ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగువారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శివం అంటే చైతన్యమని, శివుడి నుంచే యోగ సంప్రదాయం వచ్చిందని తరతరాల విశ్వసమని గుర్తు చేశారు. శివతత్వం అనుసరణీయమని చంద్రబాబు అన్నారు. అభిషేకప్రియుడైన శివుడు ఆది దేవుడని, కోరిన వరాలిచ్చే బోళాశంకరుడని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రంలోని శక్తిపీఠాలు, పంచారామాలు, భక్తుల హర హర మహాదేవ ఘోషలతో మారుమోగే రోజు మహాశివరాత్రి అని చంద్రబాబు చెప్పారు. శివుడు లింగాకారంలో ఉద్భవించిన రోజు శివరాత్రి అని, లోక కల్యాణం కోసం గరళకంఠుణ్ణి ఆనందంగా ఉంచేందుకు భక్తులు జాగరూకులై జాగరణతో పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. ఉక్కు కర్మాగారం విశాఖపట్నంలోనే స్థాపించాలని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేసిన తరువాత కేంద్రం స్పందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావడం జరిగింది.

విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకోసం అప్పటి విశాఖ ఎంపీ తెన్నేటి విశ్వనాధం నేతృత్వంలో సాగిన ఉద్యమం 1966లో కీలక మలుపు తిరిగింది. ఆంధ్రా విశ్వ విద్యాలయం విద్యార్ధులు భారీగా ఆందోళనల్లో పాల్గొన్నారు. పోస్టాఫీసు, ఏవీఏన్ కాలేజీ డౌన్ వద్ద, జగదాంబ ధియేటర్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో 12 మంది విద్యార్ధులు, రిక్షా కార్మికులు మరణించారు. ఈ కాల్పులకు నిరసనగా హైదరాబాదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తి వందలాది మంది అరెస్టులకు దారితీసాయి. వరంగల్, ఆముదాలవలస, విజయనగరంలో కూడా కాల్పులు చోటుచేసుకుని పదులకొద్దీ ఉద్యమకారులు తుపాకీ గుళ్ళకు బలయ్యారు. ఉద్యమం పతాకస్థాయికి చేరడంతో కేంద్ర ప్రభుత్వం విశాఖలో ఉక్కు కర్మాగారం నెలకొల్పుతున్నట్టు 1970 ఏప్రిల్ 10న పార్లమెంట్ లో ప్రకటించింది.

ఈ ప్లాంట్ ఏర్పాటుకు 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు.1982 ఫిబ్రవరి 18న విశాఖ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది. నాటి నుంచి నేటి వరకు విశాఖ ఉక్కు ప్యాక్టరీ మూడున్నర దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శనివారం 35వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 18,000ల పైచలకు శాశ్వత కార్మిక ఉద్యోగస్తులకు ,20,000ల పైచలకు ఒప్పంద కార్మికులకు ఉపధి కల్పిస్తూ 35 వసంతాలు పూర్తిచెసుకుంది.

ఎన్నో అంచనాలతో ప్రారంభమైన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రారంభంలోనే అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంది. కర్మాగారం నిర్మాణం ఆలస్యం కావడంతో వ్యయం పెరిగి అప్పలు కూడా పెరిగిపోయాయి. వడ్డీ భారంతో 1998వ సంత్సరానికి స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లో సీల్లుప్లాంటు యూజమాన్యం, అధికారులు, కార్మికులు సమిష్టిగా పనిచేసి, ఉత్పత్తిని పెంచి, ప్రభుత్వ సహకారం కూడా కొంత తోడవ్వడంతో తక్కువ కాలంలోనే లాభాల బాట పట్టించారు.

1972లో శంకుస్థాపన చేయబడిన విశాఖ స్టీల్ ప్లాంట్ 1982 ఫిబ్రవరి 18 వరకూ స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఆధ్వర్యంలో ఉండేది. భారత ప్రభుత్వం 1982 ఫిబ్రవరి 18న "రాష్ట్రీయ ఇస్సాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)గా ఏర్పాటు చేసింది. ఆనాటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారం స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థగా కొనసాగుతోంది.

విశాఖ ఉక్కు కర్మాగారం 2001 నుంచి ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ అప్పులను తీర్చుకుంటూ లాభాల బాటలో పయనిస్తూ దేశీయ పారిశ్రామిక యవనికపై గర్వంగా నిలబడింది. మూడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కర్మాగారం అన్నిరకాల విస్తరణ పనులు పూర్తి చేసుకుని 6.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా పరుగెడుతోంది. సీల్ మెల్ట్ షాపు సెంటర్ ప్లాంట్, బ్లాన్స్ ఫర్నెస్ తదితర విభాగాలు ప్రారంభమై రెండో దశ ఉత్పత్తి ఊపందుకుంది.

2025 నాటికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడమే లక్ష్యంగా వీరు ముందుకు సాగుతున్నారు.

కృష్ణా గోదావరి సంగమ తరంగాల నడుమ, సర్వ వాద్య స్వర తరంగాలు అమరావతి వాసులను అలరించాయి. జాతీయ, అంతర్జాతీయ కళాకారుల లయ విన్యాసాలు, పవిత్ర సంగమంలో ప్రేక్షకులను మెప్పించాయి.

ముందుగా డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు పంచరాగ, పంచనంద ప్రక్రియలో మృదంగ విన్యాసాన్ని పవిత్ర సంగమం వేదికపై ఎల్లా వెంకటేశ్వరరావు శృతిపర్వంగా అందించారు. పెద్ద ఎత్తున పవిత్ర సంగమం వద్ద చేరుకున్న ప్రజలు ఎల్లా మృదంగ విన్యాసానికి జేజేలు పలికారు. భారతీయ పురాతన లయ వాయిద్యాలలో ఒకటైన మృదంగ వాయిద్యంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఎల్లా వెంకటేశ్వరరావు కీర్తిపొందారు. శాస్త్రీయ సంగీత కళాకారులుగా. 36 గంటల పాటు నిర్విరామంగా మృదంగ వాద్య ప్రదర్శన చేసి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్పులో స్థానాన్ని పొందిన ఘనత వహించారు.

తీన్ తాల్ రిథమ్ లో తబలా విన్యాసంలో అనిందో చటర్జీ అందించిన లయ విన్యాసం పవిత్ర సంగమం వేదిక వద్ద ఆహుతులను అలరించింది. ఆ తర్వాత అంతర్జాతీయ సంగీత నృత్యోత్సవ వేదికపైనా తన ప్రదర్శన కొనసాగించారు. ప్రకృతి పరవళ్లను తన మృదంగం ద్వారా లయబద్ధం చేశారు. వర్షం ఏ విధంగా ఒక్క పెట్టున వస్తుందన్నది ఆ తర్వాత ఎలా మామూలు వాతావరణం ఉంటుందన్నది తన వాయిద్యం ద్వారా ఆలపించారు. రోడ్డుపై కార్లు ఎలా వెళ్లాయి. ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందన్న నేపధ్యాన్ని వివరించారు. దేవునికి పూజ ఏవిధంగా చేస్తామన్నది కూడా తబల ద్వారా స్వరబద్ధం చేశారు. పండిట్ అనిందో చటర్జీ తబలా విన్యాసంలో జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అనింది చటర్జీ పారోఖూబాద్ ఘరానాకు చెందిన ప్రఖ్యాత తబలా విద్వాంసులు. తబలా వాయిద్యంలో చేరగని ముద్ర వేశారు.

గణపతి తాళంలో విఘ్నశ్వరుడు ఎలాంటి ఆహర్యాన్ని ప్రదర్శిస్తారన్నదాని పై వికు వినాయక్ రామ్, స్వామినాథన్ లయబద్ధంగా ఘటం పై స్వరపరిచారు. గణేష్ ఎలా నడచివస్తాడు. ఎలా మహిమలు ప్రదర్శిస్తాడన్నది దృశ్యరూపం చేశారు. సుందర గణపతి. జైజై గణపతి.సురసుర గణపతి దివ్య నమస్తే అంటూ స్వామినాథన్ ఆలపించారు. 74 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకునిలా వికు వినాయక్ రామ్ ఘటంపై చేసిన వాయిద్య విన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ఆడియన్స్ అందరితోనూ చప్పళ్లతో ఘటానికి సమాంతరంగా చేసిన విన్యాసానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. హాజరైనవారందరూ చప్పళ్లతో వికూ ఘట వాయిద్యాన్ని ఫాలో అయ్యారు. ఆ తర్వాత స్వామినాథన్ ట్రెయిన్ ఎలా వెళ్తుందన్నదానిని రిథమ్ చేసి చూపించారు. ట్రెయిన్ ఎలా పికప్ నుంచి స్పీడ్ గా ఎలా వెళ్తుంది. బ్రిడ్డి మీద ఎలా వెళ్తుందీ. వివరించారు. భార్యభార్తల మధ్య గొడవ ఎలా ఉంటుందన్నదాని పై రెండు సౌండ్లతో స్వామినాథన్ రిథమ్ చేశారు. ఎలా మొదలై. ఎలా పతాకస్థాయికి చేరుతుందని. చివరికి భార్య గెలుస్తుందని తెలిపారు. పుట్టినరోజు పాటను సైతం రిథమ్ చేశారు. దూరం నుంచి హలికాప్టర్ దగ్గరకు వచ్చే సరికి ఎలా సౌండ్ వస్తుంద్నది చేసి చూపించారు. తాత, మనమడు చివరగా గురువందనం చేసి కర్ణాటక సంగీతం మధురానుభూతిని ప్రేకకులకు విన్పించారు.

ముగ్గురు విదేశీ కళాకారులతో కలిసి త్రిలోక్ గుర్తు ప్రదర్శనచేశారు. కీబోర్డ్, గీటార్, ట్రంపెట్ తోపాటు, డ్రమ్స్ పై త్రిలోక్ గుర్తు చేసిన ఫీట్లకు ప్రేకకుల తన్మయత్వం చెందారు. జాజ్ సంగీతానికి, తబలా విన్యాసాన్ని జోడించి త్రిలోక్ గుర్తు చేసిన ప్రదర్శన ఆకట్టుకొంది. పంచధాతువులైన ఆకాశం, గాలి, నీరు, నేల, నిప్పు చేసే సౌండ్లను త్రిలోక్ గుర్తు విన్పించిన తీరు ప్రేక్షకులను నయనానందభరితులను చేసింది. వాట్ టు డూ అంటూనే. పాప్ కార్న్ బీట్ అందించారు. త్రిలోక్ గుర్తు ప్రపంచంలో తమకంటూ, ప్రత్యేకమైన మరియు వినూత్నమైన స్థానాన్ని పొందిన డ్రమ్స్ కళాకారులు. త్రిలోక్ గుర్తు జాజ్, జాజ్ ఫ్యూజన్, వరల్డ్ మ్యూజిక్ లో డ్రమ్స్, తబలాలను ఉపయోగించి అద్భుతాలు సృష్టిస్తారు. ప్రపంచ ప్రసిద్ద చెందిన జాన్ మెక్ లాగ్లిన్, ఎంట్రో, ఓర్లియన్ తోపాటు పలువురు కళాకారులతో కలిసి అంతర్జాతీయ ప్రదర్శనలు అందించారు.

శివమణి - త్రిలోక్ గుర్తు లయ విన్యాసం
త్రిలోక్ గుర్తు శివమణికి స్వాగతం పలకడంతో ఒక్కసారిగా స్టేజ్ కొత్త సౌండ్లతో మార్మోగింది. అప్పటి వరకు ఉన్న ధ్వని ఒక్కసారిగా రెట్టింపయ్యిందా అన్పించింది. డ్రమ్ స్టిక్స్ ను చేతుల్లోంచి వదులుతూ పట్టుకుంటూ శివమణి తన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. శివమణి డ్రమ్స్ విన్యాసానికి త్రిలోక్ గుర్తు తకిటధమ్ తకిటధమ్ ప్రేక్షకులను అలరించింది. వేదికపైకి వచ్చిన శివమణి అందరికీ నమస్కారమంటూ తెలుగులో పలకరించారు. గురుబ్రహ్మ..గురు విష్ణు. గురు మహేశ్వరతో డ్రమ్స్ ను రిథమ్ ప్రకారం వాయించాడు. శివమణి డ్రమ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. గుండెలు జలదరించేలా డ్రమ్స్ ధ్వని ప్రతిధ్వనించింది.

అంతర్జాతీయ సంగీత నృత్యోత్స వేదికను శివమణి ఉర్రూతలూగించాడు. ఆడిటోరియంలోకి ప్రవేశించిన దగ్గర్నుంచి ప్రదర్శన చివర వరకు ప్రేక్షకులను కట్టిపడేశాడు. లయబద్ధంగా సాగిన డ్రమ్స్ వాయిద్యానికి ప్రేకకుల నుంచి అదృత స్పందన లభించింది.

టీమిండియా రెండోసారి అంధుల టి20 క్రికెట్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.

అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, భారత జట్టుకు సారధ్యం వచించింది, ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి. భారత జట్టు రెండోసారి టి20 ప్రపంచకప్‌ సాధించడంలో ఆంధ్రప్రదేశ్‌ క్రికెటర్‌ అజయ్‌ కుమార్‌ రెడ్డి కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన అజయ్‌ మొత్తం 296 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో అజయ్‌ 9 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

గుంటూరు జిల్లా గురజాలకు చెందిన 26 ఏళ్ల అజయ్‌ కుమార్‌ రెడ్డి జట్టుకు భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన అజయ్‌, భారత జట్టు తరఫున క్రికెట్‌ ఆడటం వెనుక తల్లిదండ్రుల త్యాగం, భార్య ఇచ్చిన స్ఫూర్తి, పనిచేసే సంస్థ అందించిన సహకారం ఎంతగానో ఉన్నాయి అంటారు, అజయ్.

కళ్ళు ఎలా పోయాయి అంటే...
నాలుగేళ్ల వయసులో తెల్లారుజామున నిద్రలేచి వేగంగా బయటికి పరిగెడుతుంటే తలుపు గడియ మొన ఎడమ కంటికి గుచ్చుకుంది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ కన్ను కోడిగుడ్డంత వాచింది. చివరికి కన్ను పోయింది. ఒకటో తరగతిలో చివరి బెంచ నుంచీ బోర్డుపైన అక్షరాలు కుడికన్నుతో చూస్తే స్పష్టంగా కనిపించేవి. ఆరో తరగతికి వచ్చేసరికి మొదటి బెంచ్‌కు వచ్చినా బోర్డుపై ఉన్న అక్షరాలు పోల్చుకోలేనతంగా దృష్టి తగ్గిపోయింది. అదే సమయంలో అజయ్ అమ్మానాన్నలు నర్సరావుపేటకు మకాం మార్చారు. అక్కడే ఉన్న బ్లైండ్‌ స్కూల్‌లో ఏడో తరగతిలో అజయ్ ను చేర్పించారు. రెండేళ్ల తర్వాత స్కూల్‌లోని క్రికెట్‌ జట్టులో చేరాడు అజయ్. అప్పటి నుంచి, వెనక్కు తిరిగి చూడలేదు.

2006లో ఆంధ్రప్రదేశ్ టీంకు, 2010లో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు సెలెక్ట్‌ కావడం, 2012లో వైస్‌ కెప్టెన్‌, 2014లో టీం ఇండియా కెప్టెన్ అయ్యాడు అజయ్.

టి20 క్రికెట్‌ టోర్నమెంట్ లో, అజయ్తో పాటు, ఆంధ్రప్రదేశ్‌కే చెందిన దున్నా వెంకటేశ్వర రావు, టి. దుర్గా రావు (శ్రీకాకుళం), జి. ప్రేమ్‌ కుమార్‌ (కర్నూలు) కూడా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

మీ ప్రతిభ అమోఘం.. ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు.. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నారు... హాట్స్ అఫ్ అజయ్ & టీం...

ఆంధ్రప్రదేశ్ కు కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ నియమితులయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనాలేస్తున్నారు. ఏడాది క్రితం పుదుచ్చేరి లెఫ్ట్ నెంట్ గవర్నర్‌గా బేడీ నియమితులయ్యారు. అయితే అప్పట్నుంచి ఆమె పుదుచ్చేరి విషయంలో సంతృప్తికరంగా లేరు. ఆరేళ్ళ పదవీ కాలం ఉన్నప్పటికీ రెండేళ్ళు మాత్రమే పదవిలో కొనసాగుతానంటూ ఇటీవలె ఆమె రెండో పర్యాయం ప్రకటించారు. ఆ రాష్ట్ర పరిస్థితుల్లో పాటు అక్కడున్న వాతావరణం కూడా బేడీకి నచ్చడంలేదు.

ఇది ఇలా ఉంటే, కిరణ్‌ బేడీ చంద్రబాబు పరిపాలనా దక్షతతో ఆమె తరచూ ఆకర్షితురాలౌతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాప్తంగా ఆమె ఆంధ్రప్రదేశ్ ను గుర్తించారు. రాష్ట్రంలోని ప్రతి పరిణామాన్ని బేడీ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆమెకు పుదుచ్చేరి నుంచి ఆంధ్రప్రదేశ్ కు బదలీ కావాలన్న ఆకాంక్షుందన్న వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై చర్చించి చంద్రబాబు ఆసక్తిని అంచనా వేసేందుకే బేడీ విజయవాడ వచ్చినట్లు సమాచారం. వాస్తవానికి జాతీయ మహిళా పార్లమెంట్లో ఆమె శనివారం ప్రసంగించాల్పుంది. కానీ తన కార్యక్రమాన్ని ఓ రోజు ముందుకు జరిపించారు. తొలి రోజు శుక్రవారమే ఆమె ప్రసంగించేశారు. ఇందుకోసం గురువారం రాత్రే విజయవాడకు చేరుకున్నారు. విజయవాడలో చంద్రబాబు, కిరణ్ బేడీల మధ్య సమావేశం జరిగిందన్న వార్తలు గుప్పవుంటున్నాయి. దీని సారాంశం ఖచ్చింగా గవర్నర్‌ గిరి పై, బాబు అభిప్రాయాన్ని సేకరించడానికేనని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ వ్యవహరిస్తున్నారు. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉన్నారు. గత ఏడాదిగా రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించాలన్న ప్రతిపాదన సాగుతోంది. ఇటీవల ఈ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి కూడా, నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలి అని కేంద్రం చూస్తున్నా, ఆయన మాత్రం తెలంగాణా వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు మరో గవర్నర్ నియామకం అనివార్యమైంది. ఓ దశలో సీనియర్ బిజెపి నేత పేరును కేంద్రం పరిశీలించింది. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇంకా తుది నిర్ణయంతీసుకోలేదు.

ఈ దశలో కిరణ్ బేడీ ఆసక్తి తెరపైకొచ్చింది. నరసింహన్ లాగే బేడీ కూడా మాజీ ఐపిఎస్ అధికారే. విధుల నిర్వహణలో ఆమె నిబద్దత అంతర్జాతీయ గుర్తింపు పొందింది. సామాజిక ఉద్యమాల్లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. అవినీతి వ్యతిరేక పోరాటంలో ఆమె అగ్రభాగాన నిల్చారు. పార్టీల కంటే సిద్ధాంతాలు, విధానాలకే ఆమె విలువనిస్తారు. ప్రధాని వెూడి కూడా బేడీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి గెలిచుంటే కిరణ్ బేడీయే ముఖ్యమంత్రి అయ్యేవారు. కానప్పటికీ బేడీకి తగిన గౌరవ మర్యాదలు కల్పించాలన్న లక్ష్యంతోనే పుదుచ్చేరి గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.

ఇప్పడు కూడా బేడీ ప్రతిపాదనల్ని నరేంద్రమోడి తిరస్కరించరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహిళను రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తే చంద్రబాబు కూడా హర్షిస్తారు. అసలే ఇప్పడు దేశవ్యాప్తంగా మహిళాభ్యుదయం జోరుగా సాగుతోంది. ఇందులో చంద్రబాబు ముందుంటున్నారు. మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగని స్థాయిలో దేశంలోనే తొలి జాతీయ మహిళా పార్లమెంట్ను విజయవాడలో ఆయన అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. మహిళా బిల్లు ఆమోదానికి కూడా తాను కట్టుబడినట్లు ఆయన ప్రకటించారు. కుటంబం నుంచి పార్టీ వరకు అన్నింటా మహిళలకిస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ దశలో రాష్ట్రానికి మహిళా గవర్నర్ నియమితులైతే సానుకూల సంకేతాలే వెళ్ళే అవకాశాలున్నాయి. పైగా బేడీ బాబు ఇద్దరూ గత కొంతకాలంగా మిత్రులు. బేడీ వైఖరి చంద్రబాబుని కూడా ఆకర్షిస్తోంది. అలాగే బాబు పాలనాదక్ష తపట్ల కిరణ్‌ బేడీ అచంచల విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read