మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్ గారు, గతంలో మీడియా సాక్షిగా చెప్పిన మాటలు, అసెంబ్లీ సాక్షిగా చెప్పినా మాటలు, పాదయాత్ర సాక్షిగా చెప్పిన మాటలు మర్చిపోయి, అమరావతి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. హిందూస్తాన్ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతి పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, అమరావతి కోసం 30 వేల ఎకరాలు అవసరం లేదని, 500 ఎకరాలు చాలని అన్నారు. అంతే కాదు అమరావతి సెల్ఫ్ ఫైనాన్సు సిటీ కాదని, దాని కోసం లక్ష కోట్లు ఖర్చు అవుతాయని, అంత డబ్బు అప్పు తెచ్చి ఆ సిటీ కడితే, అసలు కాదు కానీ, అసలు వడ్డీనే కట్టలేం అంటూ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ పెద్ద సిటీల వల్ల లాభం లేదని అన్నారు. ఉదాహరణకు విశాఖపట్నం చిన్న పట్టణంగా ఉన్నప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందని, ఇప్పుడు విశాఖ ఎదిగిన సిటీ అని అన్నారు. కరోనా అనుభవం తెలిసింది ఏంటి అంటే, పెద్ద సిటీలు బలహీన పడ్డాయని అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో టాప్ 10 డెవలప్ అయిన దేశాలు తీసుకుంటే, వారికి అసలు మెగా సిటీలు లేవని అన్నారు. పెద్ద సిటీలు ఎక్కువ ఇన్కమ్ తెస్తాయి అనేది తప్పు అని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ సిటీలు ఎక్కడా డెవలప్ కాలేదని అన్నారు. అమరావతి కట్టటానికి డబ్బులు లేవని అన్నారు. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామని అన్నారు.

అయితే ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పిన మాటలను, ఈ మాటలను పోల్చి చేసిన అమరావతి ప్రజలు, జగన్ గారు మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే మాట అబద్ధం అని అన్నారు. జగన్ గారు మాట తప్పారు, మడమ తిప్పారని అంటున్నారు. ఇప్పుడు రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు అంటున్న జగన్ గారు, అసెంబ్లీ సాక్షిగా రాజధాని అంటే, 30 వేల ఎకరాలు ఉండాలని ఎందుకు చెప్పారని, ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అసలు పెద్ద సిటీలు అవసరం లేదని అని చెప్పిన జగన్ గారు, 2014 మ్యానిఫెస్టోలో, మనకు ఒక పెద్ద నగరం కావాలి, ఆ రాజధాని నేను కడతాను అని ప్రణాలికాలు ఎందుకు రచించారు అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద సిటీలు నుంచి ఆదాయం రాదు అని ఇప్పుడు చెప్తున్న జగన్ గారు, గతంలో హైదరాబాద్ లాంటి ఆదాయం వచ్చే రాష్ట్రం మనకు పోయింది, మనకు అలాంటి ఆదాయం ఇచ్చే రాజధాని కావాలి అని ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తున్నారు. మూడు రాజధానులు మంచిది అని ఇప్పుడు చెప్తున్న జగన్ గారు, గతంలో రాజధాని అమరావతి మధ్యలో ఉండాలి, నీళ్ళు ఉండాలి, 30 వేల ఎకరాలు భూమి ఉండాలి, అప్పుడే అది రాజధాని అని ఎందుకు చెప్పారని ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో, ఒక సంక్షేమ కార్యక్రమంగా, గత కొంత కాలంగా వితంతువులకు పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం, కొంత మందికి వితంతు పెన్షన్లు నిలిపివేయటం పై, కొంత మంది హైకోర్టుని ఆశ్రయించారు. దీని పై హైకోర్టులో దాదాపుగా రెండు నెలల నుంచి కూడా, ఈ పిటీషన్ పై వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే వితంతు పెన్షన్లు ఆపటం పై, హైకోర్టు ఈ రోజు కీలక తీర్పుని చెప్పింది. వితంతు పెన్షన్లు నిలిపివేయటం పై, రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు సీరియస్ అయ్యింది. రాజకీయ కారణాలతోనే ఈ పెన్షన్లు నిలిపివేశారు అనే ఉద్దేశంతోనే హైకోర్టు ఉందని, వెంటనే ఆపేసిన వితంతు పెన్షన్లు పునరుద్దించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతే కాకుండా, ఎప్పటి నుంచి అయితే ఈ పెన్షన్లు ఆపేసారో అప్పటి నుంచి ఉన్న బకయాలుని కూడా ఇవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ కొనసాగించాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కొంత మంది వితంతువులు కాకపోయినా, పెన్షన్ కోసం వితంతువులుగా చెప్తున్నారు అంటూ, ప్రభుత్వం అఫిడవిట్ లో చెప్పిన విషయం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మన దేశంలో వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైనది అని, ఏ మహిళా కూడా భర్తా ఉన్నా కూడా, తమకు భర్తు లేదు, ఒంటరిగా జీవిస్తున్నాం అని చెప్పే అవకాసం ఏ మహిళాకు ఉండదు. ఒంటరి జీవితం ఎంత దుర్భాలంగా ఉంటుందో, ఆర్ధిక పరంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రతి ఒక్కరికీ తెలుసు, మన కళ్ళ ముందు ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు వారి ఆర్ధిక బాధలను తీరుస్తాయని, ప్రభుత్వం ఎన్నో అనవసరపు ఖర్చులు చేస్తుందని, గోదావరి పుష్కరాలకు, పండగలప్పుడు సరుకులకు ఎవరు ఖర్చు పెట్టమన్నారు ? భావనలకు ఖర్చు చేసి రంగులు ఎవరు వెయ్యమన్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక బద్రతా పెన్షన్లు ఇవ్వటం ఎవరూ కాదనరు, కానీ రాజకీయ కారణాలతో పెన్షన్లు ఆపటం మాత్రం, ఒప్పుకోం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఆ పెన్షన్లు ఇవ్వాలని ఆదేశించింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ రోజు విజయవాడలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే ఆయన హత్య కేసులో బెయిల్ పై బయటకు వచ్చారు. సౌమ్యుడు, వివాదరహితుడు అయిన కొల్లు రవీంద్రను ప్రభుత్వం కావాలనే కేసులో ఇరికించింది అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపోస్తుంది. ఈ నేపధ్యంలోనే నారా లోకేష్, కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్, రాష్ట్రంలో రాజా రెడి రాజ్యాంగం నడిపిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్న పనుల పై పోరాడే అందరి మీద, అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, వీటి పై ఎలాంటి చర్యలు ఉండవు కానీ, తెలుగుదేశం నేతల పై మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రవీంద్ర పై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసారని, ఒక ఉత్తరం రాస్తే అచ్చెన్నాయుడుని వేధించారని అన్నారు. ఆయన పై ఇప్పటికీ ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేదని అన్నారు.

ఇక ఇప్పటికీ తమ పై అనేక ఆరోపణలు చేస్తున్నారని, 16 నెలలు అయ్యిందని, ఒక్క అవినీతి తమ పై నిరూపించారా ? ఛాలెంజ్ చేస్తున్నా, తమ పై ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోండి అంటూ, సవాల్ విసిరారు. తండ్రిని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు దోచుకున్నారని, అధికారులని జైలు చుట్టూ తిప్పారని, ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవరినీ వదిలి పెట్టం అని, జగన్ మోహన్ రెడ్డికి, విర్రవీగుతున్న మంత్రులకు వడ్డీతో సహా చెల్లిస్తాం అని అన్నారు. కొడాలి నానికి ప్రస్టేషన్ ఎక్కువ అయ్యి, అందరి పైనా దుర్బాష లాడుతున్నారని, ప్రస్టేషన్ తగ్గించుకుంటే మంచిదని అన్నారు. ఇక అంతర్వేది ఘటన పై స్పందిస్తూ, ఒక మతం పై కావాలని దాడి చేస్తుంటే, ఈ ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జరుగుతున్న ఘటనల పై సిబిఐ ఎంక్వయిరీ చెయ్యాలని, అప్పుడే ఈ కుట్ర బయటకు వస్తుందని అన్నారు.

టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈ రోజు కొల్లు రవీంద్రను పరామర్శించిన తరువాత, మీడియాతో మాట్లాడుతూ, 40 మంది ఎమ్మెల్యేల పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన మాట్లాడుతూ, "మమ్మల్ని అకారణంగా ఇబ్బంది పెడుతున్న వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. తరువాత మర్చిపోతారులే, 2024వరకు మమ్మల్ని ఏమి చెయ్యలేరులే అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఆలోచించుకోండి. మా పై ఆధారాలు ఉంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏదో బురద చల్లుతాం, మీకు కడుక్కోండి అంటే కుదరదు. మీ అరాచకాల పై పోరాడతాం. సన్నబియ్యం ఇస్తాం ఇస్తాం అని ఊదరగొట్టి, ఇప్పుడు ఇవ్వలేకపోయాడు, ప్రజలు అడుగుతున్నారని ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అయిపోయి, కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నాడు. రైతులని తిడతాం, ప్రజలను తిడతాం, నాయకులని తిడతాం అంటే ఎందుకో అర్ధం కావటం లేదు. మంత్రులు అందరినీ ఎందుకో మరి, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఇళ్ళ పట్టాలు ఆపాం అని అంటున్నారు, అక్కడ ప్రజలు తమ భూములు లాక్కున్నారని కొన్ని చోట్ల కోర్టుకు వెళ్ళారు. నాలుగు అయిదు చోట్ల వెళ్ళారు, రాష్ట్రం అంతా వెళ్ళలేదు కదా ? కోర్టు ఆ నాలుగు అయిదు చోట్ల ఆపింది, రాష్ట్రం అంతా ఆపలేదు కదా, అక్కడ పేదలకు భూములు ఎందుకు పంచటం లేదు ? ఇళ్ళ స్థలాల స్కాంలో 40 మంది ఎమ్మెల్యే ఆధారాలతో దొరికారు, వీరందరూ జైలుకు వెళ్తున్నారు, రాసి పెట్టుకోండి, టైం అంతే, కచ్చితంగా వీళ్ళు జైలుకు వెళ్తారు."

"అంతర్వేది విషయం అనేది, ఇది ఒక విషయం కాదు. మతసామరస్యం ఉండాల్సిన చోట, ఏపిలో ఏమి జరుగుతుంది ? ఒక మతాన్ని టార్గెట్ చెయ్యటం లేదా ? నెల్లూరులో ఇలాగే ఒక రధం తగలబెడితే, ఒక పిచ్చి వాడు చేసాడు అని తేలికగా తీసేసారు, మరి ఈ రోజు ఎందుకు సమాధానం చెప్పటం లేదు ? ఈ రోజు గుడిలో విగ్రహాలు కూడా ధ్వంసం చేసే స్థాయికి వచ్చారు. అనేక జిల్లాలో ఇలాగే జరుగుతుంది. నిన్న గుంటూరులో ఒక అర్చకుడిని చితకబాదారు. అందుకే ఈ అంతర్వేది ఘటన పై సిబిఐ ఎంక్వయిరీ అడుగుతుంది. వెల్లంపల్లి ఒక చేతకాని మంత్రి. ఇవి వరుస ఘటనలు. నిన్న కూడా అక్కడకు వెళ్లి చంద్రబాబు అని మంత్రి అంటున్నాడు. వీరికి కలలో కూడా చంద్రబాబు గారే కనిపిస్తున్నారు. వీరికి వీరి నాయకుడు అయిన జగన్ రెడ్డి గుర్తుకు రావటం లేదు, ఎంత సేపు చంద్రబాబు నామ స్మరణ. ఒకసారి జరిగితే ఎదో ఆక్సిడెంట్ అనుకుంటారు, వరుస బెట్టి జరుగుతుంటే, చంద్రబాబు అంటారు. నువ్వు చేతైన వాడివి అయితే, జరుగుతున్న ఘటనల పై ఆక్షన్ తీసుకోండి." అని నారా లోకేష్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read