చంద్రబాబు 6 లక్షల కోట్లు అవినీతి చేసారు అంటూ, పదే పదే చెప్పిన వైసీపీ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్, తాము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, నాలుగు నెలలుగా, ఆ అవినీతిని నిరూపించటానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పటికే అనేక ఎంక్వయిరీలు వేసారు, అనేక కమిటిలు వేసారు, చివరకు కేంద్ర సహాయం కూడా అవసరం అయిన చోట తీసుకున్నారు. నాలుగు నెలలుగా, చంద్రబాబు చేసిన అవినీతి తవ్వుతూనే ఉన్నారు కాని, ఇప్పటి వరకు అయితే ఏమి బయట పడలేదు. చివరకు ఉద్యోగస్తులని కూడా, మీరు చంద్రబాబు పై ఏదైనా ఆధారాలు ఉంటె చెప్పండి అంటూ వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అయినా చంద్రబాబు పై కేసు పెట్టటానికి ఏమి దొరకలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లో భాగమో ఏమో కాని, అవినీతి పై చంద్రబాబు మీద ఏమి కేసులు పెట్టలేము అనే స్థితికి వచ్చారో ఏమో కాని, ఈ రోజు చంద్రబాబు పై ఒక పోలీస్ కేసు పెట్టరు వైసిపీ ఎమ్మెల్యేలు.

cbn 19102019 2

అదేదో అవినీతి కేసు కాని, మర్డర్ కేసు కాని అనుకునేరు. కాదు. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు పై వ్యాఖ్యలు చేసారని, పోలీస్ వ్యవస్థను కించపరిచేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని, అందుకే చంద్రబాబు పై కేసు పెట్టామని, ఆయన్ను అరెస్ట్ చెయ్యాలని అంటున్నారు, వైసిపీ ఎమ్మెల్యేలు. గుంటూరు జిల్లా ఆరండల్ పేట పోలీసు స్టేషన్లో , చంద్రబాబు పై, కేసు పెట్టారు, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, విడదల రజని, మహ్మద్‌ ముస్తఫా తదితరులు. పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు, వర్ల రామయ్య మాట్లాడుతున్నారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు, డీజీపీ పైనా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వీరు అన్నారు. చంద్రబాబు, వర్ల రామయ్యను తక్షణం అరెస్ట్ చేయాలని వైకాపా నేతలు డిమాండ్‌ చేశారు.

cbn 19102019 3

అయితే ఇదే సందర్భంలో, చంద్రబాబు సియంగా ఉండగా, జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం, వీరికి గుర్తు లేవు. చంద్రబాబుని కాల్చేయాలని, చంద్రబాబుని ఉరి వెయ్యాలని, జగన్ చేసిన వ్యాఖ్యల పై మాత్రం, వీరు మాట్లాడటం లేదు. అదే సందర్భంలో, అనేక సందర్భాల్లో, ఏపి పోలీసుల పై నమ్మకం లేదని, జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా, ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. వైజాగ్ లో పోలీసులను వేలు పెట్టిన బెదిరించటం, అలాగే నందిగామలో, ఒక కలెక్టర్ ని, నిన్ను కూడా జైలు కూ తీసుకోపోతా అని బెదిరించటం, అన్నీ అందరికీ గుర్తున్నాయి. ఆ సమయంలో జగన్ చేసిన వాటి పై మాత్రం, ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యని వీరు, జరుగుతున్న పరిణామాల పై, పోలీస్ వ్యవస్థలోని కొందరు, మా పై అనవసరంగా కక్ష సాధింపు చేస్తున్నారు అని చంద్రబాబు చెప్తే మాత్రం తప్పు అయ్యింది.

రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య, హాట్ హాట్ గా ఆరోపణలు ప్రత్యారోపణుల పర్వం నడుస్తుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ప్రతి ఒక్కరి పై, ట్విట్టర్ లో హేళనగా మాట్లాడటం చూస్తూ ఉంటాం. అలాగే, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, విశాఖ ఎంపీ అభ్యర్ధి శ్రీ భరత్ మతుకుమిల్లి పై ట్విట్టర్ లో స్పందించారు. "నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. @ncbn దొంగల ముఠా, ఆయన @BJP4India లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు." అంటూ ఘాటుగా ట్విట్ చేసారు. అయితే, దీని పై భరత్, అంతే ధీటుగా, విజయసాయి రెడ్డికి ఒక బహిరంగ లేఖ ద్వారా, స్పందించారు. అసలు ఆ అప్పు ఎందుకు అయ్యిందో చెప్తూ ఇచ్చిన లేఖతో, జగన్ ప్రభుత్వం పైనే విమర్శలు చేసారు. ఇది ఆ లేఖ.

bharat 19102019 2

"విజయసాయి రెడ్డి గారు...ఇప్పుడు మీరు ప్రభుత్వంలో బాధ్యత గల పదవి లో ఉన్నారు. మీరు అంతే బాధ్యతగా మాట్లాడాలని ఆశిస్తాము. కానీ అందుకు భిన్నంగా మీరు చేస్తున్న వ్యాఖ్యలకు నేను బదులు చెప్పాల్సి వస్తోంది. ప్రజలకు నిజాలు తెలియాలి. విదేశాలలో ఉన్నత చదువులు చదివి సొంతంగా వ్యాపారంలో రాణించడంతో పాటు పర్యావరణ హితంగా కూడా ఏదైనా చేయాలనే సంకల్పంతో 2016లో మా తండ్రిగారి సాయంతో విజయనగరం జిల్లా గరివిడి లో ఒక చిన్న 3 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ని నెలకొల్పాను. వి బి సి రెన్యూబుల్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ పేరు తో స్థాపించిన మా సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, ఎ పి ట్రాన్స్ కో తో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 2016 నుంచి ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం ఏ పి ట్రాన్స్ కో నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ.3 కోట్లు. ఆంధ్రా బ్యాంకు నుండి మేము తీసుకున్న రుణం రూ.15.84 కోట్లు కాగా మేము ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా రుణ చెల్లింపుల తో అది రూ. 13.65 కోట్లకి తగ్గింది. "

bharat 19102019 3

"బ్యాంక్ కు మా సంస్థ చెల్లించవలసింది లోన్ వాయిదాలు దాదాపు రూ.2 కోట్లు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుండి మాకు రావలసిన బకాయిలు దాదాపు రూ. 3 కోట్లు. ట్రాన్స్ కో గనుక మాకు సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే బ్యాంకు రుణం సమయానికి చెల్లించేవాళ్ళం. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో వున్నందున బకాయిలు కోసం వినతులు సమర్పిస్తూ ఎదురు చూస్తున్నాము. కానీ ప్రభుత్వంలో ఉన్న మీరు, ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితి లో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం. ఇది నా ఒక్కరి పరిస్థితే కాదు. మన రాష్ట్రంలో వందల పరిశ్రమలు, వ్యాపారస్తుల పరిస్థితి ఇలాగే వుంది. ప్రభుత్వం నుండి సకాలంలో బిల్లులు రాక పోవడం వల్ల కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో పడి ఆ సంస్థలు మనుగడ సాగించలేక పోతున్నాయి.ఒక ఆడిటర్ గా వీటి గురించి మీకు తెలియంది కాదు. కావున ప్రస్తుత పరిస్తితులు చక్కదిద్దే విధంగా పరిశ్రమలను నిలదోక్కుకునేలా మీ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారని ఆశిస్తున్నాను.. మీకు వీలైతే ఔత్సాహిక పరిశ్రమలను ప్రోత్సహించండి కాని నాలాంటి వారిని అవమానపరిచేలా వ్యవహారించవద్దని విన్నవిస్తున్నాను..."

ఎద్దు ఈనింది అంటే దూడను గాట్లో కట్టేయండి అన్నట్లుగా తయారైంది వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం. ఏమి లేనిది ఉన్నట్టు చెప్తూ, ప్రచారం చేసి ప్రజలను నిజం అని నమ్మించేస్తూ ఉంటారు. దీనికి మొన్నటి శేఖర్ రెడ్డి ఉదంతమే ఉదాహరణ. శేఖర్ రెడ్డి, చంద్రబాబు బినామీ అంటూ ప్రజలని నమ్మించేశారు. తీరా జగన్ అధికారంలోకి రాగానే, ఎబ్బే అదేమీ లేదు, అంతా తూచ్, శేఖర్ రెడ్డి నిజాయతీ పరుడు అంటూ, టిటిడి బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. అలాగే పింక్ డైమండ్ వ్యవహారంతో పాటుగా, అనేక అనేక కధనాలు ఇలాగే అల్లి, నిజం అని నమ్మించారు. అయితే, ఏమి లేకపోతేనే నిజం అని నమ్మించేసే వైసిపీ ప్రచారకర్తలకు, నిజంగానే ఒక చిన్న ఆధారం దొరికితే, ఇక వారి కధనాలకు అంతే ఉండదు. అలాంటి సంఘటనే, తాజాగా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం అయ్యింది, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫోటో.

kesineni 18102019 2

విజయసాయి రెడ్డితో కేశినేని నాని కలిసి ఉన్న ఫోటో, ఉదయం నుంచి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఇదే అదనుగా, కొంత మంది వైసీపీ అభిమానులు, ఇంకేముంది, కేశినేని నాని మా పార్టీలోకి వచ్చేస్తున్నారు, విజయసాయి రెడ్డి రాయబారం నడిపారు అంటూ, పోస్ట్ లు పెట్టటం మొదలు పెట్టరు. కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానెల్స్ లో కూడా ఈ ఫోటో ప్రత్యక్షం అవ్వటంతో, ఈ ప్రచారం నిజమే అని నమ్మే స్థాయిలోకి వ్యవహారం వెళ్ళింది. అయితే అసలు జరిగిన విషయం మాత్రం వేరు. నిన్న రాత్రి డిల్లీ - విజయవాడ ఫ్లయిట్ మూడు గంటలు లేటవటంతో లాంజ్ లో కేశినేని నాని రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో విజయసాయి రెడ్డి వచ్చి కేశినేని పక్కన కూర్చుని మర్యాదపూర్వకంగా మాట్లాడారు.

kesineni 18102019 3

ఈలోపు అక్కడ ఉన్న కొంత మంది కేశినేని నాని, విజయసాయి రెడ్డి పక్క పక్కన కూర్చోవటంతో, ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ ఫోటో తీసే సమయంలో కూడా, కేశినేని నాని చాలా ఇబ్బందిగా ఉండటం గమనించ వచ్చు. అయితే, సాయంత్రం అయ్యే సరికి, ఈ ఫోటోను రకరకాల వార్తలతో వండి వార్చుతున్నారు.  పార్టీ మారనని అందరికీ కేశినేని క్లారిఫికేషన్ ఇచ్చుకోవలసి వస్తుంది అంటూ కొన్ని ఛానెల్స్ కూడా ప్రసారం చేసాయి. అయితే కేశినేని నాని వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు మాత్రం, సందర్భం వచ్చిన ప్రతిసారి, ట్విట్టర్ లో, వైసీపీని, వన్ లైన్ పంచ్ లతో, కౌంటర్ లు ఇస్తున్న నాని పార్టీ మారటం ఏంటి అని అంటున్నారు. కేవలం వైసీపీ తనను టార్గెట్ చేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తుందని, ఆ ఆరోపణలకు కూడా అవకాశం ఇవ్వకుండా ట్రావెల్స్ కూడా మూసేసిన నాని, అవినీతి ఆరోపణలతో, కోర్ట్ ల చుట్టూ తిరిగే పార్టీలో ఎలా జాయిన్ అవుతారని అనుకుంటున్నారు అంటూ, నాని సహచరులు అంటున్నారు.

జగన్మోహన్‌రెడ్డి సీబీఐ కోర్టులో తనవాదనలు వినిపించే నేపథ్యంలో సదరు విచారణ సంస్థను బెదిరించే ధోరణిలో వ్యవహరించారని, తానేం చేశాను... ఏవిధమైన సాక్ష్యాలున్నాయో చూపాలని.. నేను ఏవిధమైన ప్రభావితం చేశానో చెప్పాలంటూ.. ఆయన మాట్లాడటం జరిగిందని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే జగన్‌ సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించాడని సీబీఐ చెప్పిందన్న వర్ల, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నఆయన కేసువిచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగిందన్నారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రిగా తానుచేయవలసిన పనులు అనేకమున్నాయని గతంలోనే జగన్‌ చెప్పాడని, దానికి ప్రతిగా సీబీఐ సెలవు తీసుకోకుండా ఆదివారం కూడా పనిచేయాలని ఆయనకు సూచించడం జరిగిందన్నారు. ప్రజాసమస్యలపై పనిచేయా ల్సి ఉందని కోర్టుకి చెబుతున్న జగన్‌, అదే ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న టీడీపీ నేతలను ఎందుకు అరెస్ట్‌ చేయిస్తున్నారో సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు.

jagan 19102019 2

జగన్‌కు ఒకన్యాయం, టీడీపీనేతలకు మరోన్యాయమా అని ప్రశ్నించారు. టీడీపీ మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ సీఎం డౌన్‌..డౌన్‌ అన్నాడని, ఆయన్ని అరెస్ట్‌చేశారన్నారు. ఇదే జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు, నాటిముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి, శాసనసభసాక్షిగా ఎలాంటి మాటలన్నారో గుర్తించాలన్నారు. అలానే చంద్రబాబుని నడిరోడ్డుపై కాల్చిచంపాలని, ఆయన్ని చెప్పుతోకొట్టాలని, చొక్కాపట్టుకొని నిలదీయాలని అన్నప్పుడు జగన్‌పై నాటిప్రభుత్వం ఎన్నిసార్లు, ఎన్నికేసులు పెట్టిందో చెప్పాలని రామయ్య నిలదీశారు. జగన్‌, ఆయనపార్టీ సభ్యులు మాట్లాడిన మాటలకంటే, డౌన్‌.. డౌన్‌ అనడం నేరమెలా అవుతుందన్నారు. నవంబర్‌18, 2017లో సీబీఐకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ, ''మీ తీరుతో విసిగిపోయాం రెండేళ్లుగా అనవసరవాదనలతో సమయం వృథాచేశారు. ముప్పైఏళ్ల అనుభవంలో ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు..ఇప్పటివరకు జరిగిన ఆలస్యం చాలు'' అన్నది నిజమా..కాదా అని వర్ల ప్రశ్నించారు. టీడీపీనేతలు, కార్యకర్తలపై పెట్టే కేసులకన్నా జగన్‌పై ఉన్న కేసులు చాలా తీవ్రమైనవన్నారు. 14-09-2012న జగన్‌ ఆర్థికనేరాల గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆఫ్తాబ్‌ఆలం వ్యాఖ్యానిస్తూ... ఇంతతక్కువ వ్యవధిలో ఇన్నివేలకోట్లు ఎలావచ్చాయని, ఒకవ్యక్తి కేవలం పదేళ్లలో వేలకోట్లు ఎలా సంపాదించాడని ప్రశ్నించినమాట వాస్తవమా కాదా అన్నారు.

jagan 19102019 3

05-10-2012న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సదాశివం, జస్టిస్‌ ఎమ్‌.వై. ఇక్బాల్‌ కేసువిచారణలో మాట్లాడుతూ దేశ ఆర్థికవ్యవస్థను నాశనంచేసిన ఆర్థికనేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజమే నష్టపోతుందని, హత్యలు ఆవేశకావేశాలతో జరిగితే, ఆర్థికనేరాలు మాత్రం నిర్దిష్టలెక్కలు, ఉద్దేశపూర్వకప్రణాళిక, సామాజికప్రయోజనాలకు భంగకరంగా, వ్యక్తిగతలాభాలకోసమే చేస్తారని చెప్పడం, జగన్‌పై వచ్చిన అభియోగాలు కావా అని టీడీపీనేత నిగ్గదీశారు. ఆర్థికనేరాలను తీవ్రంగా పరిగణించాలని, ఆర్థికనేరాల వెనుక లోతైన మూలాలుంటాయని, వాటివల్ల ప్రజాధనానికి ముప్పువాటిల్లుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థికనేరాలు పెనుముప్పుగా పరిణమించాయని, ఆర్థికనేరగాళ్లను శిక్షించకపోతే సమాజం నష్టపోతుందని, 2013లో సుప్రీంకోర్టు జగన్‌ కేసుల్లో చేసిన వ్యాఖ్యానాలు ఆయనకు తెలియవా అని రామయ్య ప్రశ్నించారు. కోర్టుహాజరు నుంచి తనకు మినహాయిం పు కావాలంటున్న జగన్మోహన్‌రెడ్డి, తనపై ఉన్నకేసుల విచారణను వేగవంతం చేయాలని , రూ.43వేలకోట్ల ప్రజాధనాన్ని కొట్టేశానని వస్తున్న ఆరోపణలపై త్వరగా స్పష్టత ఇవ్వాలని కోర్టులను ఎందుకు కోరడం లేదన్నారు. సీబీఐ వేసిన 11ఛార్జ్‌షీట్లు, ఈడీ వేసిన 5ఛార్జ్‌ షీట్లపై త్వరగా విచారణజరపమని జగన్‌ ఎందుకు కోర్టులను కోరడంలేదో, దానిపై బాధ్యతగల ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలకు ఎందుకు వివరణ ఇవ్వడం లేదో ఆయన సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కోర్టులనుంచి మినహాయింపుకోరుతున్న జగన్‌, ప్రజల తరుపున పోరాటం చేస్తున్న టీడీపీనేతలపై కేసులుఎలా పెట్టిస్తున్నాడో సమాధానం చెప్పాల ని, ఇదెక్కడి న్యాయమో ప్రభుత్వాధినేతే సమాధానం చెప్పాలన్నారు.

Advertisements

Latest Articles

Most Read