూ, పొగతో రక రకాల ఆకృతులు చెయ్యటం వంటి విన్యాసాలు అన్నీ, ఈ కెమెరాలు రికార్డు చేసాయి. పై నుంచి, మన ప్రకాశం బ్యారేజి, కృష్ణా నది, బెజవాడ నగరం ఎలా ఉందో ఈ వీడియో లో మీరే చూడండి..

More Articles ...

Advertisements

Latest Articles

Most Read