బెజవాడలో భానుడి వేడికి, ప్రజలు అల్లాడిపోతున్నారు. పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు మొదటిసారిగా అరైవల్ బ్లాక్లో జంబో కూలర్లను ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ బషీర్ అహ్మద్ తెలిపారు.

శనివారం మధ్యాహ్నం సంస్థ ఎండీ ఎం. మాలకొండయ్య వాటిని ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా అరైవల్ బ్లాక్లోని 51 - 57 ప్లాట్ఫారంల మధ్య జంబో కూలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

విజయవంతమైతే అన్ని ప్లాట్ఫారంలలో ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ప్రకాశం ఆనకట్ట దిగువ అప్రాన్ పై ఆదివారం నుంచి ద్విచక్రవాహనాల రాకపోకలకు జలవనరులశాఖ ఆమోదం తెలిపింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన మార్గాన్ని చూపే విధంగా అప్రాన్ పై సున్నంతో మార్కింగ్ చేశారు.

గేట్ల మార్పిడి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆనకట్ట పై నుంచి వాహనాలు రాకపోకలను వచ్చేనెల 24 వరకు నిలిపివేశారు. ఫలితంగా గుంటూరు జిల్లా వైపు ఉన్న తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్ళూరు మండలాలకు చెందిన రైతులు, రోజు వారీ పని చేసుకునేవారితో పాటు విద్యార్థులు విజయవాడ రాకపోకలు సాగించాలంటే అదనంగా ఏడుకిలో మీటర్లు ప్రయాణించాల్చి వస్తుందని, దీని వల్ల ఆర్ధిక భారం పడటమేకాక సమయం వృధా అవుతుందని తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ గంజి చిరంజీవి, మండల శాఖ అధ్యక్షుడు దండమూడి మనోజ్ కుమార్, జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు, జిల్లాకు చెందిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి వివరించారు.

అంతేకాకుండా సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు కూడా జలవనరుల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అందరి విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి ఉమామహేశ్వరరావు అప్రాన్ పై ద్విచక్ర వాహనాలు రాకపోకలకు అవకాశం కల్పించారు. దీంతో నాలుగు మండలాల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఒకే ఒక్కడు సినిమా, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పని తీరు నచ్చి, సినిమా తీసాను అని డైరెక్టర్ శంకర్ అన్న మాటలు గుర్తుండే ఉంటాయి. అయితే, 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు అలా లేరు కాని, ఆయన ఆఫీసర్ లు మట్టికి దుమ్ము దులుపుతూ, ఒకే ఒక్కడు పార్ట్ - 2 చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాకి కొత్త కలెక్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. బాబు అహ్మద్ ఎంతో సమర్ధవంతమైన కలెక్టర్ గా పని చేశారు.. ఆయన స్థానంలో లక్ష్మీకాంతం గారు బదిలీ మీద వచ్చారు. చంద్రబాబు ఏరి కోరి, కృష్ణా జిల్లా లాంటి కీలాకమైన జిల్లాకి, లక్ష్మీకాంతం గారిని తెచ్చుకున్నారు.

చూడటానికి చాలా మృదువుగా ఉన్నా, కలెక్టర్ ఆకస్మిక పర్యటనతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఒకదశలో కలెక్టర్ లక్ష్మీకాంతం అడుగుతున్న వివరణలకు అధికారులకు చెమటలు పడుతున్నాయి. కలెక్టర్ తనిఖీల్లో సామాన్య ప్రజల స్థితిగతులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అంతేగాక అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు.

బాధ్యతలు తీసుకున్న వెంటనే కలెక్టర్ ప్రత్యేకంగా గన్నవరం నియోజకవర్గంపై దృష్టి సారించారు. గన్నవరం బ్రహ్మలింగయ్య చెరువును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. గన్నవరం మండలంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఆకస్మీకంగా తనిఖీలు నిర్వహించారు. తాను ఏ రోజు, ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేస్తానో తనకే తెలియదని, తనిఖీల సమయంలో ఎటువంటి పొరపాట్లు తన దృష్టికి వచ్చినా సహించనని, ఈ విషయాన్ని ప్రభుత్వ ఆదికారులు, ఉద్యోగులు గుర్తుంచుకుని బాధ్యతాయుతమైన విధులను నిర్వర్తించి పని తీరులో జిల్లాను అగ్రగామిగా ఉంచాలని, లేని పక్షంలో తీవ్ర చర్యలకు వెనుకాడబోనన్నారు.

తొలుత గన్నవరం తహసీల్గార్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రస్తుతం పురాతనమైన భవనంలో ఉన్న తహసీల్గార్ కార్యాలయాన్ని ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎప్పటికప్పడు సమస్యలను పరిష్కరించి నివేదికలను తమకు సమర్పించాలని, లక్ష్య సాధనలో మండలాన్ని అగ్రగామిగా ఉంచాలని తహసీల్దార్ మాధురీకి సూచించారు.

గన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వైద్య చికిత్స కొరకు విచ్చేసిన రోగులను ఆరోగ్య కేంద్రం అందిస్తున్న సేవలు వైద్యుల పనితీరుపై ఆరాతీశారు. హాజరుపట్టీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ పేరు పేరున సిబ్బందిని పిలిచి వారు నిర్వర్తిస్తున్న విధులు గురించి ప్రశ్నించారు. గత నాలుగు రోజులుగా హాజరు పట్టీలో సంతకాలు చేయని ఉద్యోగి శ్రీహరినాయక్ కు తక్షణమే మెమో జారీ చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. సమయూపాలన తప్పనిసరిగా పాటించాలని లేని పక్షంలో కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలో అంగన్ వాడీ కేంద్రాన్ని ఆకస్మీకంగా తనిఖీ చేసేందుకు వెళ్లిన జిల్లా కలెక్టర్ అంగన్ వాడీ కేంద్రం లో నలుగురే విద్యార్థులు ఉండటాన్ని గమనించి ఆశ్చర్యచెకితులయ్యారు. ప్రతిరోజూ 15 మంది చిన్నారులకు తగ్గకుండా హాజరుపట్టీలో హాజరుశాతం నమోదుకావటాన్ని గమనించిన కలెక్టర్ నేడు నలుగురే చిన్నారులు హాజరుకావటం పై అంగన్ వాడీ టీచర్ పి.అనూషను ప్రశ్నించారు. ఇక పై ఇటువంటి చర్యలను తాము ఎట్టి పరిస్థితులలో సహించబోనని ప్రభుత్వం ఏ ఉద్దేశ్యంతో అంగన్ వాడీ కేంద్రాలను నిర్వర్తిస్తున్నదో ఆ లక్ష్యాలను విస్మరించరాదని హెచ్చరించారు. అంగన్ వాడీ కేంద్రం అని తెలిసేవిధంగా భవనం పై బోర్డును ఏర్పాటుచేయక పోవటం ఆ శాఖ అధికారుల పనితీరుకు నిదర్శంగా భావించవలసి వస్తుందని వెంటనే భవనాన్ని శుభ్రపరచి నేమ్ బోర్డును ఏర్పాటుచేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.

అనంతరం కేసరపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మీకంగా సందర్శించి మద్యాహ్నభోజన పథకాన్ని పరిశీలించి విద్యార్ధలతో ముచ్చటించారు. మద్యాహ్న భోజన పథకం నిర్వహణ పై కలెక్టర్ సంతృప్తిని వ్యక్తంచేశారు. దాతలు సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించటం అభినందనీయమని అయితే దాతల నుండి సేకరించిన విరాళాలు, ఖర్చుల పై ఎప్పటికప్పడు ఆడిట్ ను నిర్వహించి నివేదికలను కంప్యూటరీకరించాలని ప్రధానోపాధ్యాయునికి సూచించారు.

new collector 24042017 3

new collector 24042017 4

new collector 24042017 5

new collector 24042017 6

పెద్ద పెద్ద కారుల్లో, సెక్యూరిటీ నడుమ ప్రయాణించే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ సిటీ బస్ లో ప్రయాణం చేసి ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే క్రమంలో 53వ డివిజన్ రామకృష్ణాపురం బుడమేరు వంతెన పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, బుడమేరు వంతెన బస్ స్టాప్ లో ప్రయాణికులతో ముచ్చటించారు.

ఈ లోపుగా నగరం నుంచి పాయకాపురం వెళ్తున్న 48వ నెంబర్ సిటీ బస్ రాగానే, బస్ ఎక్కి ప్రయాణికులతో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు. బస్ ప్రయాణంలో కండక్టర్ తో ముచ్చటించిన ఉమ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితులు, ఉద్యోగ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు.

అలాగే బస్సులోని ప్రయాణికులందరినీ కలిసి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులతో సెల్పీలు దిగారు. ఎమ్మెల్యే ఉమ పైపుల రోడ్డు బస్సు స్టాప్ లో దిగిపోయారు. అయితే సాధారణ ప్రయాణికునిగా సిటీ బస్ ఎక్కిన ఉమ ఆర్టీసీ సంస్థ ఎమ్మెల్యేలకు కల్పించిన ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కాదని ఆయనతో పాటు ఆయనతో ఎక్కిన అనుచరగణానికి సైతం టికెట్లు తీసుకోవడం గమనార్హం.

ఐటీ రంగంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ సంస్థల్లో ఒకటైన హెచ్‌సీఎల్ తన కార్యకలాపాలను మే నెల నుంచి విజయవాడ కేంద్రంగా ప్రారంభించనుంది. రూ.500 కోట్ల పెట్టబడితో ఆ సంస్థ నవ్యాంధ్రలో బీపీఓలను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ నాడార్ల సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. వచ్చే నెల నుంచి ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది.

కేసరపల్లి వద్ద 11 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ఆ సంస్థకు కేటాయించింది. అందులో ఆకర్షణీయమైన డిజైన్లతో బీపీఓ నిర్మాణ పనులను ప్రారంభించ నుంది. భవన నిర్మాణాలు పూర్తయ్యేలోపు గన్నవరం సమీపం లోని మేధ టవర్స్ ప్రాంగణంలో తాత్కాలికంగా బీపీఓ కార్యకలాపాలను మొదలుపెట్టనుంది.

త్వరలో ఆ సంస్థ నుంచి ప్రతినిధుల బృందం విజయవాడకు వచ్చి ఈ పనులను ప్రారంభించి పర్యవేక్షించనున్నారు. హెచ్‌సీఎల్ రాక రాష్ట్ర ఐటీ రంగంలో ఒక పెద్ద కదలిక తేవడానికి దోహద పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దీని బాట లోనే మరిన్ని సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆసక్తి ప్రదర్శిస్తాయని అంచనా వేస్తున్నారు.

మేధ టవర్స్ ప్రాంగణంలో, మొదట వెయ్యి మందితో కార్యకలాపాలు ఆరంభించనున్నట్లు సమాచారం. దాంతో పాటు స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆ సంస్థ నైపుణ్య శిక్షణ కూడా ఇవ్వనుంది. శిక్షణ పూర్తయ్యాక వారికి ఉద్యోగావకాశాలూ కల్పించనుంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read