ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంలోని రాజకీయ పెద్దలే కాదు, ఈ ప్రభుత్వంలో పని చేస్తున్న ఆఫీసర్లు కూడా విమర్శ తట్టుకోలేక పోతున్నారని, తెలుగుదేశం పార్టీ ప్రాధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. గతంలో మాస్కు అడిగిన దళిత మేధావి, డాక్టర్ సుధాకర్ ని, వేధింపులకు గురి చేసి, చివరకు పిచ్చోడిని చేసారని, ఆయన విధుల్లో పాల్గునటానికి మాస్కు అడగటమే పాపమా ? అని ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా అకారణంగా తమ పై నిందలు వేస్తున్నారని, తాము ఎంతో కష్టపడుతున్నా తమ పై నిందలు ఎందుకు వేస్తున్నారు అని, ఒక గిరిజన వైద్యాధికారి సోమ్లా నాయక్‌ ప్రశ్నించినందుకు, ఆయన్ను అరెస్ట్ చెయ్యమని కలెక్టర్ ఆదేశించటం దారుణం అని అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోజరుగుతున్న సమీక్షలో, అందరి ముందు సోమ్లా నాయక్‌ ను కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా, ఆయన్ను అరెస్ట్ చేయ్యండి అంటూ, పోలీసులని ఆదేశించటం పై, లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రశ్నిస్తే తట్టుకోలేరా ? ఏమిటి ఈ దౌర్జన్యం అని నిలదీశారు. ఒక పక్క వైసీపీ నాయకులు వైరస్ వ్యాప్తి చేస్తుంటే, ప్రాణాలకు తెగించి పోరాడుతున్న డాక్టర్లు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.

ఈ రోజు నరసరావుపేటలో కలెక్టర్ సమక్షంలో సమీక్షా సమావేశం జరిగింది ఈ సందర్భంగా, వైద్య సబ్బంది తీరు పై, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీని పై అభ్యంతరం చెప్తూ, నాదెండ్ల వైద్యాధికారి సోమ్లా నాయక్‌ తన నిరసన తెలియచేసారు. తాము ప్రాణాలకు తెగించి, కష్ట కాలంలో పని చేస్తుంటే, మమల్ని కించ పరుస్తారా అని ప్రశ్నించారు. దీంతో గుంటూరు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హౌ డేర్ యు కాల్ మీ, హూ ఆర్ యు, అతన్ని అరెస్ట్ చెయ్యండి అంటూ, అక్కడ ఉన్న డీఎస్పీకి ఆదేశించారు. ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. దీని పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం స్పందించింది. కలెక్టర్ తీరుని ఖండించింది. ఏదైనా తప్పు ఉంటే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోండి కనీ, ఈ విధంగా అరెస్ట్ చెయ్యండి అంటూ బహిరంగంగా చెప్పటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. అరెస్ట్ ఆదేశాలు అమలు చేస్తే మాత్రం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతామని, ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తుంటే, మాకు ఇచ్చే బహుమతి ఇదా అని ప్రశ్నించారు.

ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో గేట్లాట జరుగుతోంది. సెక్రటేరియట్ నిర్మాణం మొదలు ఇప్పటి వరకు వాస్తు పేరుతో, భద్రతా కారణాల పేరుతో గేట్ల నిర్మాణం, మూత జరుగుతోంది. నెలన్నర క్రితమే వాస్తు పేరుతో మూడు గేట్లను మూసేసిన అధికారులు.. తాజాగా సచివాలయంలో ప్రధాన ద్వారాన్ని బుధవారం బంద్ చేసేశారు. అసెంబ్లీ గేటు -2ను కూడా మూసేశారు. ఆ రెండు గేట్లకు అడ్డంగా సిమెంట్ ఇటుకలతో శరవేగంగా గోడ నిర్మాణాన్ని చేపట్టారు. సచివాలయం, శాసనసభ అధికారులు, ఉద్యోగులు ఉదయం విధులకు వెళ్లే సమయంలో యథావిధిగానే ఉన్న ద్వారాలు ఆ తర్వాత కొద్ది సేపటికే మూతపడ్డాయి. విధులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్లే సమయంలో గేట్లకు అడ్డంగా ఇటుకలతో గోడలు నిర్మిస్తుండటాన్ని చూసిన అధికారులు, ఉద్యోగులు ఇదేం చిత్రమబ్బా అంటూ విస్తుపోయారు. వెలగపూడి సచివాలయం వాస్తు బాగోలేదని ఇటీవలే మూడు గేట్లను అధికారులు మూసేశారు. రెండు గేట్లకు ఏకంగా అడ్డుగా గోడ నిర్మాణం చేపట్టగా, ఒక గేటును పూర్తిగా వినియోగించడం మానేశారు. ఇప్పటి వరకు సచివాలయంలోకి వెళ్లేందుకు వైఎస్ జగన్ వినియోగించే గేటునే పూర్తిగా మూసేశారు.

శాసనసభకు వెళ్లే సమయంలో జగన్ ఉపయోగించే గేటును మూసేసిన అధికారులు, దానికి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం అటు సచివాలయానికి, ఇటు అసెంబ్లీకి ఒక్కో గేటు మాత్రమే మిగిలాయి. అసెంబ్లీ, సచివాలయం మధ్యన అంతర్గతంగా ఉన్న గేటును కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని విశాఖపట్నం తరలించాలని జగన్ గట్టి పట్టుదలతో ఉండగా, రెండు రోజుల క్రితం కొడాలి నాని శాసనరాజధాని కూడా ఎందుకంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం సృష్టించగా, మరుసటి రోజునే సచివాలయం, అసెంబ్లీ గేట్లకు అడ్డంగా గోడల నిర్మాణం చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. జగన్ రాజధాని మొత్తాన్ని విశాఖ తరలించేందుకే కుట్ర పన్నుతున్నారని, ఆ పన్నాగంలో భాగంగానే గేట్లాటకు తెరలేపారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యానే గేట్లను మూస్తున్నట్లు సీనియర్ అధికారులు చెబుతుండగా, సచివాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే గేట్లను మూసేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

సచివాలయం, అసెంబ్లీ గేట్లను మూసేయడం వెనుక అమరావతి ఉద్యమం సెగ ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి ఆ ప్రాంత రైతులు ఉద్యమం ప్రారంభించారు. జనవరిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజధాని పరిరక్షణ సమితి చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఆ సమయంలో రైతులు, మహిళలు, రాజకీయ నాయకులు సీఎం బ్లాక్ కు వెళ్లే గేటు నంబరు వన్ వరకు చొచ్చుకొచ్చారు. ఆ ఘటనపై సాక్షాత్తు ఏపీ డీజీపీ సైతం సీరియస్ అయ్యారు. ఉద్యమం చేస్తున్న రైతులు, మహిళలను అడ్డుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారు. వారిని అడ్డుకునే మార్గాలు లేకపోవడంతో పోలీసులు ప్రభుత్వ పెద్దలు, అధికారుల తిట్లు తినాల్సి వచ్చింది. సచివాలయం ఐదు గేట్లలో నాలుగింటిని మూసేయడంతో అందరూ ఒకే గేటు నుంచి లోపలకు ప్రవేశించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఇతర వీవీఐపీలు సెక్రటేరియటకు వచ్చి వెళ్లే సమయంలో విజిటర్స్ తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దీని పై ఒక చట్టం ఉన్నా, అగ్రిమెంట్ ఉన్నా, రైతులను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్తూ, కొంత మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించారు. దోనే సాంబశివరావు అనే వ్యక్తి, అమరావతి రాజధాని అంశంలో కేంద్రానికి కూడా సంబంధం ఉందని, విభజన చట్టంలో, ఒక రాజధాని అని స్పష్టంగా ఉందని, దాని ఆధారంగా కేంద్రం ఈ విషయం పై స్పందించాలని కోరుతూ, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై ఈ రోజు కేంద్రం హోం శాఖ కౌంటర్ దాఖలు చేసింది. విభజన చట్టంలో, కేంద్రం రాజధానికి ఆర్ధిక సహాయం చేస్తుందని మాత్రమే ఉందని, ఒక రాజధాని ఉండాలా, మూడు రాజధానులు ఉండాలా అనేది, రాష్ట్రాల నిర్ణయం అని, మేము అందులో జోక్యం చేసుకోమని అన్నారు. రాజధానుల ఎంపిక విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని, కేంద్రం హోం శాఖ స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం, మూడు రాజధానులు తప్పు లేదని, అది రాష్ట్రాల ఇష్టం అని కేంద్రం చెప్పింది.

అయితే కేంద్రం ఏదో చేస్తుందని నమ్ముతున్న అమరావతి రైతులకు, ఈ రోజు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ తో మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇక బీజేపీ అమరావతి విషయంలో ఏమి చెయ్యలేదని అర్ధం అయిపోయింది. ఇక చట్టాలు, న్యాయాలు ప్రకారం, కోర్టులు ఇచ్చే తీర్పుల పైనే రాజధాని ప్రాంత రైతులు ఆశలు పెట్టుకున్నారు. గతంలోనే కేంద్రం ఇదే విషయం పై, విభజన చట్టానికి చెందిన అఫిడవిట్ ఇచ్చిన టైంలో, ఈ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని చెప్పింది. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, హైకోర్టులో వాదనల సమయంలో, రాష్ట్రపతి నోటిఫై చేస్తే, మీరు ఎలా మారుస్తారు అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలతో, హైకోర్టు మారదు అనే ధీమాతో ఉంటే, దీని పై కూడా కేంద్రం స్పందిస్తూ, హైకోర్టు కూడా మా పరిధిలో లేదు, హైకోర్టు రాజధానిలోనే ఉండాలని లేదు అంటూ, తన అఫిడవిట్ లో చెప్పింది. మొత్తానికి బీజేపీ ఏదో చేసేస్తుంది అనే వారికి, ఇక బీజేపీ ఏమి చెయ్యదు అనే క్లారిటీ వచ్చేసింది.

ప్రజా ప్రతినిధులుగా ఉన్న వారి కేసులని, ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి, ఏడాదిలోపు విచారణ చెయ్యాలనే సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు కావటం లేదు అంటూ, అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ అనే ఒక పౌరుడు, సుప్రీం కోర్టులో కేసు వేసారు. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టు, అమికస్‌ క్యూరీని నియమించింది. అమికస్‌ క్యూరీ అంటే కోర్టుకు సహాయకుడు. హన్సారియా అనే వ్యక్తిని అమికస్‌ క్యూరీగా నియమించింది. ఆయన దేశం మొత్తం నేరారోపణలు ఉండి, కేసులు ఉండి చట్ట సభల్లో ఉన్నవారి జాబితాను సుప్రీం కోర్టు ముందు పెట్టి, అనేక విషయాలు చెప్తూ, సలహాలు ఇస్తూ, కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం, దేశ వ్యాప్తంగా 4442 తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పై కేసులు ఉన్నాయి. ఇందులో, 2556 మంది ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల పై కేసులు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉత్తర ప్రదేశ్ లో అత్యధికులు ఉన్నారు ఇక మన రాష్ట్రానికి తీసుకుంటే, 106 మంది పై కేసులు ఉన్నాయి. ఆరుగురు సిట్టింగ్ ఎంపీలు, 79 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఏడుగురు మాజీ ఎంపీలు, 53 మంది మాజీ ఎమ్మెల్యేల కేసులు ఉన్నట్టు, సుప్రీం కోర్ట్ కు నివేదిక సమర్పింకాహారు.

ఇందులో చాలా మందికి 188 of IPC సెక్షన్ కింద కేసులు నమోదు అయ్యాయి. అంటే నేరం రుజువు అయితే, రెండేళ్ళ జైలు శిక్ష పడుతుంది. మరి కొంత మందికి 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడే అవకాసం ఉంది. కొన్ని కేసులు అయితే గత 10 ఏళ్ళు నుంచి పెండింగ్ లో ఉన్నాయని, సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇక ఈ అఫిడవిట్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో జస్టిస్ ఎన్.వి. రమణ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఆరోపణలు ఉన్న ప్రజాప్రతినిధుల పై వైఖరి చెప్పమంటూ, సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. ఆరోపణలు ఉన్న వారికి ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలన్న అంశంపై వైఖరి తెలపాలని నోటీసులు ఇచ్చింది. ఆరు వారల లోగా తమ అభిప్రాయం చెప్పాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చింది సుప్రీం కోర్టు. ఇదే జరిగితే, మన రాష్ట్రంలో చాలా పెద్ద తలకాయలు ఎన్నికల్లో పోటీకి లేకుండా ఆనర్హులు అవుతారు. అలాగే ఏడాది లోపు విచారణ అయిపోతే, ఎంతో మంది లోపలకు వెళ్తారు.

Advertisements

Latest Articles

Most Read