అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి మరో దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ, సర్వీసులు నడపటానికి సిద్ధమైంది. దీని కోసం అధ్యయనం చెయ్యటానికి, ‘ఇండిగో’, తన బృందాన్ని ఇక్కడకు పంపనుంది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలో పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి ఫీజుబిలిటీను ఈ బృందం అధ్యయనం చెయ్యనుంది. ఇందుకోసం, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావును, ‘ఇండిగో’అపాయింట్‌మెంట్‌ కావాలని కోరింది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ సూచన మేరకు, జూన్ 15, 16 తేదీలలో ‘ఇండిగో’ విమానయా న సంస్థ టెక్నికల్‌ బృందం విజయవాడ రాబోతోంది.

ఇండిగో ఎయిర్‌లైన్స ప్రధానంగా ఎయిర్‌బస్‌ 320, ఎయిర్‌బస్‌ 321, ఏటీఆర్‌ 72 శ్రేణి విమానాలను నడపటానికి వీలుగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నది. ప్రధానంగా రన్‌వే, టాక్సీ వే, ఆఫ్రాన్స, పా ర్కింగ్‌ బేలు, అగ్నిమాపక విభాగం అందిస్తున్న సేవలు, నైట్‌ల్యాండింగ్‌, ఐఎల్‌ఎస్‌ తదితర సాంకేతిక వ్యవస్థల అందుబాటు పై అధ్యయనం చేయటంతోపాటు ఇతర విమానయాన సంస్థలు అందించే సేవలు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల వివరాలు, విమాన ఆపరేషన్స నిర్వహణ వంటి వాటికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరపనున్నది.

ఇండిగో వస్తే.. దశ తిరిగినట్టే :
ఇప్పటివరకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నడిచిన విమానయాన సంస్థలన్నీ ఒక ఎత్తయితే.. ఇండిగో ఎయిర్‌లైన్స ఒక్కటే మరో ఎత్తు. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రణాళికా బద్ధంగా సర్వీసులు నడుపుతుంటుంది. ఇండిగో విమానయాన సంస్థ ఏదైనా ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఆషా మాషీగా అడుగు పెట్టదు. ఎంతో అధ్యయనం చేస్తుంది. ఫలానా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నడపాలనుకుంటే ఒకటి, రెండు సర్వీసులతో ప్రారంభించదు. పెద్దమొత్తంలో సర్వీసుల ను నడుపుతుంది. దేశంలోని నలుమూలలకు కనెక్టివిటీ అయ్యేలా సర్వీసులు ప్రవేశపెడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టుకు ఇండిగో ఎయిర్‌లైన్సను తీసుకు రావాలన్న ప్రయత్నాలను ఎయిర్‌పోర్టు అధికారులు పట్టువిడవకుండా చేస్తున్నారు.

భవానీ ఐలాండ్ సరికొత్త హంగులను సంతరించుకోనుంది.... భవానీ ఐలాండ్ ఇమేజ్ మరింగ పెంచేందుకు రంగం సిద్ధమైంది... అమరావతి రాజధానికి ఆభరణం లాంటి భవానీ ఐలాండ్ సమగ్ర అభివృద్దికి తొలి అడుగు పడింది. ద్వీపాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్(బి. ఐ.టి.సి)కు తొలి విడతగా రూ.6 కోట్ల నిధులను సర్కారు గురువారం విడుదల చేసూ జీవో జారీ చేసింది. ఈ నిధులతో భవానీద్వీపంలో మల్టీమీడియా లేజర్ షో, దీనికి అనుబంధంగా మ్యూజికల్ డాన్సింగ్ ఫాంటైన్స్ వాటర్ స్కీన్లు ఏర్పాటు చేయనున్నారు.

దేశంలోనే మరెక్కడా లేనంత అద్భుత ద్వీపం.. భవానీ ఐలాండ్ 132 ఎకరాల్లో స్వచ్చమైన కృష్ణా మంచినీటి జలాల మధ్యలో ఏర్పడిన ప్రకృతి ప్రసాదితం. దీనిలో 15 ఎకరాలు అభివృద్ధి చేసి ప్రస్తుతం పర్యటకుల కోసం అందుబా టులో ఉంచారు. అయితే. ఈ 15 ఎకరాల్లోనూ పర్యాటకుల కోసం చేసిన ఏర్పాట్ల నామమాత్రమే. దీంతో వెళ్లినవాళ్లు వెళ్లినట్టే వెనక్కి వచ్చేస్తున్నారు. అందుకే, భవానీ ద్వీపాన్ని పూర్తి స్తాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన బృహత్తర ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు. ప్రత్యేకంగా బీఐటీసీని ఏర్పాటు చేసింది. తొలిదశలో భాగంగా అత్యాధునిక లేజర్ షోను ఏర్పాటు చేయనున్నారు. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న మల్టీమీడియా లేజర్ షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

మల్లీమీడియా లేజర్ షో అన్నది ప్రపంచంలోనే అత్యుత్తమమైనది. ఇందులో విజువలైజేషన్ కూడా ఉంటుంది. ఇక మ్యూజికల్ డాన్సింగ్ పౌంటెయిన్ అన్నది ప్రత్యేకమైనది. ఒక వేదిక మీద సంగీత కచేరీ జరుగుతుంటే దానికి అనుగుణంగా చుట్టూ ఉన్న పౌంటెయిన్స్ నృత్యాలు చేస్తుంటాయి. విద్యుత్ లైటింగ్ నడుమ దేదీప్య మానంగా వెలిగిపోతుంటుంది. అటు మల్లీమీడియా లేజర్ షోను, ఇటు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పౌంటెయిన్ను అనుసంధానం చేసారు. దీనివల్ల సంగీతానికి అనుగుణంగా పౌంటెయిన్లు నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తుంది.

హైదరాబాద్ గోల్గొండ కోటలో ఏర్పాటు చేసిన లేజర్ షో ఇలాంటిదే. అయితే. ఇక్కడ కృష్ణా జలాలు సైతం అదనపు ఆకర్షణ కావడంతో. లేజర్ షోకు అనుబంధంగా మ్యూజికల్ పౌంటైన్లు, వాటర్ స్క్రీన్, సైతం ఏర్పాటు చేయనున్నారు. అద్భుతమైన వెలుగు కిరణాల విన్యాసాల మధ్య, చెవులకు ఇంపుగా ఉండే సంగీతానికి తగ్గట్టుగా, నీరు గాలిలోనికి లేచి, నాట్యం చేస్తున్నట్టుగా ఉండే. ఈ దృశ్యాలు అత్యద్బుతంగా ఉంటాయి.

ప్రస్తుతం భవానీ ద్వీపంలో ఎలాంటి ఆకట్టే అంశాలు లేకపోవడంతో నిత్యం 500 మంది లోపే వస్తున్నారు. ఆదివారాలు, సెలవుదినాల్లో ఎక్కువ మంది ఉంటారు. నెలకు 15 వేల లోపు, ఏటా రెండు లక్షల మంది వరకూ వస్తున్నారు. వీరంతా కేవలం పడవ ప్రయాణం పై ఆసక్తితోనే వస్తున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకోవటంతో, ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఎయిర్‌ ఏషియా సంస్థలు అంతర్జాతీయ విమానా సర్వీసులు నడపటానికి సిద్ధంగా ఉన్నాయి. అధికారికంగా త్వరలోనే దీని పై ఒక ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ఏటా లక్షల మంది దేశ, విదేశాలకు వెళ్తుంటారు. వీరంతా హైదరాబాద్‌, చెన్నై, ముంబయి వంటి నగరాలకు వెళ్లి అక్కడి విమానాశ్రయాల నుంచి వెళ్లాల్సి వస్తోంది. కేవలం హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్తున్న వాళ్లలో 25శాతం ఈ నాలుగు జిల్లాలకు చెందిన వారే. ఇక విదేశాలకు నేరుగా ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. పర్యటకంగా కూడా ఎంతో మేలు జరగబోతోంది.

జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభించడంవల్ల పోటీ పెరిగి తక్కువ ధరకే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకం వృద్ధి చెందనుంది. అంతర్జాతీయ ప్రయాణికులు, కార్గో ట్రాఫిక్‌ పెరగడం ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థికాభివృద్ధికి బాటలు పరుస్తుంది.

ఇప్పటికే, పాత టెర్మినల్‌ను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు రావటానికి టెండర్లు పిలిచారు. కస్టమ్స్‌ , ఇమ్మిగ్రేషన్‌ శాఖల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరో పక్క, రన్‌వే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

నవ్యాంధ్ర రాజధాని ఆమరావతి పరిధిలో ఆంఫీబీయోస్‌ బస్సులు (బోటు కం బస్సు) అందుబాటులోకి వచ్చేసాయి... ఈ వాహనం చూడడానికి బస్సు మాదిరిగా ఉంటుంది. రోడ్డు మీద టైర్ల సహకారంతో ఇతర వాహనాల మాదిరిగా ఉంటుంది. నీటిలో దిగిన తర్వాత లాంచి మాదిరిగా తేలుతూ పయనిస్తున్నాయి. విదేశాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ప్రత్యేక బస్సులను తొలిసారి అమరావతిలో ప్రవేశపెట్టిన పర్యాటక శాఖ అధికారులు, నిన్న ట్రయిల్ రన్ నిర్వచించారు..

బస్సును పది రోజుల క్రితమే విజయవాడకు తీసుకొచ్చారు. అనంతరం రహదారి పై పరీక్షించారు. నదిలోకి దింపేందుకు పన్నమి ఘాట్ సమీపంలో నిర్మించిన ర్యాంప్ అనువుగా లేకపోవడంతో ట్రయల్ రన్ నిలిపివేశారు. ర్యాంప్ సరిచేసి, నిన్న ట్రయిల్ రన్ నిర్వచించారు.. ట్రయిల్ సక్సెస్ అవ్వటంతో, త్వరలోనే ఈ బోటును పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు పర్యాటకశాఖ ఏర్పాట్ల చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని ప్రారంభించనున్నారు.

బస్సులో సుమారు 32 సీట్లు ఉంటాయి. ఇవి రోడ్డుపై గంటకు గరిష్టంగా 94 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. నీటిలో ఎనిమిది నాట్స్‌ వేగంతో వెళ్లగలవు.

వెలగపూడి సచివాలయం చేరుకోవటానికి చాలా ఉపయోగం:
విజయవాడ నుంచి వెలగపూడి మధ్య 25 కిలోమీటర్ల ప్రయాణం. అంతదూరం వెళ్లాలంటే సుమారు 45 నిముషాల సమయం పడుతుంది. ఆంఫీబీయోస్‌ బస్సులను ప్రవేశపెడితే ఈ దూరం 5-6 కిలోమీటర్లకు తగ్గుతుంది. పవిత్రసంగమం వద్ద ఆంఫీబీయోస్‌ బస్సు ఎక్కితే కేవలం 15 నిమిషాల్లో తాళ్లాయపాలెం చేరుకుని అక్కడి నుంచి 10 నిమిషాల్లో వెలగపూడికి వెళ్లే ఆవకాశం ఉంటుంది. గుంటూరు నుంచి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు కూడా తాళ్లాయపాలెం నుంచి ఆంఫీబీయోలలో నేరుగా దుర్గా ఘాట్ కు చేరుకోవచ్చు. వీటివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.

పర్యాటకంగా కూడా:
ఆంఫీబీయోల వల్ల ప్రజలకు సేవ చేయడంతో పాటు ఆమరావతి ప్రాంతం పర్యాటకంగా అభివృధి చెందుతుంది. వీటిని పర్యాటకంగా ఉపయోగించటం కోసం, ఒక రూట్ ప్లాన్ చేసారు. భవానీపురం ఘాట్‌ నుంచి నదిలో బయలుదేరి భవానీ ద్వీపం మీదుగా లోటస్‌ హోటల్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి గుహలు, మంగళగిరి లక్ష్మీనర్సింహ స్వామి దేవాలయం, అమరావతి సచివాలయం, ఉద్దండరాయపాలెం, శ్రీశివక్షేత్రం ప్రాంతాల్లో పర్యటిస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవాలయ దర్శనం, మ్యూజియం, తదితరాలు ఉంటాయి.

విభజన చట్టంలోని మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకు ఇచ్చిన హామీ మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు విజయవాడ ఎయిర్ పోర్ట్ కు తప్పకుండా అంతర్జాతీయ హోదా వస్తుందని గతంలో పలుమారు పేర్కొన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇక్కడి ఎయిర్ పోర్ట్ కు ప్రాధాన్యం ఇస్తుండడంతో కేబినెట్ లో సానుకూల నిర్ణయం వచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లోని విమానాశ్రయమే అంతర్జాతీయ స్థాయి కలిగి ఉండేది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. విభజన తర్వాత నవ్యాంధ్రలో ఈ స్థాయి ఎయిర్ పోర్ట్ లేదు.

రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా విస్తరిస్తోంది. రన్వే, మౌలిక సదుపాయాలు, టెర్మినల్ బిల్లింగ్ సాంకేతిక పరిజ్ఞానం, పార్కింగ్ బే, ఇలా అన్నింట్లోనూ విజయవాడ ఎయిర్ పోర్ట్ రాష్ట్రంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ ఎయిర్ పోర్ట్ సాధించని వృద్ధిని విజయవాడ ఎయిర్ పోర్ట్ మూడేళ్లుగా సాధిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో మిలియన్ ప్రయాణికుల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్లో ఎయిర్పోరుకు అంతర్జాతీయ హోదా కల్పించటం సంతోషించాల్సిన విషయం.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read