భూమిపై పనికిరాని వస్తువంటూ ఏమీ లేదు. ప్రతి వస్తువును ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పనికిరాని వ్యర్థాలను అర్థవంతమైన, ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చవచ్చు. సృజనాత్మకత, ఆలోచన ఉంటే చాలు తుక్కును కూడా ముక్కన వేలేసుకునేలా తీర్చిదిద్దవచ్చు. విజయవాడ నగరపాలక సంస్థలోని వెహికల్ డిపోలో నిరుపయోగంగా ఉన్న పాత ఇనుము పరికరాలు, తుక్క కళాకారుల చేతిలో అద్భుతమైన కళాఖండాలుగా మార్చారు. ఇనుప రేకులు ఈగ రెక్కలుగా, పాడైపోయిన ట్రాన్స్ఫార్మార్ గుర్రం శరీర భాగాలుగా, కారు డోర్ సీతాకోక చిలుక అందాలుగా.. బోరింగగ్ పంపు కడ్డీలు కొంగ కాళ్లుగా.. ఇలా ఆటోమొబైల్ స్క్రాప్ ద్వారా రూపొందించిన కళాకృతుల విజయవాడ నగర ప్రజలను కనువిందు చేస్తున్నాయి.

నగర పాలక సంస్థ కమీషనర్ దీని పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఆంధ్రాలోని వివిధ కళాకారులతో వీటిని తయారు చేయించారు. ఇనుముతో తయారు చేసిన వివిధ ఆకృతులు, భవానీ ద్వీపానికి వస్తున్న సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ప్రస్తుతం విజయవాడలోని ప్రధాన కూడళ్ళు అయిన మధు చౌక్, పాత బస్సు స్టాండ్ ప్రాంతాల్లో ఇవి ఉంచారు.

scrap park vijayawada 14042017 4

scrap park vijayawada 14042017 5

scrap park vijayawada 14042017 6

scrap park vijayawada 14042017 7

గన్నవరం విమానశ్రయంలో త్వరలో దుర్గగుడి నమూనా రాజగోపురాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దుర్గగుడి రాజగోపురం నమూనా మోడల్ తయారు చేసి సియం దృష్టికి తీసుకువెళ్లి అనుమతులిచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దుర్గగుడి ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఇప్పటికే ఒక నమూనా తయారు చేసినట్లు తెలిసింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ ని జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, దుర్గగుడి బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేందుకు ఎయిర్ పోర్ట్ లో అమ్మవారి రాజగోపుర నమూనను ఏర్పాటు చేయనున్నారు.

అనుకోని అతిధి ఇంటికి వస్తే... ఆ అతిధి మన ఇష్టమైన నాయకుడైతే... ఆ అతిధే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే.... ఆ టైంలో పక్కన సెక్యూరిటీ సిబ్బంది కూడా లేకపోతే... ఆ క్షణంలో, ఆశ్చర్యం, ఆనందంతో, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు... సరిగ్గా ఇదే సంఘటన నిన్న విజయవాడ పటమటలో జరిగింది.

ఏపీఎస్టీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు కుమారుడు, కోడలును ఆశీర్వదించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు పటమటలంక వచ్చారు. వారిని అశీర్వదించిన అనంతరం ఆయన బయటకు వచ్చేస్తుంటే సీఎం వెళ్లిపోతున్నారేమోనని, సెక్యూరిటీ సిబ్బంది అంతా కార్లు ఎక్కేశారు. అయితే సీఎం మాత్రం కారు ఎక్కలేదు. పక్కనే ఉన్న స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీని పిలిచి పద మీ ఇంటికి వెళ్లాం, అని భుజం మీద చేయి వేసి పటమటంలక జాస్తి వారి వీధిలో కాలినడకన బయల్దేరారు. సీఎం వీధిలో నడుచకుంటూ రావడం చూసిన స్థానికులు సంతోషంతో ఇళ్లలోకి బయటకు వచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించారు.

చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న గాంధీ కుటుంబ సభ్యులు వరండాలో కుర్చీలు వేసి, ఆత్మీయ స్వాగతం పలికారు. తాటాకు ఇంటిని చూసి, ఏంటి ఈ ఇంటిలోనేని ఉండేదని గాంధీని ప్రశ్నించారు. వరండాలో వేసిన కుర్చీలో కూర్చొన్న సీఎం కుటంబసభ్యులందరినీ పేరు, పేరునా పరిచయం చేసుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకే చోట కలిసి ఉండటాన్ని అభినందించారు. కుటంబ పరిస్థితులను నేపధ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువులు గురించి వాకబు చేశారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేసేవారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. చెన్నపాటి గాంధీ, ఆయన అన్నదమ్ముల కుటుంబ సభ్యులతో కలిసి పొటోలు దిగారు.

అనుకోని అతిధిగా సీఎం తమ వీధిలోకి రావడంతో, చంద్రబాబును దగ్గరుండి చూసేందుకు చిన్నారులు పరుగులు తీశారు. తమ ఇళ్లల్లో చెట్టుకున్న పూలు కోసి ఇచ్చారు. పిల్లలందరితో కరచాలనం చేసి, ఏం చదువుకుంటున్నావు.? మీ ఇళ్లు ఎక్కడ.? మీరు ఏం చేస్తున్నారు.? మీ పాఠశాల ఎక్కడ.? బాగుందా..? మీ నాన్నగారు ఏంచేస్తారు? ఎంతమంది మీరు.? ఇలా అన్నీ అడిగి తెలుసుకున్నారు. అందరూ బాగా చదువుకోవాలని సూచించారు. భద్రతా సిబ్బంది అడుగోడ కూడా లేకపోవడంతో వారు స్వేచ్చగా సీఎంతో ముచ్చటించారు. వారిని అభివాదం చేసి, కారు ఎక్కి వెళ్లిపోయారు.

బందరు.. ఈ పేరు వినగానే చటుక్కన గుర్తిచ్చేది లడ్డు... పుట్టినరోజు, శుభకార్యాలు, పెళ్లిళ్లు, పేరంటాలకు ఇది తప్పనిసరి. 77 ఏళ్ల చరిత్ర కలిగి ప్రత్యేక రుచిని సంతరించుకున్న బందరు లడ్డుకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ - జీఐ ధ్రువీకరణ పత్రం లభించింది.

బందరుకు మొదటిసారి ఎవరైనా వస్తే బందరు లడ్డును కొనుక్కొని తీసువెళ్లారంటే దాని ప్రత్యేకత ఇట్టే తెలిసిపోతుంది. స్వాతంత్ర్యం రాక పూర్వం నుంచే ఈ లడ్డు ఎంతో ఖ్యాతి వహించింది. తెలుగు ప్రజలు నివసించే ప్రాంతమేదైనా బందరు మిఠాయి దుకాణం అన్న పేరుతో కనిపిస్తుంటాయి. క్రమేపీ ఆ రుచి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీ సుల్తానుల కాలంలో మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దున ఉండే బుందేల్ఖండ్ నుంచి మచిలీపట్నం వలస వచ్చిన బొందిలీలు ఈ తొక్కుడు లడ్డు తయారీ ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా వలసవచ్చిన వారిలో బొందిలి రాంసింగ్ కుటుంబం తాయారు చేసిన ఈ లడ్డు ప్రపంచఖ్యాతిని పొందింది. వారు యుద్ధంలో ఉపయోగించే కత్తితో డాలును పొడుస్తు ఉండగా పలు రంద్రాలు ఏర్పడ్డాయి. దీంతో వారికి ఆలోచన తట్టి ఆ రంద్రాల్లోంచి పిండి పోసి మొదటి సన్నపూస తయారు చేశారు. ఆ తరువాత పూసను బెల్లంపాకంతో కలిపి తొక్కి లడ్డు రూపొందించారని పలువురు తయారీదారులు చెబుతుంటారు. అలా ప్రారంభమయి పట్టణం అంతటా విస్తరించింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికే ఈ తయారీ పరిశ్రమ విస్తృతమయింది.

కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ లడ్డు తయారీ ద్వారా 250 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. పట్టణ వ్యాప్తంగా 125 నుంచి 150 దుకాణాల వరకు ఉంటాయి. మచిలీపట్నంతో పాటు పెడన గుడివాడ, విజయవాడలో దుకాణాలు వ్యాపించాయి. వాటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు.

తయారీ విధానం:
బందరు లడ్డుతో పాటు ఇతర మిరాయిల్లోనూ బెల్లం మాత్రమే వినియోగించడం ఇక్కడి ప్రత్యేకత, ప్రతి మిఠాయి వంటకంలోనూ బెల్లాన్ని మాత్రమే వినియోగిస్తారు. కాలానుగుణంగా వస్తున్న మార్పులతో యాంత్రీకరణ అనివార్యంగా మారుతోంది. ఇప్పటికీ లడ్డులను చేతితో మాత్రమే తయారీ చేస్తారు. శనగ పిండి, బెల్లం, నెయ్యి మిశ్రమాలను వినియోగిస్తారు. శనగ పిండి, నీరు కలిపి మద్దగా చేసి దాని నుంచి పూస తయారు చేస్తారు. పూసను బెల్లం పాకంతో కలిపి రోటిలో వేసి రోకలితో తొక్కుతారు. అనంతరం లడ్డు తయారీ చేస్తారు.

ఇంజినీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు, ఓ వినూత్న కార్యక్రమంతో కృష్ణా జిల్లా ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం ముందుకువచ్చింది. ఇప్పటి వరకూ ఎవరికి వారు సొంతంగా ఆయా కళాశాలల్లోని విద్యార్థుల కోసం జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకునేవారు. దీని వల్ల అక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే అవకాశాలు అందేవి. ఈ విధానం వల్ల ఇంజినీరింగ్ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూరడం లేదు. కంపెనీలకు సైతం అనుకున్న సంఖ్యలో అభ్యర్థులు దొరక్కపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కళాశాలల్లో ఎవరికి వారు వేర్వేరుగా కాకుండా అందరికీ కలిపి ఒకే వేదికను ఏర్పాటు చేసి విద్యార్ధులు, కంపెనీలకు ప్రయోజనకరంగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ కళాశాలల యాజామాన్య సంఘం ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి వేదికను విజయవాడలోని లయోలా కళాశాల దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్ క్లబ్ లో "జాబ్ ఫెయిర్ 2017" పేరుతో ఏప్రిల్ 10న ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్, టాటా, పొలారిస్, వంటి ప్రధాన కంపెనీలు 25 వరకూ ఈ జాబ్ ఫెయిర్లో పాల్గొంటున్నాయి. ఎలాంటి సభ్యత్వ రుసుం చెల్లించాల్సిన పనిలేకుండా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని విద్యార్ధులు జాబ్ ఫెయిర్లో పాల్గొనొచ్చని నిర్వాహకులు సూచించారు.

10వ తేదీన ఉదయం రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జాబ్ ఫెయిర్ ప్రారంభించనున్నారు. రాజధానిగా మారిన నేపథ్యంలో విజయవాడకు ప్రాధాన్యం పెరిగింది. కొత్త కంపెనీలు ఇక్కడ తమ శాఖలను నెలకొల్పుతున్నాయి. వాటన్నిటిలోనూ అవకాశాలు ఉంటున్నాయి. ఈ జాబ్ ఫెయిర్ లో, ఫ్రేషేర్స్ మాత్రమే కాకుండా, అందరికీ అవకాశం ఉంటుంది.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read